ఏపీలో మందుబాబులకు మరో షాక్.. ఇక లేనట్లేనా?, వాళ్లకు పండగే!

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం షాపులు ప్రారంభమయ్యాయి.. మూడు రోజులుగా అమ్మకాలు ఊపందుకున్నాయి. అయితే మద్యం షాపుల పక్కన పర్మిట్‌ రూమ్‌ల వ్యవహారం ఆసక్తికరంగా మారింది. కొత్త పాలసీలో ఈ పర్మిట్ రూమ్‌లను ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని పెట్టలేదు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందనే టాక్ వినిపిస్తోంది.. అంతేకాదు ఈ నిర్ణయం కారణంగా రూ.170 కోట్ల ఆదాయం కోల్పోయింది. ఈ నిర్ణయం బార్ల యాజమాన్యాలకు కలిసొస్తోంది.. షాపుల పక్కన మద్యం తాగేందుకు పర్మిట్‌ రూమ్‌లకు అనుమతి ఇవ్వకపోవడంతో బార్లకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది.

గతంలో ప్రైవేటు పాలసీల్లో పర్మిట్‌ రూమ్‌లకు అనుమతి ఇచ్చారు.. పర్మిట్ రూమ్‌లు ఉంటే.. ఒక్కో షాపు నుంచి ప్రభుత్వానికి రూ.5 లక్షలు ఆదాయం వచ్చేది. గత ఐదేళ్లు పర్మిట్ రూమ్‌లను రద్దు చేశారు.. చంద్రబాబు సర్కార్ వచ్చాక మళ్లీ ప్రైవేటు మద్యం పాలసీ ప్రకటించినా, పర్మిట్‌ రూమ్‌లకు అనుమతి ఇవ్వలేదు. దీంతో పర్మిట్ రూమ్‌లు ఇక లేనట్లేనా అని చర్చ జరుగుతోంది. పర్మిట్ రూమ్‌లు లేకపోతే.. మద్యం షాపుల పక్కన రోడ్లపై విచ్చలవిడిగా మద్యం తాగే సంస్కృతి మొదలవుతుందంటున్నారు.

2014-2019తో పాటూ అంతకముందు కూడా ప్రైవేటు మద్యం షాపుల పాలసీలో పర్మిట్‌ రూమ్‌లు ఉండేవి. షాపు పక్కనే మద్యం తాగేందుకు చిన్న గది (పర్మిట్ రూమ్‌)ను ఏర్పాటు చేసేవారు. అక్కడ కుర్చీలు, బల్లలు లేకుండా కేవలం నిల్చొని మద్యం తాగేందుకు మాత్రమే అనుమతి ఉండేది. మద్యం షాపు యజమానులు అక్కడ వాటర్‌ ప్యాకెట్లు, గ్లాసులు, స్నాక్స్‌ వంటవివి విక్రయించడం ద్వారా అదనపు ఆదాయం వచ్చేది. అలాగే పర్మిట్‌ రూమ్‌ల వల్ల మద్యం విక్రయాలు పెరిగేవి అని చెబుతుననారు. ఈ పర్మిట్ రూమ్‌ల వల్ల వ్యాపారికి, ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూరేది. ఇప్పుడు పర్మిట్ రూమ్‌లు లేకపోవడంత ఆ ఆదాయం తగ్గింది.

అయితే మద్యం షాపుల దగ్గర పర్మిట్‌ రూమ్‌లు పెట్టుకోవాలంటే లైసెన్సీ అదనంగా ఏడాదికి రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. దాదాపు అందరూ పర్మిట్ రూమ్‌లు కావాలనే అడుగుతారు. ఆరు రోజుల క్రితం నిర్వహించిన లాటరీలో 3,396 ప్రైవేటు షాపులకు రూ.5లక్షల చొప్పున రూ.169.8 కోట్లు ఒక్క విడతలో వచ్చేవి అంటున్నారు. గీత వృత్తి కులాలకు కోసం రిజర్వ్‌ చేసిన 340 షాపులకు నోటిఫికేషన్‌ వస్తుంది.. ఈ షాపులకు రూ.17 కోట్లు వచ్చేవి. ఈ ఆదాయం మొత్తాన్ని ప్రభుత్వం కోల్పోయింది. మరి ప్రభుత్వ పర్మిట్ రూమ్‌ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది చూడాలి. పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇస్తుందా.. గత ప్రభుత్వ విధానాన్నే కొనసాగిస్తుందా చూడాలి.