AP Govt: సెలవు పెట్టి వెళ్లిపోయిన జవహర్‌రెడ్డి.. సాయంత్రంలోపు కొత్త సీఎస్‌?

AP Govt: సెలవు పెట్టి వెళ్లిపోయిన జవహర్‌రెడ్డి.. సాయంత్రంలోపు కొత్త సీఎస్‌?


అమరావతి: ఏపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సెలవుపై వెళ్లాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) జవహర్‌రెడ్డి(Jawahar Reddy)ని సాధారణ పరిపాలన శాఖ ఆదేశించింది. దీంతో ఆయన సెలవు పెట్టి వెళ్లిపోయారు. ఈ నెలాఖరును ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్‌ కూడా సెలవుపై వెళ్లారు. అనారోగ్య కారణాలతో లీవ్‌ పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. జవహర్‌రెడ్డి సెలవుపై వెళ్లిన నేపథ్యంలో సాయంత్రంలోపు కొత్త సీఎస్‌ను నియమించే అవకాశముంది. మరోవైపు ఇప్పటికీ రాజీనామా చేయని ప్రభుత్వ సలహాదారులను తక్షణమే తొలగించాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. త్వరలో మరిన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశముంది.