ఏపీలో 47 మార్కెట్‌ కమిటీలకు ఛైర్మన్ల ప్రకటన

ఏపీ వ్యాప్తంగా 47 మార్కెట్ కమిటీల(ఏఎంసీ)కు ఛైర్మన్లను కూటమి ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం సభ్యులతో కలిపి 705 నామినేటెడ్‌ పదవులను భర్తీ చేసింది. అభ్యర్థుల ఎంపిక కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. తాజాగా ప్రకటించిన 47 ఏఎంసీ ఛైర్మన్‌ పదవుల్లో 37 తెలుగుదేశం (TDP), 8 జనసేన (Janasena), 2 భాజపా (BJP) నాయకులకు దక్కాయి. త్వరలోనే మిగతా మార్కెట్‌ కమిటీల ఛైర్మన్లను ప్రకటించనున్నారు.