Thursday, September 19, 2024

Raghubabu Arrest : ప్రముఖ సినీ నటుడు రఘుబాబు అరెస్ట్.. ఎందుకో తెలుసా..

Raghubabu Arrest : ప్రముఖ సినీ నటుడు రఘుబాబు అరెస్ట్ అయ్యారు. నల్గొండ పోలీసులు రఘుబాబును అరెస్ట్ చేశారు. ఈ నెల 17న నల్గొండ శివారులో రఘుబాబు కారు బైక్ ని ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు రఘుబాబుపై కేసు నమోదు చేశారు టూటౌన్ పోలీసులు. ఈ కేసులో రఘబాబును అరెస్ట్ చేసిన పోలీసులు.. కోర్టులో హాజరుపరిచారు. అనంతరం బెయిల్ పై సినీ నటుడు రఘుబాబు రిలీజ్ అయ్యారు.

రఘుబాబు ప్రయాణిస్తు కారు బైక్ ను ఢీకొట్టిన ఘటనలో బీఆర్‌ఎస్‌ నల్లగొండ పట్టణ ప్రధాన కార్యదర్శి సందినేని జనార్దన్‌రావు స్పాట్ లోనే చనిపోయారు. ఈ కేసులో నల్గొండ టూటౌన్ పోలీసులు రఘుబాబుని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన కొన్ని గంటల వ్యవధిలోనే బెయిల్‌పై విడుదలయ్యారు రఘుబాబు.

బీఆర్ఎస్ నేత సందినేని జనార్దన్ రావు.. కొంతమందితో కలిసి పట్టణ పరిధిలోని రిక్షా పుల్లర్స్ కాలనీ వద్ద దత్త సాయి వెంచర్ ఏర్పాటు చేశారు. ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో వెంచర్ వద్దకు వెళ్లి వస్తుండేవారు. ఈ క్రమంలోనే బుధవారం మధ్యాహ్నం సమయంలో వెంచర్ వద్దకు వెళ్లి సాయంత్రం తిరిగి వస్తుండగా ఘోరం జరిగిపోయింది. హైదరాబాద్ నుండి మిర్యాలగూడ వైపు వెళ్తున్న BMW కారు జనార్దన్ రావు వెళుతున్న బైక్ ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో జనార్దన్ రావు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన కారులో నటుడు రఘుబాబు ప్రయాణిస్తున్నారు. యాక్సిడెంట్ తర్వాత ఆయన మరో కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు. మృతుడు జనార్దన్ రావు భార్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నల్గొండ జిల్లా అద్దంకి నార్కట్ పల్లి హైవే పై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై వెళ్తున్న జనార్దన్ రావు యూటర్న్ తీసుకునే క్రమంలో సిగ్నల్ ఇవ్వలేదని రఘుబాబు కారు డ్రైవర్ తెలిపారు. స్థానికులు కూడా ఇదే విషయం చెప్పారు. ఒక్కసారిగా యూటర్న్ తీసుకునే ప్రయత్నం చేయడం, హైవైపే వేగంగా వచ్చిన బీఎండబ్లూ కారు అంతే బలంగా బైక్ ను ఢీకొందని తెలిపారు. బైక్ పై ఉన్న జనార్ధన్ రావు ఎగిరిపడ్డారు. ఆ వెంటనే చనిపోయారు.

HAL Jobs 2024: హైదరాబాద్ Hal లో భారీగా ఉద్యోగాలు.. జీతం ఎంతంటే?


నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. హైదరాబాద్‌- హాల్‌ సంస్థ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది..
ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం ఇంజనీరింగ్ పోస్టులను భర్తీ చెయ్యనున్నారు. ఈ పోస్టుల గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మొత్తం పోస్టులు – 6

అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రానిక్స్‌) పోస్టులు: 3
అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (మెకానికల్‌) పోస్టులు: 3

అర్హతలు..

గుర్తింపు పొందిన ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు..

ఈ పోస్టులకు అప్లై చేసుకొనే అభ్యర్థులకు 35 సంవత్సరాలు మించకూడదు.
జీతం..

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.30,000- రూ.1,20,000గా ఉంటుంది.

ఎంపిక విధానం..

రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు..

దరఖాస్తు విధానం..

ఆఫ్ లైన్ లో చేసుకోవాలి..

ద మేనేజర్‌ (హెచ్‌ఆర్‌) రిక్రూట్‌మెంట్‌, హిందూస్థాన్‌ ఎరోనాటిక్స్‌ లిమిటెడ్‌, ఏవియానిక్స్‌ డివిజన్‌, బాలానగర్‌, హైదరాబాద్‌ చిరునామాకు పంపాల్సి ఉంటుంది..

ఈ పోస్టుల కు అప్లై చేసుకోవాల్సిన చివరి తేదీ మే 8.. మరిన్ని వివరాలను తెలుసుకొనేందుకు అధికార వెబ్ సైట్ ను సందర్శించండి…

వైసీపీ మేనిఫెస్టోకు డేట్ ఫిక్స్… కీలక హామీ ఇదే..

2024 సార్వత్రిక ఎన్నికల సమరానికి సమయం ముంచుకొస్తోంది. నామినేషన్ల పర్వం కూడా మొదలైన నేపథ్యంలో హడావిడి పీక్స్ కి చేరింది. అయితే, ఎన్నికలకు నెలరోజుల సమయం కూడా లేని క్రమంలో ప్రధాన పార్టీలేవీ కూడా మేనిఫెస్టోను ప్రకటించకపోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఇదిలా, ఉండగా వైసీపీ మేనియాఫెస్టో ప్రకటనకు డేట్ ఫిక్స్ అయ్యిందని సమాచారం అందుతోంది. మరో రెండు రోజుల్లో వైసీపీ మేనిఫెస్టో ప్రకటన ఉంటుందని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

ప్రస్తుతం జగన్ సర్కార్ పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న నేపథ్యంలో వైసీపీ మేనిఫెస్టో మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి వైసీపీ ప్రకటించబోయే మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ కీలక పాత్ర పోషించనుంది. 2014 ఎన్నికల్లో రుణమాఫీ సాధ్యం కాదని అన్న జగన్ అప్పట్లో చంద్రబాబు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి అమలు చేయని అంశాన్ని ఎన్నికల ప్రచారంలో గుర్తు చేస్తూ వస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఈసారి మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, పెన్షన్ల పెంపు వంటి హామీలు కీలకం కానున్నాయని తెలుస్తోంది.

Health Tips: రోజంతా ల్యాప్‌టాప్‌ ముందే కూర్చుంటున్నారా..? అయితే, మీ ఆయుష్షు తగ్గినట్టే..! జాగ్రత్త..

ఈ రోజుల్లో ల్యాప్‌టాప్ ముందు కూర్చుని పని చేయడం సర్వసాధారణం. చాలా మంది సాఫ్ట్‌వేర్, ఇతర ఉద్యోగుల పని ల్యాప్‌టాప్‌లోనే జరుగుతుంది. కాబట్టి ఉదయం లేచినప్పటి నుండి పడుకునే వరకు ప్రతిదీ ల్యాప్‌టాప్‌ ఆధారంగానే జరుగుతుంది.
కానీ దీని వల్ల అనేక సమస్యలు కూడా కనిపిస్తాయి. అయితే, ల్యాప్‌టాప్‌ముందు ఎక్కువ సమయం పాటు కూర్చోవటం అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీని వల్ల ఆరోగ్యం, శ్రేయస్సుపై అనేక తీవ్రమైన ప్రభావాలను చూపుతుందని సూచిస్తున్నారు. అందుకే కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌పై పనిచేసేవారు కొన్ని విషయాలను తప్పక తెలుసుకోవాలని చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

స్క్రీన్ వైపు ఎక్కువసేపు చూస్తూ ఉండటం వలన కంటికి అసౌకర్యం కలుగుతుంది. దీంతో కల్లు పొడిబారడం, అలసట వంటివి కలుగుతుంది. మెడ, భుజం నొప్పి : కూర్చున్నప్పుడు పేలవమైన భంగిమ మెడ, భుజాలపై ఒత్తిడి తెచ్చి, అసౌకర్యం, నొప్పిని కలిగిస్తుంది. అలాగే, నిరంతర టైపింగ్, మౌస్ వాడకం కార్పల్ టన్నెల్ సిండ్రోమ్, టెండొనిటిస్, ఇతర మస్క్యులోస్కెలెటల్ సమస్యల వంటి RSIలకు దారితీసే అవకాశం ఉందంటున్నారు.
సరైన మద్దతు లేకుండా ఎక్కువసేపు ల్యాప్‌టాప్‌ ముందు కూర్చోవడం వల్ల నడుము నొప్పి, అసౌకర్యానికి దారితీస్తుంది. ఊబకాయం పెరిగే ప్రమాదం ఉంది. ఎక్కువ సమయం ల్యాప్‌టాప్ వాడకంతో ఎక్కువ సమయం కదలకుండా కూర్చోవాల్సి వస్తుంది. దాంతో బరువు పెరగడానికి, ఊబకాయానికి దారితీస్తుంది. అందుకని కనీసం అరగంటకు ఒక్కసారైనా లేచి ఒక ఐదునిమిషాలు అటూ ఇటూ నడిచి మళ్ళీ వర్క్ చేసుకోవాలి. అదే పనిగా గంటల తరబడి కూర్చుని పని చేయటం వల్ల భుజాలు, వీపు బిగుసుకుపోయినట్టు ఉంటాయి. అలాగే, వీరిలో శారీరక శ్రమ కూడా తగ్గిపోతుంది.

ల్యాప్‌టాప్ ముందు ఎక్కువ గంటలు గడపడం వల్ల శారీరక శ్రమకు లభించే సమయం తగ్గిపోతుంది. దాంతో పూర్తి శరీరం కదలకుండా నిశ్చలంగా ఉండాల్సిన వస్తుంది. ఇది మరింరత ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. కాబట్టి కూర్చున్న చోటే కూరర్చుని కొన్ని వ్యాయామాలు, ఎక్సర్సైజులు చేస్తే మంచిది. సరైన స్థితిలో కూర్చోవాలి: ఎక్కువసేపు కూర్చోవడం వల్ల సర్వైకల్ సమస్య, వెన్నునొప్పి వంటివి వేధిస్తాయి. అందుకే మన తలకు సమానంగా ఉండేలా కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌ స్క్రీన్ ఉండేలా చూసుకోవాలి. ఎప్పుడూ కంఫర్ట్ గా ఉండే కుర్చీలోనే కూర్చోవాలి.

ఎక్కువ సమయం స్క్రీన్ ముందు గడపడం వల్ల ముఖ్యంగా నిద్రపై ప్రభావం చూపుతుంది. నిద్రలేమి, నిద్రపోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. అదే పనిగా కంప్యూటర్ ముందు కూర్చుంటే కంటి సమస్యలు వస్తాయి, చర్మ సంబంధమైన సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి. ఈ ప్రభావాలను తగ్గించడానికి, క్రమం తప్పకుండా విరామం తీసుకోవడం, మంచి ఎర్గోనామిక్స్ చేయడం, సరైన భంగిమను నిర్వహించడం, శారీరక శ్రమను పెంచుకోవటం చాలా ముఖ్యం. దీంతో పాటు బ్లూ లైట్ ఫిల్టర్‌లను ఉపయోగించడం అలవాటు చేసుకోండి. లేదంటే కంటి ఒత్తిడిని తగ్గించడానికి, సాంకేతికత వినియోగం, ఇతర కార్యకలాపాల మధ్య ఆరోగ్యకరమైన సమతుల్యతను కొనసాగించడానికి స్క్రీన్ సెట్టింగ్‌లను అనుకూలంగా సర్దుబాటు చేసుకోండి.
అందుకే మన తలకు సమానంగా ఉండేలా కంప్యూటర్ స్క్రీన్ ఉండేలా చూసుకోవాలి. అదే పనిగా కంప్యూటర్ ముందు కూర్చుంటే కంటి సమస్యలు వస్తాయి, చర్మ సంబంధమైన సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి.
ఎప్పుడూ కంఫర్ట్ గా ఉండే కుర్చీలోనే కూర్చోవాలి.

అగ్రదేశాలు పక్కనపెడుతుంటే ఇండియాలోనే ఎందుకు?

లోక్సభ ఎన్నికల వేళ మరోసారి ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సాంకేతికతకు పెద్దపీట వేసే అగ్రదేశాలు సైతం ఈవీఎంలను పక్కనపెడుతుంటే ఇండియాలో మాత్రం ఎందుకు ఈవీఎంలతోనే ఎన్నికలను నిర్వహిస్తున్నారనే ప్రశ్నలు మరోసారి తెరపైకి వస్తున్నాయి.
ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం పెద్ద కష్టమేమి కాదని సైబర్ నిపుణులు స్పష్టం చేస్తుండగా…వీటిపై ఎన్నికల అధికారులు మాత్రం పెద్దగా స్పందించకపోవడం విమర్శలకు దారితీస్తోంది.

ఇప్పటివరకు ఎలక్ట్రిక్ ఓటింగ్ మిషన్ లను 31 దేశాలు పాక్షికంగా, పూర్తిగా పక్కనపెట్టేశాయి. ట్యాంపరింగ్ , హ్యాకింగ్ అనుమానాలతో ఈవీఎంలకు స్వస్తి పలికారు. ఇండియాలో రూపొందించిన ఈవీఎంలను బోట్స్ వానాలో వినియోగించగా అధికార పార్టీకి అనుకూల ఫలితాలు వచ్చేలా వీటిని తయారు చేశారనే విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఫ్రాన్స్, జర్మనీ , జపాన్, యూకే, ఐర్లాండ్, కెనడా, సింగపూర్,బంగ్లాదేశ్ ఫిన్లాండ్ వంటి దేశాల్లో ఈవీఎంలకు స్వస్తి పలికారు. కానీ, మన దేశంలో మాత్రం పెద్దఎత్తున ఆరోపణలు వస్తోన్న ఈవీఎంలతోనే ఎన్నికల నిర్వహణకు సిద్ద పడుతుండటం గమనార్హం.

ఈవీఎంలపై అనుమానంతో హ్యాకింగ్ ఎక్స్పర్ట్ హరిప్రసాద్ , అమెరికాకు చెందిన సైబర్ నిపుణుడు అలెక్స్, నెదర్లాండ్ కు చెందిన రోప్ తో కలిసి ప్రయోగాలు చేశారు. ఈ ఓటింగ్ మిషన్ ను ఎలా ట్యాంపరింగ్ చేయవచ్చో వీడియో తీసి చూపించారు. ఇలా ఈజీగా ఈవీఎంలు ట్యాంపరింగ్ గురి కావడంపై చర్యలు చేపట్టకుండా ప్రసాద్ అరెస్ట్ కు ఆదేశాలు అందటం చర్చనీయాంశం అయింది. అలాగే, మధ్యప్రదేశ్ లో ఓటర్ల అవహగన సదస్సులో ఈవీఎంలో ఏ మీటా మీద నొక్కినా బీజేపీకి ఓటు పడేలా స్లిప్పులు రావడం సంచలనం అయింది. దీంతో ఈవీఎంల పనితీరుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా ఈవీఎంలపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఎన్నికలు జరిగే ప్రతిసారి మోడీ ఎందుకు అధికారంలోకి వస్తున్నారని.. కారణం ఈవీఎంలేనని ఆరోపించారు. బ్యాలెట్ పేపర్ పై ఎన్నికలు నిర్వహించకుండా ఎందుకు ఈవీఎంలతో నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. ఈవీఎంల పనితీరుపై సందేహాలు వస్తున్నా ఎన్నికల అధికారులు మాత్రం కిమ్మనకుండా ఉండటం చర్చనీయాంశం అవుతోంది.

Gold Sale: బంగారం కొనేవారికి హెచ్చరిక..! ఈ మోసం జరగవచ్చు..

Gold Sale: బంగారం ధరలు మండిపోతున్నాయి. తులం బంగారం రూ.65 వేల కంటే దిగి రావడం లేదు. అయినా గోల్డ్ ను కొనేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. బంగారం డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని కొందరు షాపు నిర్వాహకులు కస్టమర్ల నుంచి అదనంగా డబ్బలు వసూలు చేస్తున్నారు.
ముఖ్యండా GST ని అవసరం లేని దానికి విధిస్తూ దోచుకుంటున్నారు. ఇది తెలియని కొందరు కొనుగోలుదారులు అదనంగా షాపు వారికి ముట్టజెప్పి వస్తున్నారు. కానీ దీనిపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ఇంతకీ బంగారం కొనేటప్పుడు ఎలాంటి మోసం జరుగుతుందంటే?

డిమాండ్ ఎక్కువగా ఉండడంతో బంగారం షాపులుల కోకోల్లలుగా వెలిశాయి. అయితే వినియోగదారులను ఆకర్షించడానికి తరుగు, తదితర ఛార్జీలు వేయమని చెబుతూ ఉంటారు. కొందరైతే ఎలాంటి మేకింగ్ చార్జీలు కూడా తీసుకోకుండా విక్రయిస్తామని చెబతున్నారు. కానీ కొనుగోలుదారులకు తెలియకుండా అదనంగా జీఎస్టీని విధిస్తారు. దీంతో కొందరు తక్కువ ధరకే బంగారం కొనుగోలు చేశామని అనుకున్నా.. ఓవరాల్ గా ఎక్కువే చెల్లిస్తున్నారు.

ఉదాహరణకు 50 గ్రాముల బంగారం కొనుగోలు చేశారనుకోండి. దీని ధర రూ. 3 లక్షలు అయ్యాయనుకుంది. అయితే సాధారణంగా జువెల్లరీ షాపులో బంగారం కొనుగోలు చేయడం ద్వారా ఈ బంగారం కొనుగోలుపై అదనగా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. కొనుగోలు చేసిన బంగారంపై 3 శాత జీఎస్టీని విధిస్తారు. కానీ కొందరు షాపు వారు కొనుగోలు దారులకు తెలియకుండా మేకింగ్ చార్జిలపై కూడా విధిస్తున్నారు. అయితే చాలా మంది ఇది నిజం కావొచ్చని వారు చెప్పినంత ఇస్తున్నారు. కానీ ఎప్పుడూ బంగారంపై మాత్రమే జీఎస్టీ ఉంటుంది. మేకింగ్ పై ఎటువంటి ఛార్జీలు ఉండవు. అందవల్ల బంగారం కొనుగోలు చేసేటప్పుడు ఈ విషయం కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి.

Diabetes : ఉపవాసం వల్ల షుగర్ లెవల్స్ ఎందుకు పెరుగుతాయి..? ఉపవాసంలో షుగర్‌ని నివారించడానికి మార్గాలు

Diabetes : డయాబెటిస్ ప్రపంచ జనాభాను బయపెడుతున్న వ్యాధి. ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేేకుండా పుట్టిన బిడ్డల నుంచి ప్రతి ఒక్కరు మధుమేహం బారిన పడుతున్నారు. ఒక్కసారి ఇది వచ్చిందంటే ఇక నయం కాదు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఎవరినైనా ఈ వ్యాధి బాధితులుగా చేస్తుంది. దీని కారణంగా మీరు అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో షుగర్‌ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. అయితే కొందరు ప్రత్యేక సందర్భాల్లో ఫాస్టింగ్ ఉంటారు. డయాబెటిస్‌లో ఫాస్టింగ్ షుగర్‌ని ఎక్కువగా ఉంటుంది. దీనికి గల కారణాలు ఏమిటో తెలుసుకోండి.

షుగర్ లేదా డయాబెటీస్ అనేది శరీరంలో సంభవించే ఒక వ్యాధి. ఇది ఒకసారి వచ్చినప్పుడు నియంత్రించడం తప్పా మరేమి చేయలేము. ఇన్సులిన్ అనే హార్మోన్ అసమతుల్యత వల్ల ఈ వ్యాధి సంభవిస్తుంది. ఇన్సులిన్ అనేది మన శరీర పోషణ కోసం ఆహారం నుండి కణాలలోకి గ్లూకోజ్‌ని అందించడానికి పనిచేసే హార్మోన్.

డయాబెటిక్ విషయంలో ఈ ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది లేదా సరిగ్గా ఉపయోగించబడదు. దాని కారణంగా రక్తంలో చక్కెర స్థాయి అదుపు లేకుండా పోతుంది. అప్పుడు మనకు రెండు రకాల మధుమేహం సమస్యలు వస్తాయి.

టైప్ 1 డయాబెటిస్‌ : ఇన్సులిన్ పూర్తిగా లేకపోవడం లేదా శరీరానికి ప్రతిరోజూ అవసరమైన ఇన్సులిన్ అందకపోవడం దీనికి కారణం కావచ్చు.

టైప్ 2 డయాబెటిస్ : మన శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించదు. ఈ మధుమేహం సాధారణంగా యుక్తవయస్సులో సంభవిస్తుంది. ఎందుకంటే ఈ వయస్సులో శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం ప్రారంభమవుతుంది.

ఫాస్టింగ్ వల్ల షుగర్ ఎందుకు ఎక్కువ అవుతుంది?
రోజువారీ ఆహారానికి ఎక్కువ కాలం దూరంగా ఉంచడం వల్ల ఫాస్టింగ్ షుగర్ లెవల్‌ను పెంచుతుంది. అంతే కాకుండా రాత్రిపూట ఆహారం తీసుకోకపోవడం, ఎక్కువసేపు ఆకలితో ఉండడం వల్ల ఫాస్టింగ్‌లో షుగర్ కూడా ఎక్కువ అవుతుంది.

రాత్రిపూట ఎల్లప్పుడూ తేలికపాటి ఆహారాన్ని తినండి.
ఎక్కువ స్వీట్లు తినకుండా ఉండండి.
రోజువారీ వ్యాయామం మధుమేహాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది.
కాబట్టి రోజువారీ వ్యాయామం చేయండి.
రాత్రి భోజనం చేసిన తర్వాత అరగంట పదిహేను నిమిషాలు నడవండి.
రాత్రి నిద్రపోయే ముందు ధ్యానం లేద యోగా చేయండి.
ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. చక్కెర స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుంది.
రోజంతా ఎనిమిది నుండి పది గ్లాసుల నీరు త్రాగాలి.
పడుకునే ముందు తప్పకుండా నీరు త్రాగాలి.
తప్పనిసరిగా ఉదయం, రాత్రి బ్రష్ చేయండి.

Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!

Kirana Stores: దేశంలో జనాభాకు తగిన స్థాయిలో వైద్య వ్యవస్థలు అందుబాటులో లేని సంగతి తెలిసిందే. ఇలాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం మందుల విక్రయానికి సంబంధించి కొత్త ప్లాన్‌తో ముందుకొస్తోంది.

జలుబు నుంచి తలనొప్పి వరకు ఏ చిన్న సమస్య ఉన్నా.. దానికి అవసరమైన మందులు కావాలంటే మెడికల్ షాప్ కు వెళ్లాల్సిందే. అయితే అర్థరాత్రి అకస్మాత్తుగా మందులు కావాలంటే చాలా గ్రామాల్లో పక్కన ఉండే ఊరు లేదా టౌన్లకు వెళ్లటం అసాధ్యం. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్ చొరవ తీసుకుంటోంది.

త్వరలో కిరాణా షాపుల్లో వైద్యుల ప్రిస్క్రిప్షన్ స్లిప్పులు లేని జనరిక్ మందులు విక్రయానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా లభించే మందులను దీనికింద విక్రయానికి అందుబాటులో ఉంచాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. పెయిన్ రిలీఫ్, కోల్డ్ వంటి మందులను సాధారణ కిరాణా దుకాణాల్లో కూడా అందుబాటులో ఉంచేలా నిబంధనలను మార్చటంపై కేంద్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఈ విషయంలో జలుబు, దగ్గు, యాంటాసిడ్ మందులను సాధారణ దుకాణాల్లోనే అందుబాటులో ఉంచడం వల్ల కలిగే లాభనష్టాలపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ అధ్యయనం చేస్తోంది.

భారతదేశంలో మందులను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ పేరుతో మాత్రమే పంపిణీ చేయాలనే నిబంధనలు ఉన్నప్పటికీ.. కొన్ని మందులను కౌంటర్లో విక్రయిస్తారు. కానీ ఈ విధంగా ఏ మందులు అనుమతించబడతాయో జాబితా స్పష్టంగా లేదు. అందువల్ల దీన్ని సులభతరం చేసే బాధ్యతను నిపుణుల కమిటీకి కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అతుల్ గోయల్ ఏర్పాటు చేసిన కమిటీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో దీని ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై అధ్యయనం చేస్తోంది. ఈ కమిటీ సూచన మేరకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం.

ఇప్పటికే అమెరికా, యూకే, ఆస్ట్రేలియాలో ప్రజలు సాధారణ కిరాణా దుకాణాల్లో కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా జనరిక్ మందులను కొనుగోలు చేయవచ్చు. వాటికి సరైన నియమనిబంధనలు ఉన్నాయి. ఆ విధంగా దగ్గరలో ఉన్న చిన్న కిరాణా షాపుల నుంచి కూడా మందుల షాపులకు వెళ్లకుండా.. మన దేశంలో కూడా సాధారణంగా ఉపయోగించే మందులను కొనుగోలుకు వీలు కల్పిచేలా కేంద్ర ప్రభుత్వం సవరణలను తీసుకురావాలని భావిస్తోంది. భవిశా లోక్ సభ ఎన్నికల తర్వాత దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Child Education: పిల్లల పైచదువులకు భరోసా.. ఇలా బంపర్ రిటర్న్స్.. 21 ఏళ్లు వచ్చే వరకు చేతికి రూ. 20 లక్షలు!

Child Insurance Plans: ద్రవ్యోల్బణం ప్రతి నెలా పెరుగుకుంటూ పోతున్న తరుణంలో పిల్లల చదువులు కూడా భారంగా మారుతున్నాయి. దీంతో ఈ ఆర్థిక సవాలును అధిగమించడానికి ఏం చేయాలనే ప్రశ్న అందరినీ వేధిస్తోంది. దీనికి మనం ఇప్పుడు సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారతీయుల ఆర్థిక ప్రణాళికల్లో పిల్లల చదువులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. బడిలో చేరినప్పటి నుంచి మొదలుకొని.. ఉన్నత విద్య వరకు మొత్తం ఎంత కావాలో ముందుగానే ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకోసం పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పటి నుంచే.. దీర్ఘకాలిక దృష్టితో ఎక్కువ రాబడి అందించే పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాలి. అప్పుడు మాత్రమే ఎలాంటి చిక్కులు లేకుండా పిల్లల్ని ఉన్నత చదువులు చదివించడంలో తల్లిదండ్రులు విజయం సాధించొచ్చు.

>> కాస్త పేరున్నటువంటి బడిలో పిల్లల్ని చేర్పించాలంటే సంవత్సరానికి రూ. 1.5 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇతర ఖర్చులు అదనం. స్కూల్‌లో చేర్చినప్పట్నుంచి.. ఉన్నత విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు ఖర్చు ఎంతవుతుందన్నది అంచనా ముందే వేస్కోవాలి. దీనితో ఎంత మొత్తం పెట్టుబడి పెట్టాలనే విషయంపై స్పష్టత వస్తుంది.
మొత్తం ఒకేసారి అవసరం ఉండదు కాబట్టి.. దశల వారీగా ఎప్పుడు ఎంత మొత్తం కావాలన్నది తెలుసుకుంటే.. దానికి అనువైన పథకాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు వీలవుతుంది. పిల్లల అవసరాలకు పెట్టుబడులు పెట్టేటప్పుడు.. లాంగ్ టర్మ్‌లో మంచి రిటర్న్స్ అందించే వాటినే ఎంచుకోవాలి.

>> పిల్లల చదువుల కోసం పెద్ద మొత్తంలో కూడబెట్టేందుకు ఒక పథకంపైనే ఆధారపడితే చాలదు. సేఫ్‌గా ఉండే రికరింగ్ డిపాజిట్లు మొదలు.. ఎక్కువ నష్టభయం ఉండే షేర్ల వరకు పెట్టుబడులు పెడుతుండాలి. ఈక్విటీ ఫండ్స్‌తో సహా డెట్ పథకాల్ని ఎంచుకోవాలి. ఎక్కువ నష్టభయం ఉండే ఈక్విటీ స్కీమ్స్‌కు ఎంత కేటాయించాలి.. సురక్షిత పథకాలకు ఎంత మళ్లించాలనేది కూడా కీలకం. 10-12 సంవత్సరాల వ్యవధి ఉన్నప్పుడు.. ఈక్విటీ ఆధారిత పెట్టుబడుల్ని ఎంచుకోవాలి. నాలుగైదేళ్లలోనే డబ్బు వెనక్కి రావాలనుకుంటే డెట్ పథకాల్ని పరిశీలించాలి.

ఫండ్లలోనూ మదుపు..
పిల్లల ప్రత్యేక అవసరాల్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీలు కూడా ప్రత్యేక పథకాల్ని తీసుకొస్తున్నాయి. చైల్డ్ గిఫ్ట్ ప్లాన్, చైల్డ్ కెరీర్ ప్లాన్ వంటివి ఉంటాయి. సెబీ రూల్స్ ప్రకారం వీటికి ఐదేళ్ల లాకిన్ వ్యవధి ఉంటుంది. లేకపోతే పిల్లలకు 18 ఏళ్లు నిండే వరకు పథకాలు ఉంటాయి. ఈక్విటీల్లో 65 శాతం, డెట్ ఫండ్లలో 35 శాతం వరకు మదుపు చేస్తాయి. వీటిల్లో కాస్త రిస్క్ ఉన్నప్పటికీ.. లాంగ్ టర్మ్‌లో మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పొచ్చు.

పిల్లల పేరిట పాలసీలతో..
తల్లిదండ్రుల మొదటి ప్రాధాన్యం పిల్లల కోసం పొదుపు చేయడమే. అందుకోసమే పలు పెట్టుబడి పథకాల్లో మదుపు చేస్తుంటారు. పిల్లల అవసరాలకు మొత్తం డబ్బు అందుబాటులో ఉంటుందని ఏ పథకం కూడా హామీ ఇవ్వదు. పీపీఎఫ్, మ్యూచువల్ ఫండ్లు, బంగారం, షేర్లు, రియల్ ఎస్టేట్ దేంట్లోనైనా మనం పెట్టుబడి పెడుతూ వెళ్తేనే దీర్ఘకాలంలో లాభాలు అందిస్తాయి.

>> ఉదాహరణకు ఏడాది వయసున్న అమ్మాయి లేదా అబ్బాయికి 21 ఏళ్లు వచ్చే వరకు చేతికి రూ. 20 లక్షలు కావాలనుకుందాం. దీని కోసం పేరెంట్స్.. 12 శాతం వార్షిక రాబడి వచ్చే పథకాల్లో సంవత్సరానికి కనీసం రూ. 25 వేల వరకు మదుపు చేయాల్సి ఉంటుంది. దీనిని కూడబెట్టేందుకు ఎలాంటి అనుకోని పరిస్థితులు కూడా అడ్డురావొద్దు. ఎలాంటి అవాంతరాలు లేకుండా ఉండాలంటే.. పిల్లల కోసం ప్రత్యేకంగా ఉన్న బీమా పాలసీల్ని ఎంచుకోవాలి. పాలసీల్ని కూడా పిల్లల చదువులో భాగం చేస్తే.. ఒకవేళ కుటుంబ పెద్ద మరణించిన సందర్భంలోనూ వారి చదువు అవాంతరం ఏర్పడదు.

UPSC Civils 27th Ranker Sucess Story: కోచింగ్‌ లేకుండానే.. సివిల్స్‌లో 27వ ర్యాంకు సాధించిన బీడీ కార్మికురాలి కొడుకు

కష్టపడి చదివితే సాధ్యం కానిదంటూ ఏమీ లేదంటున్నారు సివిల్స్‌ ఆలిండియా 27వ ర్యాంకర్‌ నందాల సాయికిరణ్‌. ఐదేళ్లు సివిల్స్‌ కోసం అహర్నిశలు శ్రమించారు.

ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు యూపీఎస్సీకి సన్నద్ధమయ్యారు. పేదరికం, కుటుంబ సమస్యలు ఎదురైనా తన లక్ష్యం ముందు అవేం సమస్యల్లా అనిపించలేదు. ప్రణాళిక ప్రకారం చదివితే సాధించడం కష్టమేమీ కాదంటున్నారు కరీంనగర్‌కు చెందిన సివిల్స్‌ ర్యాంకర్‌ సాయికిరణ్‌. తాను సివిల్స్‌కు ఎంపికై న తీరు, విజయం వెనకున్న ఐదేళ్ల కష్టం గురించి సాక్షితో ఇలా పంచుకున్నారు.

కల కోసం శ్రమించాను..
సివిల్‌ సర్వీసెస్‌లో చేరాలన్న నా కల కోసం చాలా శ్రమించాను. చిన్నప్పటి నుంచి సమాజానికి ఏదైనా చేయాలన్న కోరిక ఉండేది. కానీ, ఏ ఉద్యోగం చేయాలన్నది మాత్రం అప్పుడే నిర్ణయించుకోలేదు. ఆర్‌ఈసీ వరంగల్‌లో ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో చేరాను. మంచి ప్యాకేజీతో ఉద్యోగ జీవితం ప్రారంభమైంది. అయినా, ఏదో వెలితి. ఆ సమయంలో ఐఏఎస్‌ అయితే దేశానికి ఎలా సేవ చేయవచ్చో ఆలోచించాను. నా సివిల్స్‌ కలకు అక్కడే బీజం పడింది.

తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే..
మా నాన్న కాంతారావు చేనేత కార్మికుడు, అమ్మ లక్ష్మి బీడీలు కార్మికురాలు. మాది మధ్య తరగతి కుటుంబం అని నేను ఏనాడూ కలత చెందలేదు. వారి శక్తి మేరకు నన్ను, నా సోదరిని బాగా చదివించారు. వారిచ్చిన ప్రోత్సాహంతోనే ఈ రోజు నా సివిల్స్‌ లక్ష్యాన్ని చేరుకోగలిగాను.

పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం..
నేటి యువతకు సివిల్స్‌ కష్టమేమీ కాదు. కాకపోతే క్రమశిక్షణతో ప్లాన్‌ ప్రకారం చదువుకుంటూ పోవాలి. పేదరికం, కుటుంబ సమస్యలపై దిగులు పడొద్దు. పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం తప్పకుండా దరిచేరుతుంది. బోలెడంత మెటీరియల్‌ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. మాక్‌ ఇంటర్వ్యూలు కూడా ఆన్‌లైన్‌లో అటెండ్‌ అవ్వొచ్చు.

సాధిస్తానన్న నమ్మకంతో చదివా..
సివిల్‌ సర్వీసెస్‌ చదవడమంటే చాలా కష్టపడాలి. అందులోనూ కోచింగ్‌ లేకుండా, మరోవైపు ఉద్యోగం చేస్తూ చదవడమంటే మాటలు కాదు. కానీ, సాధిస్తానన్న నమ్మకంతో ప్రణాళిక ప్రకారం చదివా. సోషియాలజీని ఆప్షనల్‌గా ఎంచుకున్నాను. సొంతంగా నోట్స్‌ తయారు చేసుకున్నాను. కొంచెం ఇంటర్‌నెట్‌ నుంచి తీసుకునేవాడిని.

ఓవైపు ఉద్యోగం చేస్తూనే, మరోవైపు సివిల్స్‌కు సన్నద్ధం..
ఉద్యోగానికి వెళ్లేవాడిని. రోజూ 3 నుంచి 4 గంటలు క్రమం తప్పకుండా చదివేవాడిని. వారాంతాల్లో మాత్రం పూర్తి సమయం చదివేందుకే కేటాయించేవాడిని. అలా క్రితం సారి సివిల్స్‌లో ఇంటర్వ్యూ వరకు వెళ్లా. అక్కడ కేవలం 18 మార్కులతో సివిల్స్‌ మిస్సయ్యాను. అయినా ఏమాత్రం నిరుత్సాహ పడలేదు. జరిగిన పొరపాట్లు పునరావతం కాకుండా మరింత కట్టుదిట్టంగా చదివాను.

ముఖ్యంగా నేను రాసిన పేపర్లను థర్డ్‌ పార్టీ ఎవాల్యుయేషన్‌ చేయడం వల్ల నా సామర్థ్యం ఎప్పటికప్పుడు అంచనా వేసుకోగలిగాను. ఆన్‌లైన్‌లోనే మాక్‌ ఇంటర్వ్యూలకు ప్రిపేరవడం కలిసి వచ్చింది. సివిల్స్‌ ప్రిపేరవుతున్నా సోషల్‌ మీడియాకు దూరంగా లేను. నాకు ఎంత కావాలో అంత పరిమితి మేరకు వాడుకున్నాను.

Vivo T3x: రూ. 13వేలలో 5జీ ఫోన్‌.. ఊహకందని ఫీచర్లు..

ప్రస్తుతం 5జీ నెట్‌వర్క్‌ విస్తృతి పెరుగుతోన్న నేపథ్యంలో కంపెనీలు కొత్త స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని ఫోన్‌లను విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం వివో మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. వివో టీ3ఎక్స్‌ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఇంతకీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

వివో టీ3ఎక్స్‌ పేరుతో బడ్జెట్‌ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్‌ ధర విషయానికొస్తే 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 13,499కాగా 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 14,999గా నిర్ణయించారు. అలాగే టాప్‌ ఎండ్ వేరియంట్‌ ధర రూ. 16,499గా నిర్ణయించారు. హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 1500 తగ్గింపు అందిస్తున్నారు.

ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. 1,080×2,408 పిక్సెల్‌ రిజల్యూషన్‌ ఈ స్క్రీన్ సొంతం. 1000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఈ స్క్రీన్‌ను డిజైన్‌ చేశారు.
ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. 1,080×2,408 పిక్సెల్‌ రిజల్యూషన్‌ ఈ స్క్రీన్ సొంతం. 1000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఈ స్క్రీన్‌ను డిజైన్‌ చేశారు.
ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 SoC ప్రాసెసర్‌ను అందించారు. ఈ ఫోన్‌లో మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1TB వరకు మెమోరీని పెంచుకునే అవకాశాన్ని కల్పించారు. ఏప్రిల్‌ 24వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానుంది.

ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌ను సైడ్‌కు అందించారు.

ఇక బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 44 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 6000 ఎమ్ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఒక్క చార్జింగ్‌తో 68 గంటల వరకు ఆన్‌లైన్ మ్యూజిక్ ప్లేబ్యాక్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. అలాగే ఇందులో డస్ట్, దుమ్ము కోసం IP64 రేటింగ్‌ను ఇచ్చారు.

Arvind Kejriwal Mangoes: బెయిల్‌ కోసం మామిడిపండ్లు, స్వీట్లు తింటూ కేజ్రీవాల్‌ డ్రామా.. ఈడీ సంచలన ఆరోపణలు

ED Alleges: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి జైల్లో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కీలక ఆరోపణలు చేసింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా బెయిల్‌ రాకపోవడంతో మామిడిపండ్లు, మిఠాయిలు తిని చక్కెర స్థాయి పెంచుకుంటున్నారని ఆరోపించింది.
షుగర్‌ లెవల్స్‌ పెంచుకుని అనారోగ్యం పేరుతో బెయిల్‌కు కుట్ర పన్నుతున్నారని ఆరోపణలు చేసింది. ఈడీ చేసిన ఆరోపణలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఢిల్లీ మద్యం విధానం కేసులో ఈడీ మార్చి 21వ తేదీన అరవింద్‌ కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన తిహార్‌ జైల్లో ఉన్నారు. అయితే బెయిల్‌ కోసం ప్రయత్నాలు చేస్తుండగా కోర్టులో భంగపాటు ఎదురవుతోంది. మధుమేహంతో బాధపడుతున్న అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోగ్యం క్షీణిస్తోంది. జైలులో ఉన్న అతడి చక్కెర స్థాయిలు పడిపోతున్నాయని.. ఈ నేపథ్యంలో బెయిల్‌ ఇవ్వాలని న్యాయస్థానంలో విన్నవిస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ కోర్టులో గురువారం బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు జరిగాయి.
వాదనల సమయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ న్యాయమూర్తులు సంచలన ఆరోపణలు చేశారు. ‘అరవింద్‌ కేజ్రీవాల్‌ ఉద్దేశపూర్వకంగా మామిడిపండ్లు, మిఠాయిలు తింటున్నారు. అంతేకాదు చక్కెరతో కూడిన చాయ్‌ తాగుతున్నారు’ అని ఈడీ కోర్టులో వాదించింది. దురుద్దేశంతోనే మిఠాయిలు తింటూ చక్కెర స్థాయిలు పెంచుకుంటున్నారు అని వాదించారు. చక్కెర స్థాయి పెరిగితే వైద్యపరమైన కారణాలు చూపుతూ బెయిల్‌ పొందాలని చూస్తున్నారని ఈడీ తరఫున న్యాయవాదులు వివరించారు. అయితే ఈడీ ఆరోపణలను అరవింద్‌ కేజ్రీవాల్‌ తరఫు న్యాయవాదులు తిప్పికొట్టారు. ఆ ఆరోపణలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇవి కేవలం ఆరోపణలు మాత్రమేనని కొట్టిపారేశారు.

‘చక్కెర స్థాయి విలువలు భారీగా పడిపోతున్నాయని.. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలకోసం వారానికి మూడు సార్లు నా రెగ్యులర్‌ డాక్టర్‌ను సంప్రదించేందుకు అనుమతి ఇవ్వాలి’ అని అరవింద్‌ కేజ్రీవాల్‌ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో కేజ్రీవాల్‌కు ఏప్రిల్‌ 23వ తేదీ వరకు జ్యూడిషీయల్‌ కస్టడీ విధించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ, పంజాబ్‌లో ప్రచారం చేయాలని అరవింద్‌ కేజ్రీవాల్‌ భావిస్తున్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ పాలిస్తున్న ఈ రెండు ప్రాంతాల్లో ప్రచారం చేసి అత్యధిక స్థానాలు పొందాలనే భారీ వ్యూహంతో ఉన్న కేజ్రీవాల్‌ను అనూహ్యంగా ఈడీ అరెస్ట్‌ చేసింది. దీంతో ఆమ్‌ ఆద్మీ పార్టీ నిస్తేజంలో మునిగింది.

Post Office Jobs: పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు.. త్వరలో నోటిఫికేషన్‌! రాత పరీక్షలేకుండానే ఎంపిక

దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో 2024-25 సంవత్సరానికిగానూ గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్‌) పోస్టుల భర్తీకి ఇండియన్‌ పోస్ట్‌ సమాయాత్తం అవుతోంది. ఇందుకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గతేడాది జనవరిలో దాదాపు 40 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది కూడా వేల పోస్టులతో నోటిఫికేషన్‌ వెలువడాల్సి ఉంది. రాత పరీక్ష లేకుండానే కేవలం పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ ఖాళీలను భర్తీ చేస్తారు. అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ / ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, వికలాంగ అభ్యర్ధులకు పదేళ్ల వరకు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

పదో తరగతి మార్కుల ఆధారంగా మాత్రమే ఎంపిక ఉంటుంది. ఎంపికైనవారిని బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌ (బీపీఎం), అసిస్టెంట్‌బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌ (ఏబీపీఎం), డాక్‌ సేవక్‌.. హోదాలో విధులు సంబంధిత కార్యాలయంలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టును బట్టి రూ. 10 వేల నుంచి రూ. 12 వేల వరకు ప్రారంభ వేతనం అందజేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్ధులు రోజుకు నాలుగు గంటలు మాత్రమే పని గంటలు ఉంటాయి. వీటితోపాటు ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకుకు సంబంధించిన బీపీఎం/ ఏబీపీఎం/ డాక్‌ సేవక్‌ విధులను కూడా నిర్వహించవచ్చు. ఇందుకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్‌ రూపంలో ప్రోత్సాహం అందిస్తారు. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. పూర్తి వివరాలు అధికారిక వెబ్ సైట్ లో చెక్‌ చేసుకోవచ్చు.

Andhra Pradesh: మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?

ఒంగోలు, ఏప్రిల్‌ 19: జిల్లాలోని వివిధ ఏటీఎంలలో నగదు నింపేందుకు నగదు తీసుకెళ్తున్న సీఎంఎస్‌ వాహనంలోని ఓ వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు. వాహనంలో నుంచి రూ.64 లక్షలు చోరీ చేసి పోలీసులకు భయపడి మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో గురువారం (ఏప్రిల్‌ 18) వెలుగు చూసింది. సీఎంఎస్‌ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేవలం గంటల వ్యవధిలోనే కేసు చేధించారు. పోలీసుల తెలిపిన వివరాల మేరకు..

సీఎంఎస్‌ సెక్యూరిటీ సంస్థకు చెందిన సిబ్బంది గురువారం మధ్యాహ్నం రూ.68 లక్షలతో ఒంగోలు నుంచి బయలుదేరారు. నగదును చీమకుర్తి, మర్రిచెట్లపాలెం, దొడ్డవరం, గుండ్ల్లాపల్లి, మద్దిపాడు ప్రాంతాల్లో ఉన్న వివిధ ఏటీఎం మెషిన్లలో నింపేందుకు తీసుకెళ్తున్నారు. అయితే అదే రోజు మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో ఒంగోలులోని కర్నూలు రోడ్డు వద్ద ఉన్న ఇండియన్‌ పెట్రోల్‌ బంకు వద్ద తమ వాహనాన్ని నిలిపివేశారు. మధ్యాహ్నం కావడంతో తమ వెంట తెచ్చుకున్న భోజనం తినేందుకు బంకులోని గదిలోకి వెళ్లారు. ఇదే అదనుగా ఓ ఘటికుడు ముసుగు ధరించి వచ్చి వాహనం తాళాలు పగలగొట్టి రూ.64 లక్షల విలువ కలిగిన రూ.500 నోట్ల కట్టలను చోరీ చేసి ఉడాయించాడు. ఇంతలో సిబ్బంది భోజనాలు ముగించుకుని తిరిగి వచ్చిచూస్తూ వాహనం తలుపు తెరిచి ఉండటం గమనించారు. వెంటనే లోపల పరిశీలించగా అందులో రూ.100 నోట్ల కట్టలు మాత్రమే కనిపించాయి. రూ.500 నోట్ల కట్టలు కనిపించలేదు.

వారు తెచ్చిన రూ.68 లక్షల్లో రూ.64 లక్షలు చోరీకి గురైనట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అడిషనల్‌ ఎస్పీ (క్రైమ్స్‌) ఎస్వీ శ్రీధర్‌రావు, తాలుకా సీఐ భక్తవత్సలరెడ్డి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్‌టీమ్‌తో ఆధారాలు సేకరించడంతోపాటు సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ముసుగు ధరించిన వ్యక్తి బైక్‌పై వచ్చి వాహనంలో నగదు చోరీ చేస్తున్న దృశ్యాలు అందులో రికార్డయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితుడిని గుర్తించారు. నిందితుడు మరెవరోకాదు గతంలో సీఎంఎస్‌ సంస్థలో పనిచేసి ఉద్యోగం వదిలేసిన మహేష్‌గా గుర్తించారు. నోట్ల కట్టలతో తన స్వగ్రామమైన సంతనూతలపాడు మండలం కామేపల్లివారిపాలెంలో అతడి ఇంటికి సమీపంలో ఉన్న ఓ మర్రిచెట్టు తొఱ్ఱలో నగదు దాచిపెట్టాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. మర్రిచెట్టు తొర్రలో దాచిన నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని, నిందితుడిని అరెస్ట్ చేశారు.

Laptop Under 20000: పవర్‌ఫుల్ ల్యాప్‌టాప్‌లు.. కేవలం 20 వేల లోపే.. అద్భుతమైన ఫీచర్స్‌

(Refurbished) Lenovo థింక్‌ప్యాడ్: 7 జనరేషన్‌ 8 GB DDR4 RAM/256 GB SSD/14 Inch Laptop with Windows 11. ఈ ల్యాప్‌టాప్ ధర రూ. 89,990 అయినప్పటికీ మీరు దీన్ని అమెజాన్‌లో రూ.

17,990కి పొందవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌పై యజమాని 6 నెలల వారంటీ కూడా ఇచ్చారు.

(Refurbished) Lenovo IdeaPad: మీరు 11.6-అంగుళాల డిస్‌ప్లే, 4GB/256GB SSD స్టోరేజీ, Windows 11తో ల్యాప్‌టాప్‌ను చాలా చౌక ధరలో పొందవచ్చు. దీని ధర రూ. 28,990 అయినప్పటికీ మీరు దీన్ని అమెజాన్‌లో రూ. 18,990కి పొందవచ్చు.

 (Refurbished) HP Chromebook C640: మీరు 10వ తరం ల్యాప్‌టాప్‌ను కేవలం రూ. 16,799కి పొందవచ్చు. మీకు కావాలంటే మీరు దీన్ని నో కాస్ట్ EMIపై కూడా కొనుగోలు చేయవచ్చు. దాని నెలవారీ EMI కోసం మీరు కేవలం రూ. 814 చెల్లించాలి. ఈ ల్యాప్‌టాప్ టచ్‌స్క్రీన్ ఫీచర్‌తో వస్తుంది.

 (Refurbished) DELL: మీరు ఈ 14 అంగుళాల డెల్ ల్యాప్‌టాప్‌ను కేవలం రూ. 21,974కి పొందవచ్చు. మీరు ఎటువంటి ఖర్చు లేకుండా EMI ద్వారా Windows 11 (అప్‌గ్రేడ్ చేసిన) ల్యాప్‌టాప్‌ను కూడా కొనుగోలు చేయవచ్చు. దీని నెలవారీ EMI రూ. 1,065 మాత్రమే.

 ASUS VivoBook 15: ఈ ల్యాప్‌టాప్ అసలు ధర రూ. 33,990 అయినప్పటికీ, మీరు దీన్ని Amazon నుండి 38 శాతం తగ్గింపుతో కేవలం రూ. 20,990కి కొనుగోలు చేయవచ్చు. ఈ ల్యాప్‌టాప్ పైన పేర్కొన్న ల్యాప్‌టాప్‌ల మాదిరిగా సెకండ్ హ్యాండ్ కాదు.

ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం ఈ పండు.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తిన్నారంటే ఈ సమస్యలు పరార్…

బొప్పాయి.. ఒక రుచికరమైన, ఆరోగ్యకరమైన పండు.. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ ఎ, విటమిన్ సి, పాపైన్, ఫైబర్ వంటి మూలకాలు ఇందులో ఉంటాయి.

బొప్పాయి తినడానికి రుచిగా ఉండటమే కాకుండా మీ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.. మీరు బొప్పాయిని మీ ఆహారంలో అనేక విధాలుగా చేర్చుకోవచ్చు. అయితే ఉదయం వేళ ఖాళీ కడుపుతో దీన్ని తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, కొంతమందిక బొప్పాయిని ఖాళీ కడుపుతో తినడం హానికరమని కూడా హెచ్చరిస్తున్నారు. బొప్పాయిని ఖాళీ కడుపుతో తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలతోపాటు.. ఎవరు బొప్పాయిని తినకూడదో ఇప్పుడు తెలుసుకోండి..

ఖాళీ కడుపుతో బొప్పాయి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

NIH లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. బొప్పాయిలో ఉండే పాపైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ ఎంజైమ్ ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. దీని కారణంగా ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. బొప్పాయిని ఖాళీ కడుపుతో తినడం ద్వారా, ఈ ఎంజైమ్ మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది.. దీంతో గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యల నుంచి మీకు ఉపశమనం కలిగిస్తుంది.

నిర్విషీకరణలో సహాయపడుతుంది

బొప్పాయి ఒక సహజమైన డిటాక్సిఫైయింగ్ ఏజెంట్.. ఇందులో ఉండే ఫైబర్, విటమిన్ సి శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించడంలో సహాయపడుతుంది. అటువంటి పరిస్థితిలో, ఉదయం ఖాళీ కడుపుతో బొప్పాయి తినడం వల్ల ఈ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఇది శరీరంలోని టాక్సిన్స్ మొత్తాన్ని తగ్గిస్తుంది.. మంచి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరం రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. బొప్పాయిని ఖాళీ కడుపుతో తినడం ద్వారా, విటమిన్ సి నేరుగా రక్తప్రవాహంలోకి చేరుతుంది. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి శరీరానికి శక్తిని ఇస్తుంది.

బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది

బొప్పాయి తక్కువ కేలరీలు, ఫైబర్ అధికంగా ఉండే పండు. ఇది ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇది మీరు తక్కువ తినేలా చేయడంతోపాటు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

చర్మానికి మేలు చేస్తుంది

అధ్యయనం ప్రకారం.. బొప్పాయిలో ఉండే విటమిన్ ఎ, యాంటీఆక్సిడెంట్లు చర్మానికి చాలా మేలు చేస్తాయి. ఈ మూలకాలు చర్మ కణాలను పోషించి చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి. అలాగే బొప్పాయిని ఖాళీ కడుపుతో తినడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు, మొటిమలు, ముడతలు వంటివి చాలా వరకు అదుపులో ఉంటాయి.

ఇలాంటి వారు బొప్పాయిని ఖాళీ కడుపుతో తినకూడదు..

డయాబెటిక్ లేదా మీ రక్తంలో చక్కెరను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు బొప్పాయిని ఖాళీ కడుపుతో తినకుండా ఉండటం చాలా ముఖ్యం. ఇది కాకుండా, అలెర్జీ అయినట్లయితే, బొప్పాయిని ఏ విధంగానైనా తినడం మీకు హానికరం అని నిరూపించవచ్చు. అంతేకాకుండా.. ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే.. వైద్యులను సంప్రదించిన తరువాతే తీసుకోవాలి.

కొంపముంచిన DJ.. ఆసుపత్రిలో చేరిన 250 మంది

వేడుకేదైనా డీజే ఉండాల్సిందే. పెళ్లి వేడుక, మెచ్యూర్ ఫంక్షన్, దేవుళ్ల ఊరేగింపు, పొలిటికల్ ర్యాలీ ఏదైనా సరే.. డీజే బాక్సులు పగులిపోయేలా పెద్ద పెద్ద సౌండ్లతో ఆ ప్రాంతమంతా మారుమోగాల్సిందే.

ఇటీవల కాలంలో డీజే లేనిదే ఫెస్టివల్ కావడం లేదు. ‘డీజే కొట్టు కొట్టు.. డీజే కొట్టు’ అంటూ చిందులేయాల్సిందే. ఈ సౌండ్ కు అక్కడ ఉన్న చిన్నా, పెద్దా, ముసలి, ముతక, యువకులు ఒళ్లు మైమరచి చిందులేయాల్సిందే. సినిమా, ఫోక్ సాంగ్స్‌కు తమదైన స్టైల్లో డీజేలు కొడుతూ.. అక్కడ ఉన్నవారిని హుషారు తెప్పిస్తుంటారు. కానీ ఇదే డీజే సౌండ్స్ వల్ల సుమారు 250 మంది ఆసుపత్రి పాలయ్యారంటే నమ్ముతారా..? నిజంగా నిజం. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మహారాష్ట్రలోని క్రాంతి చౌక్‌లో ఉత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా పూణె నుండి 15 మంది డీజేలను ఆహ్వానించారు. ఇక వచ్చిన నాటి నుండి ఒకటే డీజే కొడుతూనే ఉన్నారు. ఆ డీజే సౌండ్స్ కు కుర్రాళ్లు ఉర్రూతలూగిపోయారు. వారి హుషారు చూసి డీజేలు సైతం మరింత సౌండ్స్ పెంచారు. హోరెత్తే మ్యూజిక్‌తో పాటు బాక్సులు బద్దలు అయ్యే విధంగా సౌండ్స్ పెంచడంతో చుట్టు ప్రక్కల పెద్ద వాళ్లకు చెవులు దెబ్బలు తిన్నాయి. చిల్లలు పడేలా మ్యూజిక్ వస్తుంటే.. మరింత జోష్‌గా డ్యాన్సులు, స్టెప్పులతో మరింత ఊగిపోయారు. ఇక మెల్లిగా తలలు మొద్దుబారడం ప్రారంభం అయ్యాయి.

నెమ్మదిగా చెవులు వినిపించడం మానేశాయి. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. చెవ్వుల్లో గియ్ మనే శబ్దం తప్ప మరేమీ వినిపించడం లేదు. ఇంట్లో ఎవరు ఏదీ చెప్పినా వినబడం లేదు. కొంత మందికి చెవి పోటు కూడా మొదలైంది. దీంతో మెల్లిగా ఆసుపత్రిలో చేరడం మొదలు పెట్టారు. ఆ చుట్టు ప్రక్కల ప్రాంతంలోని ప్రజలు మెల్లిగా ఆసుపత్రిలో చేరారు. అలా 250 మంది హాస్పిట్లలో చేరారు. ఈ విషయం పోలీసుల చెంతకు చేరింది. ఏం జరిగిందని తెలిసి.. విచారణ చేపట్టారు. డెసిబెల్స్ సౌండ్స్ 150 దాటిందని గుర్తించి, శబ్ద కాలుష్యానికి కారణమైన వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఇప్పటికీ కొంత మంది చికిత్స పొందుతున్నారని తెలిసింది.

యూజర్లకు గుడ్ న్యూస్.. 15, 000 Loan ఇస్తున్న GPay.. పొందడం ఎలా అంటే?

ఓ వైపు పెరుగుతున్న ఖర్చులు, మరోవైపు చాలీ చాలనీ జీతాలు టెన్షన్ క్రియేట్ చేస్తున్నాయి. వచ్చే ఆదాయం ఖర్చులకు సరిపోకపోవడంతో అప్పులు చేస్తున్నారు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి లోన్స్ తీసుకుంటున్నారు. మరి మీకు కూడా అర్జెంట్ గా డబ్బులు కావాలంటే గూగుల్ పే నుంచి సులభంగానే పొందొచ్చు. యూజర్లకు గూగుల్ పే రూ. 15,000 అందిస్తోంది. ఈ డబ్బులను ఎలా పొందాలంటే?

గూగుల్ పే అందుబాటులోకి వచ్చాక చెల్లింపులన్నీ ఆన్ లైన్ లో జరుగుతున్నాయి. కోట్లాది మంది యూజర్లను కలిగిన గూగుల్ పేలో నిత్యం వేల కొద్ది ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ఇక గూగుల్ పే తన యూజర్ల కోసం లోన్ అందిస్తోంది. దాని కోసం శాచెట్ లోన్ అనే ప్లాన్ తీసుకొచ్చింది. దీని ద్వారా రూ. 15000 వరకు లోన్ తీసుకోవచ్చు. చిన్న వ్యాపారుల కోసం ఈ లోన్ తీసుకొచ్చినట్లు గూగుల్ పే తెలిపింది. గూగుల్ పే వాడే వారికి ఈ లోన్ ఇచ్చేందుకు డీఎంఐ ఫైనాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది గూగుల్ పే. శాచెట్ లోన్ ను 7 రోజుల నుంచి 12 నెలల్లో చెల్లించొచ్చు. ఈ లోన్ ను పొందేందుకు ఎక్కువగా డాక్యుమెంట్స్ అవసరం లేదు.. ఈజీగానే పొందొచ్చు.

గూగుల్ పే ఇచ్చే రుణంపై వడ్డీ రేటు సంవత్సరానికి 14 శాతం నుంచి 36 శాతం వరకూ ఉంటుంది. 18 ఏళ్లు, ఆపై ఉన్నవారికే ఈ లోన్ ఇస్తారు. 30 వేల ఆదాయం కంటే తక్కువ ఉన్న వారికి లోన్ పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, పాన్ కార్డు ఉండాలి. దరఖాస్తు దారు సిబిల్ స్కోర్ కనీసం 750 ఉండాలి. ఈ రుణాల్ని రూ. 111 నుంచి రీపేమెంట్ అమౌంట్‌తోనే తిరిగి చెల్లించొచ్చని గూగుల్ పే వెల్లడించింది.

ఎలా పొందొచ్చంటే?

గూగుల్ పే బిజినెస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. తర్వాత లోన్ ఆప్షన్ ఎంచుకోవాలి. అక్కడ మీరు గూగుల్ పే శాచెట్ లోన్ ఎంచుకొని ఎంత రుణం కావాలో వివరాలు ఇవ్వాలి. అవసరమైన సమాచారం అందించిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే అప్లికేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత కొన్ని నిమిషాల్లోనే లోన్ మంజూరవుతుంది. ఈ లోన్ తో మీ తక్షణ అవసరాలను తీర్చుకోవచ్చు.

Heatwave Alert : మరో 3 రోజులు జాగ్రత్త, ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ కేంద్రం వార్నింగ్

Heatwave Alert : తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోంది. భానుడు భగభగ మండిపోతున్నాడు. మాడు పగిలే రేంజ్ లో ఎండలు విజృంభిస్తున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. తెలంగాణలో మరో 3, 4 రోజులు వడగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించింది.

తెలంగాణలో మరో 3 రోజులు వడగాల్పులు..
రానున్న రెండు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ(ఏప్రిల్ 17) కొమురం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలలో అక్కడ వడగాలులు వీచాయి. ఇక రేపు(ఏప్రిల్ 18) ఉమ్మడి ఆదిలాబాద్ తో పాటు రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలలో అక్కడక్కడ వడగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్లుండి(ఏప్రిల్ 19) ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలలో వడగాలులు వీస్తాయంది. అలాగే ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందంది.

రానున్న 2 రోజులు అధిక ఉష్ణోగ్రతలు..
పెరుగుతున్న పగటి పూట ఉష్ణోగ్రతలతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఏపీ, తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాలుల తీవ్రత కూడా అధికమైంది. తెలంగాణలో 70శాతం ప్రాంతాలలో 40 డిగ్రీలకు పైగా టెంపరేచర్ నమోదవుతోంది. ఉత్తర తెలంగాణలో 42 నుంచి 44 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి.

నిప్పుల కొలిమిలా ఏపీ..
ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారాయి. సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉక్కపోతతో జనం విలవిలలాడుతున్నారు. అన్ని చోట్ల పగటి ఉష్ణోగ్రతల తీవ్రత 40 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఏపీలో 33 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 113 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

AP Another Wicket out: ఈసీ ఆదేశాలు, వెంకట్రామిరెడ్డిపై వేటు, ఏం జరిగింది?

AP Another Wicket out: ఏపీలో ఎన్నికల వేళ వైసీపీ అధినేత జగన్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. జగన్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేస్తున్న అధికారులపై వేటు పడుతోంది.. ఆ వ్యవహారం కంటిన్యూ అవుతోంది. తాజాగా ఈ జాబితాలోకి రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వంతైంది.

ఎన్నికల సంఘం ఆదేశాలతో ఆయన్ని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ప్రధాన కార్యాలయం విడిచి వెళ్లదారని హెచ్చరించింది కూడా. సచివాలయంలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి విభాగంలో సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడి పదవితోపాటు ఉద్యోగుల సమాఖ్యకు ఛైర్మన్‌గా ఉన్నారు.

ఎన్నికల కోడ్‌కు ముందు, కోడ్ తర్వాత అధికార పార్టీకి అనుకూలంగా వెంకటామిరెడ్డి వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఉమ్మడి కడప జిల్లాలో మార్చి 31న బద్వేలు ఆర్టీసీ డిపోలో వైసీపీ తరపున ఆయన ప్రచారం చేశారు. మార్చి ఏడున చిత్తూరు నియోజకవర్గంలో వైసీపీ ఇన్‌ఛార్జ్ విజయానంద రెడ్డి నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మీయ సమావేశానికి ఆయన హాజరయ్యారు. అంతేకాదు వైసీపీకి అనుకూలంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. మార్చి ఎనిమిదిన అనంతపురంలోని వార్డు సచివాలయ ఉద్యోగులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో ఆయనపై టీడీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వెంటనే స్పందించిన ప్రభుత్వం.. వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు సచివాలయంలోని ఉద్యోగులే బహిరంగంగా చెబుతున్నారు. ఈ క్రమంలో వెంకటరామిరెడ్డిపై వేటు వేయడం వైసీపీకి ఊహించని షాక్‌గా చెబుతున్నారు ఆ పార్టీ నేతలు.

బంపరాఫర్ : పరీక్ష లేకుండానే ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు..నెలకు రూ. 151000 జీతం

ఇంటెలిజెన్స్ బ్యూరో (IB)లో ఉద్యోగం చేయాలనేది చాలామందికి ఓ డ్రీమ్. అయితే ఇప్పుడు ఆ కలను నెరవేర్చుకునే సమయం వచ్చింది. ఐబీలో మొత్తం 660 వివిధ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది.

ఆసక్తి,అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ mha.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఈ పోస్టులకు మే 30 లోపు లేదా అంతకు ముందు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అప్లయ్ చేయడానికి పోస్టుల వివరాలు,అర్హత,జీతం,ఎంపిక ప్రక్రియ తదితర వివరాలు తెలుసుకోవడం ముఖ్యం. వాటన్నింటికి సంబంధించిన సమాచారం ఇక్కడ ఉంది చూడండి.

పోస్టుల వివరాలు

ACIO-I/Exe- 80 పోస్ట్‌లు

ACIO-II/Exe- 136 పోస్ట్‌లు

JIO-I/Exe- 120 పోస్ట్‌లు

JIO-II/Exe- 170 పోస్ట్‌లు

SA/XE – 100 పోస్ట్‌లు

JIO-II/Tech- 8 పోస్టులు

ACIO-II/సివిల్ వర్క్స్- 3 పోస్టులు

JIO-I/MT- 22 పోస్ట్‌లు

కుక్- 10 పోస్టులు

కేర్‌టేకర్ – 5 పోస్టులు

PA (పర్సనల్ అసిస్టెంట్) – 5 పోస్టులు

ప్రింటింగ్- ప్రెస్-ఆపరేటర్- 1 పోస్ట్

మొత్తం పోస్టుల సంఖ్య- 660

అర్హత

ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే ఏ అభ్యర్థి అయినా అధికారిక నోటిఫికేషన్‌లో ఇవ్వబడిన సంబంధిత అర్హతలను కలిగి ఉండాలి. అప్పుడే వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా పరిగణించబడతారు.

—- Polls module would be displayed here —-

నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్‌ని ఇక్కడ చూడండి

IB Recruitment 2024 నోటిఫికేషన్

IB Recruitment 2024 అప్లయ్ చేయడానికి లింక్

జీతం

ACIO-I/Exe (లెవల్ 8): రూ. 47,600 నుండి రూ. 1,51,100

ACIO-II/Exe (లెవల్ 7): రూ. 44,900 నుండి రూ. 1,42,400

JIO-I/Exe (లెవల్ 5): రూ. 29,200 నుండి రూ. 92,300

JIO-II/Exe (స్థాయి 4): రూ. 25,500 నుండి రూ. 81,100

SA/XE (లెవల్ 3): రూ. 21,700 నుండి రూ. 69,100

JIO-II/Tech (లెవల్ 4): రూ. 25,500 నుండి రూ. 81,100

ACIO-II/సివిల్ వర్క్స్ (లెవల్ 7): రూ. 44,900 నుండి రూ. 1,42,400

JIO-I/MT (లెవల్ 5): రూ. 29,200 నుండి రూ. 92,300

కుక్ (స్థాయి 3): రూ. 21,700 నుండి రూ. 69,100

కేర్‌టేకర్ (లెవల్ 5): రూ. 29,200 నుండి రూ. 92,300

PA (స్థాయి 7): రూ. 44,900 నుండి రూ. 1,42,400

ప్రింటింగ్-ప్రెస్-ఆపరేటర్ (లెవల్ 2): రూ. 19,900 నుండి రూ. 63,200

10th, ITI పాసైతే చాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే రైల్వేలో ఉద్యోగాలు

ప్రభుత్వ ఉద్యోగం సాధించడమంటే ఈ రోజుల్లో అంత సులభమేమీ కాదు. ఎందుకంటే ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కూడా లక్షలాది మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. గవర్నమెంట్ జాబ్స్ కు కాంపిటీషన్ ఓ రేంజ్ లో ఉంది. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగం కోసం నెలలు, సంవత్సరాలు సన్నద్ధమవ్వాల్సి ఉంటుంది. రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు ఎదుర్కొన్నాక అప్పుడు జాబ్ వరిస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో అసలు పరీక్ష రాయకుండానే రైల్వేలో ఉద్యోగం పొందే అవకాశం వచ్చింది. కేవలం మీరు పదోతరగతి, ఐటీఐ ఉత్తీర్ణులైతే చాలు ప్రభుత్వ ఉద్యోగాన్ని మీ సొంతం చేసుకోవచ్చు.

చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ భారతదేశ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న లోకోమోటివ్ వర్క్స్ కర్మాగారం. ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉంది. కాగా ఇటీవల చిత్తరంజన్‌లోని చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ 2024-25 సంవత్సరానికి 492 యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అప్రెంటిస్ వెబ్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో ఏప్రిల్ 18లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష లేదు. విద్యార్హతలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
ముఖ్యమైన సమాచారం:
యాక్ట్‌ అప్రెంటిస్ పోస్టుల సంఖ్య:
492
ట్రేడుల వారీగా ఖాళీలు:
ఫిట్టర్- 200
టర్నర్- 20
మెషినిస్ట్- 56
వెల్డర్(జీ&ఈ)- 88
ఎలక్ట్రీషియన్- 112
రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ మెకానిక్స్- 04
పెయింటర్(జీ)- 12
అర్హత:
పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి:
27.03.2024 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం:
ఆన్‌ లైన్
ఎంపిక విధానం:
విద్యార్హతలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
స్టైఫెండ్:
రైల్వే బోర్డ్ నిబంధనల ప్రకారం స్టైఫండ్ అందిస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:
18-04-2024.

ఓటుకు నోటు కేసు విచారణ మరోసారి వాయిదా

ఓటుకు నోటు వ్యవహారంపై సీబీఐ విచారణ చేపట్టాలన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది.

సుప్రీంకోర్టు వేసవి సెలవుల అనంతరం కేసు విచారణ చేపడతామని జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎస్విఎన్ భట్టిల ధర్మాసనం తెలిపింది. జూలై 24న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ కేసులో చట్టానికి సంబంధించి అనేక అంశాలు ముడిపడి ఉన్నాయని.. ఆ వివరాలను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమయం కోరింది. రెండు వారాల్లో కేసుతో ముడిపడి ఉన్న చట్టపరమైన అంశాలతో కూడిన వివరాలను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమయం కోరింది. రెండు వారాల తర్వాత సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు వస్తున్నాయని కేసు విచారణ పూర్తిస్థాయిలో జరగటానికి అవకాశం లేదు కాబట్టి సెలవులు అనంతరం తీసుకోవాలని సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్ర కోర్టును కోరారు.

Bitcoin scam case: బిట్ కాయిన్ ఇష్యూ, బుక్కైన శిల్పాశెట్టి దంపతులు, ఆస్తుల సీజ్

Bitcoin scam case: బాలీవుడ్ నటి శిల్పాశెట్టికి కష్టాలు తప్పడం లేదు. బిట్ కాయిన్ పోంజీ కేసు ఈ దంపతులను వెంటాడుతోంది. ఏడేళ్లుగా ఈ కేసు సాగుతూ వస్తోంది. ఇందులోభాగంగా శిల్పా దంపతులకు చెందిన దాదాపు 98 కోట్ల రూపాయల ఆస్తులను సీజ్ చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. ముంబైలో జుహూ ఏరియాలో ప్లాట్‌, పూణెలోని ఓ బంగ్లా సహా మొత్తం 98 కోట్ల రూపాయల విలువైన స్థిర, చరాస్తులను అటాచ్ చేస్తూ నోటీసులు ఇచ్చింది ఈడీ.

ముంబైకి చెందిన వేరియబుల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 2017లో బిట్ కాయిన్ పోంజీ స్కీమ్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో పెట్టుబడిపెడితే నెలకు 10శాతం లాభాలు వస్తాయన్నది అందులోని లోగుట్టు. దీని ద్వారా మల్టీలెవన్ మార్కెటింగ్ పద్దతిలో అమాయకుల నుంచి దాదాపు 6 వేల 600 కోట్ల రూపాయల వరకు వసూలు చేశారు శిల్పాశెట్టి దంపతులు. మొదట్లో లాభాలు వచ్చినట్టు చూపించారు. చివరకు అసలు మోసం బయటపడింది. సంస్థ ప్రమోటర్లపై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.
ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేయగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీనికి మాస్టర్ మైండ్ అమిత్ భరద్వాజ్ నుంచి శిల్పా భర్త రాజ్‌కుంద్రా 285 బిట్ కాయిన్స్ తీసుకున్నట్లు ఈడీ పేర్కొంది. అంతేకాదు ఉక్రెయిన్‌‌లో ఓ మైనింగ్ ఫామ్‌ను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసినట్టు ప్రస్తావించింది. ప్రస్తుత ఆయన వద్దనున్న బిట్ కాయిన్స్ విలువ మార్కెట్ ప్రకారం 150 కోట్ల రూపాయలుగా పేర్కొంది. ఈ క్రమంలో ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ.

ఈ కేసు మాత్రమే కాదు శిల్ప భర్త రాజ్‌కుంద్రాపై మరో కేసు ఉంది. సినిమాల పేరిట యువతులను బలవంతం చేసి అశ్లీల వీడియోలు షూట్ చేయించారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనపై గతంలో పోలీసులు కేసు నమోదు చేశారు. కొద్దిరోజులపాటు జైలులో ఉన్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా కుంద్రా తన పేరిట ఉన్న ఆస్తులను తన వైఫ్ శిల్పాశెట్టి పేరు మీదగా ట్రాన్స్‌ఫర్ చేసినట్టు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి.

రైతులకు గుడ్ న్యూస్.. అకౌంట్లోకి 10వేల రూపాయలు!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలు నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకల హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి తొలి సంతకం ఆరు గ్యారెంటీ పథకాలపైనే చేశారు. ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు ప్రారంభించారు. సీఎం గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా రైతులకు గుడ్ న్యూస్ తెలిపింది తెలంగాణ ప్రభుత్వం. వివరాల్లోకి వెళితే..

రైతులకు శుభవార్త తెలిపింది తెలంగాణ ప్రభుత్వం. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా కొంతమంది రైతన్నలు పంట నష్టాన్ని చూశారు. ముఖ్యంగా మామిడి, నిమ్మ, బత్తాయి లాంటి పంటలు తీవ్రంగా నష్టపోయాయి. రైతులకు జరిగిన నష్టంపై స్పందించిన రేవంత్ రెడ్డి సర్కార్ బాధిత రైతులను ఆదుకోవడానికి ముందుకు వచ్చారు. ఇటీవల ప్రతిపక్ష నేతల కేసీఆర్ క్షేత్ర స్థాయిలో పంటలపై పరిశీలన చేసి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరారు. బాధిత ప్రాంతాలను సందర్శించిన మంతులు లక్ష చొప్పున పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఎకరాకు పది వేల చొప్పున జమచేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది.

15వేల 814 ఎకరాలలో 15,266 మంది రైతులు పంట నష్టపోయారని తెలంగాణ సర్కార్ అంచనా వేసింది. ఇప్పటికే 15.81 కోట్ల పరిహారం అందించగా.. లోక్ సభ ఎన్నికల కోడ్ నియమావళి ప్రకారం ఎన్నికల కమిషన్ అనుమతితో రైతుల ఖాతాల్లోకి పరిహారం జమ చేయడం జరుగుతుందని అంటున్నారు. ఈసీ పరిమిషన్ ఇస్తే వెంటనే అకౌంట్లో పదివేలు జమ చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన ప్రతి ఒక్క హామీకి కట్టుబడి ఉన్నామని అంటున్నారు. ఆగస్టు 15 లోపు రైతు రుణాలలో రెండు లక్షల వరకు రుణమాఫీ.. అలాగే వరికి 500 బోనస్ వచ్చే సిజన్ లో అమలు చేయనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లపుడు రైతు పక్షం ఉంటుందని.. ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి తెలిపారు.

Sasaram Railway Station ఇలాంటి రైల్వే స్టేషన్ దేశంలో ఇదొక్కటే!

Sasaram Railway Station ఇలాంటి రైల్వే స్టేషన్ దేశంలో ఇదొక్కటే..

ఇది బీహార్ లోని ససారం రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ ఫోటో. ఇది విపరీతంగా వైరల్ అవుతున్న ఫోటొ. ఈ స్టేషన్ లో భారీ సంఖ్యలో విద్యార్థులు సీరియస్ గా చదువుకుంటూ ఉండటం, చర్చించుకుంటూ ఉండటం కనిపిస్తుంది. ఇదొక అసాధారణ పరిస్థితి. రైలు వచ్చే ముందు లేదా పోయే ముందు జనం గుంపు ఉండటం చూశాం కానీ ఇలా తిష్ట వేసి కూర్చుని సీరియస్ గా చదువుకుంటూ ఉండటం ఎక్కడా చూడం. అదే వింత. అందుకే ఫోటో వైరలవుతూ ఉంది. సాధారణంగా ఇలాంటి దృశ్యాలు రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాం మీద కనిపించవు. పరీక్షలపుడు ఒకరిద్దరు పుస్తకం చదువుతూ రైలుకోసం ఎదుచూస్తూండం కనిపిస్తుంది. అయితే, ససారం స్టేషన్ లో కనిపిస్తున్నది అరుదైన దృశ్యం. సాధారణంగా యూనివర్శీటీ క్యాంపస్ లలో ఇలాంటి దృశ్యం కనిపిస్తుంది.
ఇంతకీ అక్కడేం జరుగుతూ ఉంది?

ఈ మధ్య కాలంలో ‘ససారం’ బాగా పాపులర్ అయిన మాట. పోటీ పరీక్షలు రాసే వాళ్లకు, రాజకీయ పరిణమాలు గమనిస్తూన్న వాళ్లకు బాగ పరిచయమున్న మాట. ఇదొక పార్లమెంటు నియోజకవర్గం. బాబు జగ్జీవన్ రామ్ (ఏప్రిల్ 5, 1908- జూలై 6,1986) ఇక్కడి నుంచే పోటీ చేసే వారు. ఆయన ఆ ప్రాంతంలో తిరుగులేని నాయకుడు. బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో బాబూ జగ్జీవన్ రామ్ రక్షణ మంత్రిగా ఉన్నారు. తర్వాత ఉప ప్రధాని అయ్యారు. ఒక దశలో ప్రధాని పదవికి కూడా ఆయన పేరు వినిపించింది. అంతకంటే ముఖ్యంగా ఆయన జవహర్ లాల్ నెహ్రూ ప్రొవిజినల్ ప్రభుత్వంలో, తర్వాత క్యాబినెట్ లో కార్మిక మంత్రి అయ్యారు. ఇందిరా గాంధీ హయాంలో కాంగ్రెస్ వదిలేసి జనతా పార్టీలో చేరారు. ప్రతి ఎన్నికలో ఆయన రికార్డు మెజారిటీతోనే గెలిచేవారు. అందుకే ససారం అంతర్జాతీయ వార్త అయ్యేది. ఆయనకు పోలయిన ఓట్లను ఎంచడం కష్టం, తూకం వేయాల్సిందే అనే జోక్ చేసే వారు. ఉదాహరణకు 1971 పార్లమెంటు ఎన్నికలో పోలయిన 314,201 ఓట్లలో జగ్జీవన్ రామ్ కు 210,353 ఓట్లొచ్చాయి.

చరిత్ర విద్యార్థులకు కూడా ససారం పేరు బాగా తెలిసే ఉంటుంది. షేర్ షా సూరి చక్రవర్తి పేరు విన్నారు కదా!. 1530-1540 మధ్య మొగల్ సామ్రాజ్యాన్ని అక్రమించి సూరి రాజ్యాన్ని స్థాపించిన ఆఫ్గన్ దేశస్తుడు షేర్ షా సూరి. ఆయన రాజధాని ససారం. ఇక్కడ ఇప్పటికీ ఆయన సమాధి (కింది ఫోటో) ఉంది. ఇది శిధిలావస్థలో ఉంటుంది. భారతదేశంలో రుపాయ కరెన్సీ ప్రవేశపెట్టింది షర్ షా సూరియే.

గతమెంతొ ఘనకీర్తి ఉన్నాససారం ఎన్నికలపుడు తప్ప మరొకపుడు వినిపించని పేరు. చిత్రంగా ఈ ఫోటోతో మరొక సారి ససారం పెద్ద వార్తయింది.

ఇంతకీ విద్యార్థులెవరు?

ఫోటోలో కనిపిస్తున్న వాళ్లంతా రకరకాల సివిల్ సర్వీసెస్, బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు. ప్రతిరోజు వీరితో రైల్వే స్టేషన్ లోని ఒక మూల 1, 2 ప్లాట్ ఫామ్ లు ఇలా రెండు గంటల పాటు రద్దీగా తయారవుతాయి . వందల సంఖ్యలో విద్యార్థులు యమ బిజీగా కనిపిస్తారు. రైల్వే స్టేషన్ లో ఏం జరుగుతున్నదో కూడా పట్టించుకోకుండా పుస్తకాల్లో దూరో, చర్చల్లో మునిగో కనిపిస్తారు. ససారం చుట్టుపక్కల పల్లెలనుంచి పట్టణాలనుంచి వందల సంఖ్యలో ఇలాస్టేషన్ కు వస్తారు. చీకటి పడితే కరెంటు స్తంబాల లైట్ల వెలుగులో చదువుకుంటారు. పొద్దున పూట ప్లాట్ ఫారం మొత్తం వీల్లే కనబడతారు.
కారణం, ఈ ప్రాంతం నుంచి పోటీ పరీక్షలలో పాసయిన వారు, పాస్ కాకపోయినా పరీక్షలు రాసి అనుభవం సంపాదించిన వాళ్లు ఇక్కడి వచ్చి ఔత్సాహికులకు శిక్షణ ఇవ్వడం. ఇది ఇలాంటి ఔదార్యానికి చాలా పేరు. సీనియర్లు జూనియర్లకు సహకరించడం బీహార్ సంప్రదాయమేమో అనిపిస్తుంది. ఆనంద్ కుమార్ సూపర్ 30 ఐఐటి కోచింగ్ తెలుసు కదా. ససారం పరిసరాలు మావోయిస్టు రాజకీయాల ప్రభావం ఉన్న గ్రామాలు. బీహార్ లో బాగా వెనకబడిన ప్రాంతం. ససారం చరిత్ర గొప్పది గాని, వర్తమానం దుమ్ము గొట్టుకు పోతున్నది. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకుంటే చాలు, జీవితం ప్రశాంతంగా సాగుతుందని ఇక్కడ ప్రజల్లో నమ్మకం. అందుకే ఈ పిల్లలు ప్రభుత్వోద్యోగాల పోటీ పరీక్షలకు సీరియస్ ప్రిపేర్ అవుతుంటారు. వీళ్లందరికి ససారం స్టేషన్ హబ్ గా మారింది.

2002-2003 లో ఒక అరడజన్ మంది విద్యార్థులతో ఇది మొదలయింది. ఒక దశలో 1200 మంది విద్యార్థుల దాకా చేరింది. వీరంతా స్టేషన్ కే ఎందుకొస్తున్నారు? తమ వూర్లలో రాత్రిళ్లు చదువుకునేందుకు వీలుండదు. కరెంటు సదుపాయం లేకపోవడం, ఉన్నా ఎపుడొస్తుందో ఎపుడు పోతుందో తెలియని పరిస్థితి. రైల్వే స్టేషన్ లో 24X7 కరెంటు అందుబాటులో ఉంటుంది. అందువల్ల రాత్రి పొద్దుపోయే దాకా చదువుకునేందుకు, తెల్లవారుజామున లేచి చదువుకునేందుకు ఇక్కడ అనుకూలంగా ఉంటుంది. అందువల్ల వీరంతా స్టేషన్ ని కోచింగ్ సెంటర్ గా స్టడీ సెంటర్ గా చేసుకున్నారు.

పోటీ పరీక్షల్లో నెగ్గేందుకు ఈ విద్యార్థుల పడుతున్న శ్రమ చూసి రైల్వే శాఖ సహకారం అందించింది. వీరిలో చాలా మందికి పాస్ లు అందించింది. అంటే వీళ్ల దగ్గిర ప్లాట్ ఫామ్ లేదన్న భయం అవసరం లేదు. వీళ్లు మీద ఈ ప్లాట్ ఫాం మీద ఎంతసేపయిన ఉండవచ్చు. కొంత మంది విద్యార్థులు పొద్దున రెండు గంటలు కోచింగ్ తీసుకు తమ వూర్లకు వెళ్లిపోతే, కొందరేమో స్టేషన్ లో దినమంతా ఉండి చదువుకుని సాయంకాలం వెళ్లిపోతారు. మరికొందరు స్టేషన్ సమీపంలో ససారంలోనే గదులు అద్దెకు తీసుకున్నారు. వాళ్లు నిద్రపోయేందుకు మాత్రం రూమ్ కు వెళతారు. ప్రిపరేషనంతా ప్లాట్ ఫాం మీదే.

Increase Eyesight: కళ్లు తరచుగా మసక బారుతున్నాయా.. ఇలా చేయాండి 10 రోజుల్లో సమస్యలన్నీ దూరమవుతాయి..!

How To Increase Eyesight: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్యకరమైన ఆహార తీసుకుంటున్నారు. దీని వల్ల కంటి సమస్యలు, మధుమేహం వంటి సమస్యల బారిన పడుతున్నారు.
అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఆహారంపై శ్రద్ధ వహించాలని నిపుణులు తెలుపుతున్నారు. ఇలా చేయడం వల్ల కంటి చూపు మెరుగు పడడమే కాకుండా.. అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కంటి చూపు మెరుగు పడడానికి క్రమం తప్పకుండా నట్స్, పండ్లను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇంకా కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా కంటి చూపు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

వాల్నట్స్‌:

వాల్నట్స్‌లో చాలా రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా కళ్లకు మేలు చేసే చాలా రకాల పోషకాలు ఇందులో ఉంటాయి. కావున వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయని నిపుణులు అభిప్రాయడుతున్నారు.

ఇందులో విటమిన్లు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ వంటి మూలకాలు అధిక పరిమాణంలో ఉంటాయి. ఇవి కళ్లను మెరుగు పరచడానికి సహాయపడుతాయి.

బాదం:

బాదంలో జ్ఞాపక శక్తికిని పెంచే చాలా రకాల మూలకాలు ఉంటాయి. అంతేకాకుండా కంటి చూపును పెంచే చాలా రకాల పోషక విలువలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్-ఇ పుష్కలంగా లభిస్తుంది.

ఇవి రోజూ తీసుకోవడం వల్ల కంటిచూపును పెంచడమే కాకుండా కంటి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కావున కంటి సమస్యలతో బాధపడే వారు తప్పకుండా వీటిని తీసుకోవాలి.

నేరేడు పండ్లు:

నేరేడు పండులో బీటా కెరాటిన్ మూలకం అధికపరిమాణంలో ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడానికి ప్రభావవంతంగా పని చేస్తుంది. నేరేడు పండులో విటమిన్ సి, విటమిన్ ఇ లు ఉంటాయి. ఇవి కంటి సమస్యలను దూరం చేస్తాయి.

కారెట్:

కారెట్‌లో బీటా కెరోటిన్ పోషకాలు కంటి చూపును పెంచడానికి బాగా సహాయపడుతుంది. కావున కంటి సమస్యలతో బాధపడే వారు తప్పకుండా దీనిని రోజూ తీసుకోవాలి.

స్వీట్ పొటాటో:

స్వీట్ పొటాటోలో కంటి కావాల్సి అన్ని రకాల పోషకాలుంటాయి. ముఖ్యంగా ఇందులో బీటా కెరోటిన్, విటమిన్ ఎ, విటమిన్ సి ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగురుపరచడమే కాకుండా.. కంటి సమస్యలను దూరం చేస్తాయి.

Drinking Water: నీళ్లు తాగిన తర్వాత కూడా దాహంగా ఉంటుందా? ఈ సమస్యలకు ముందస్తు సంకేతం కావచ్చు..

Why Am I Always Thirsty? know here reasons: నీరు శరీరానికి జీవనాధారం. అందుకే నీరు ఎక్కువగా తాగడం వల్ల అనేక రోగాలను దూరం చేసుకోవచ్చని నిపుణులు అంటుంటారు.
సాధారణంగా శరీరానికి నీరు అవసరమైతే అందరికీ దాహం వేస్తుంది. వ్యాయామం చేసిన తర్వాత, మసాలాతో కూడిన ఆహారం తిన్న తర్వాత దాహం వేయడం సాధారణం.

కానీ నిరంతరం దాహంగా ఉండటం లేదా నీరు త్రాగిన తర్వాత కూడా దాహం తీరకపోవడం వంటి లక్షణాలు అనేక అనారోగ్య సమస్యలకు సూచికలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అవేంటంటే..

డీహైడ్రేషన్: వేసవిలో ఎండ వేడిమికి ఎక్కువగా చెమటలు పట్టడం వల్ల డీహైడ్రేషన్ సంభవిస్తుంది. అప్పుడు దాహం వేయడం, అతిసారా, వాంతులు వంటి సమస్యలు తలెత్తుతాయి.

దీనివల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్ల నష్టానికి కారణం అవుతుంది. అలాగే పొడి చర్మం, పగిలిన పెదవులు, అలసట, మైకం కమ్మడం, వికారం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

మధుమేహం: మధుమేహం వల్ల కూడా అత్యధికంగా దాహం వేస్తుంది. ఈ వ్యాధితో బాధపడేవారు మూత్రవిసర్జన అధికసార్లు వెళ్తుంటారు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు, శరీరం దానిని మూత్రం ద్వారా తొలగించడానికి ప్రయత్నిస్తుంది. ఫలితంగా నిర్జలీకరణం జరుగుతుంది. దీని వల్ల దాహంగా అనిపిస్తుంటుంది.

డయాబెటిక్ కీటోయాసిడోసిస్: మధుమేహం ఉన్నవారికి శక్తిని అందించడానికి కణాలలోకి గ్లూకోజ్ చేరకుండా నిరోధించే సమస్య ఉంటుంది. ఇది శరీరంలో కీటోన్‌లను పెంచుతుంది. ఇది ఆమ్లంగా మారి.. కీటోయాసిడోసిస్‌కు దారితీస్తుంది. ఇది మూత్రవిసర్జనను బాగా ప్రభావితం చేస్తుంది. అలాగే దాహాన్ని పెంచుతుంది.

కీటోయాసిడోసిస్ అనేది ప్రాణాంతక సమస్య. పొడి చర్మం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వికారం, వాంతులు, మైకం కమ్మడం, కోమా వంటివి కెటోయాసిడోసిస్ ప్రధాన లక్షణాలు.

గర్భం: చాలా మంది గర్భిణీ స్త్రీలకు కూడా తరచుగా నీరు దాహంగా అనిపిస్తుంటుంది. ఇది సాధారణ సమస్య అయినప్పటికీ గర్భధారణ సమయంలో కొనసాగితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఎందుకంటే ఇది గర్భధారణ సమయంలో సంభవించే మధుమేహానికి సంకేతం కావచ్చు.

మెడిసిన్‌ దుష్ప్రభావాలు: అనారోగ్య కారణంగా వాడే కొన్ని ఔషధాల వల్ల కూడా అధికంగా దాహంగా ఉండవచ్చు. పార్కిన్సన్స్, ఆస్తమా, డయేరియా, యాంటీబయాటిక్స్, యాంటిసైకోటిక్స్, యాంటీ డిప్రెసెంట్స్ వంటి కొన్ని మెడిసిన్లకు దాహాన్ని కలిగించే లక్షణాలు ఉంటాయి. అలాగే స్కిజోఫ్రెనియా వంటి మానసిక రుగ్మతల వల్ల కూడా నాలుక పొడిబారి అధికంగా దాహం వేస్తుంది.

Post Office Scheme: సీనియర్ సిటిజన్లకు శుభవార్త.. నెలకు రూ.20,500 పొందవచ్చు!

భారత దేశంలోని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రధాన వ్యవస్థల్లో తపాల శాఖ ఒకటి. దేశంలోనే అతి పెద్ద వ్యవస్థలో ఒకటిగా తపాల శాఖ కొనసాగుతుంది. ఒకప్పుడు పోస్టాఫీసు ద్వారా ఉత్తరాల మార్పిడి మాత్రమే జరిగేది. కాలం మారింది. అలానే ఈ శాఖలో అనేక మార్పులు వచ్చాయి. ప్రజలకు ఎన్నో అద్భుతమైన స్కీమ్స్ తో ఆకట్టుకుంటుంది. పిల్లల నుంచి పండు ముసలి వారి వరకు అందరికి ఏదో ఒక స్కీమ్ ను పోస్టాఫీస్ అందిస్తుంది. తాజాగా పోస్టాఫీస్ అందిస్తున్న ఓ పథకం సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఈ పథకం ద్వారా నెలకు రూ.20,500 పొందవచ్చు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

పోస్టాఫీస్ అనేక రకాల నెలవారీ ఆదాయ స్కీమ్ ను అందిస్తుంది. ఇప్పటికే పిల్లలు, మహిళలకు పలు రకాల సేవింగ్ స్కీమ్స్ ను అందిస్తుంది. అలానే సీనియర్ సిటిజన్లు కూడా వృద్దాప్యంలో ఆర్థిక ఇబ్బంది పడకుండా వారికి పోస్టాఫీస్ స్కీమ్ అందిస్తుంది. అదే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్. వృద్దాప్యంలో సీనియర్ సిటిజన్ల నెలవారీ ఖర్చులను భరించేందుకు తపాలా శాఖ ఈ పథకాన్ని తీసుకొచ్చింది. కొన్ని షరతులను పాటిస్తూ.. ఈ స్కీమ్ ను చక్కగా ఉపయోగించుకోవచ్చు.

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ లో మినిమ్ వెయ్యి రూపాయల నుంచి గరిష్టంగా 30 లక్షల వరకు పెట్టుకొవచ్చు. అయితే మనం ఎంత ఇన్వెస్ట్ మెంట్ చేసినాము అనే దానిపైనే మనకు వచ్చే ఆదాయం ఆధారపడి ఉంటుంది. యాదృచ్ఛికంగా ఈ పథకంలో పెట్టుబడికి సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ఉంది. సెక్షన్ 80సీ కింద రూ.15 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. 60 ఏళ్లు పైబడిన వారిని దృష్టిలో ఉంచుకుని ఈ పథకం రూపొందించబడింది. ఈ స్కీమ్ లో చేరితే.. పదవీ విరమణ తర్వాత సాధారణ ఆదాయాన్ని పొందవచ్చు. అలానే పదవీ విరమణ పొందినవారు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన వారికి ప్రస్తుతం ప్రభుత్వం 8.2 శాతం వరకు వడ్డీ చెల్లిస్తోంది.

ఈ పథకంలో, సీనియర్ సిటిజన్లు కలిసి రూ.15 లక్షలు పెట్టుబడి పెడితే త్రైమాసికానికి రూ.10,250 సంపాదించవచ్చు. 5 సంవత్సరాలలో వడ్డీ ఆదాయం రూ. 2 లక్షలు ఉంటుంది. ఒక వ్యక్తి గరిష్టంగా రూ. 30 లక్షలు పెట్టుబడి పెడితే, అతనికి రూ. 2,46,000 వడ్డీ వస్తుంది. అది నెలకు లెక్కవేసినట్లు అయితే రూ. 20,500 వరకు పొందవచ్చు. మూడు నెలల్లో 61,500 వస్తాయి. సంవత్సరానికి 8.2 శాతం వడ్డీ. వడ్డీ మొత్తం ప్రతి 3 నెలలకు అందుబాటులో ఉంటుంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్, జూలై, అక్టోబర్ మరియు జనవరి మొదటి రోజున వడ్డీ వస్తుంది. ఈ స్కీమ్ కి సంబంధించిన పూర్తి వివరాల కోసం మీ సమీపంలో ఉన్న పోస్టాఫీస్ ను సంప్రదించవచ్చు.

Rohit Sharma: అది క్రికెట్ కు చాలా ప్రమాదకరం.. దానికి నేను పూర్తిగా వ్యతిరేకం: రోహిత్ శర్మ

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ఐపీఎల్ సీజన్ లో సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 105 పరుగులతో అజేయంగా నిలిచాడు. కానీ టీమ్ కు మాత్రం విజయాన్ని అందించకపోగా.. సెల్ఫిష్ అంటూ విమర్శలు మూటగట్టుకున్నాడు. కాగా.. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడిన రోహిత్ ఐపీఎల్ లో ఉన్న ఓ రూల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ రూల్ ప్రమాదకరం అని, దానికి నేను బిగ్ ఫ్యాన్ ను కాదని చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఆ రూల్ ఏంటంటే?

ఐపీఎల్ 2024 సీజన్ దాదాపు సగం పూర్తైంది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లు ప్రేక్షకులకు ఫుల్ కిక్ ఇచ్చాయి. అయితే ఐపీఎల్ కొత్తగా తెచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ రూల్ డేంజర్ అని, దానికి నేను ఫ్యాన్ ను కాదని, వ్యతిరేకమని చెప్పుకొచ్చాడు టీమిండియా కెప్టెన్, ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ. ఓ యూట్యూబ్ ఛానల్ తో రోహిత్ ఈ విధంగా మాట్లాడాడు.

“నేను ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కు అభిమానిని కాదు. ఇది ఆల్ రౌండర్లకు శాపం లాంటింది. వారిని వెనక్కి లాగుతుంది. దుబే, వాషింగ్టన్ సుందర్ లాంటి ఆల్ రౌండర్లు బౌలింగ్ వేయకుండా ఈ రూల్ కట్టడి చేస్తుంది. ఇదంత మంచి రూల్ కాదని నా అభిప్రాయం. 12 మంది ప్లేయర్లు ఆటడం ఎంటర్ టైనింగ్ గానే ఉన్నా.. ప్రేక్షకులను అలరించడానికి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. ఇంపాక్ట్ రూల్ ఒక్కటే కాదు. ఇది ప్రమాదకరమైన రూల్.. అందుకే నేను దానికి వ్యతిరేకం” అని చెప్పుకొచ్చాడు హిట్ మ్యాన్.

Health

సినిమా