పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం

www.mannamweb.com


పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం లభించింది. రెజ్లింగ్‌లో అమన్‌ కాంస్యం సాధించారు. 57 కిలోల విభాగంలో అమన్‌ ఈ పతకాన్ని సాధించారు. ఇప్పటి వరకు భారత్‌కు ఒక రజతం, ఐదు కాంస్య పతకాలు దక్కాయి.

ఇదిలా ఉండగా, నిన్న 57 కేజీల రెజ్లింగ్ విభాగంలో అద్భుత ప్రదర్శన కనబర్చిన అమన్ సెహ్రావత్ సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. గురువారం (ఆగస్టు 08) క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో అమన్ సెహ్రావత్ 12-0తో అల్బేనియన్ రెజ్లర్‌ను ఓడించాడు. ఈ విజయంతో అమన్ కాంస్యన్ని సాధించారు.