Allagadda: ఆళ్లగడ్డలో తెదేపా నేత ఏవీ భాస్కర్‌రెడ్డి దంపతులపై దాడి.. భార్య మృతి

Allagadda: ఆళ్లగడ్డలో తెదేపా నేత ఏవీ భాస్కర్‌రెడ్డి దంపతులపై దాడి.. భార్య మృతి


ఆళ్లగడ్డ: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మంగళవారం సాయంత్రం తెదేపా నేత ఏవీ భాస్కర్‌రెడ్డి, శ్రీదేవి దంపతులపై ప్రత్యర్థులు దాడి చేశారు. ఈ దాడిలో శ్రీదేవి మృతి చెందగా, భాస్కర్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి.

ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ఆళ్లగడ్డలో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ ఆసుపత్రిలో శ్రీదేవి భౌతికకాయాన్ని తెదేపా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పరిశీలించారు. ఘటనకు సంబంధించి పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.