Friday, September 20, 2024

Money Sentiment : మంగళ, శుక్రవారాలు డబ్బుల సెంటిమెంట్ వెనుక అసలు విషయం ఇదే!

Money Sentiment : మంగళ, శుక్రవారాలు డబ్బుల సెంటిమెంట్ వెనుక అసలు విషయం ఇదే!

Money Sentiment : మంగళవారం, శుక్రవారాల్లో డబ్బులు ఇవ్వకూడదన్న సెంటిమెంట్ ప్రాచీన కాలం నుంచీ వస్తున్న ఆర్ధిక సంప్రదాయం.
ఈ సంప్రదాయం వెనుక ఒక నిగూడార్థం ఉంది. డబ్బులు ఖర్చుపెట్టడమంత తేలిక కాదు సంపాదించడం. దాచి ఉంచిన డబ్బును బయటకు తీసి ఖర్చు చేసేస్తే మరలా కూడబెట్టడం కష్టం కదా!

ఏ ఇంట్లలోనైనా కష్టపడి సంపాదించేది ఒకరైతే కులాసాగా ఖర్చుపెట్టేది మరొకరు. ఇటువంటి జల్సారాయుళ్లను ఒకనాటి వరకైనా నిలురించడానికి మంగళవారం,శుక్రవారాలు పనికి వస్తాయి కదా. పున్నమి అమావాస్య, రోజుల్లో ఇంట్లోని రూపాయిని బయటకు పంపించారు చాలా మంది. కొన్ని కొన్ని సాధించడానికి మనకు మనమే కొన్ని కట్లుబాట్లనూ నియమాలనూ ఏర్పరుచుకోవాలి. లేకపోతే ఏమీ సాధించలేని అసమర్థులమైపోతాం.

శ్రీమహాలక్ష్మీ దేవి భృగుమహర్షి కుమార్తె. శుక్రవారానికి మరో పేరు భృగువారం. మంగళవారం కుజగ్రహానికి సంబంధించినది. శుక్రవారం ఎవరికైనా రుణం ఇస్తే తిరిగి రావడం కష్ట అని , మంగళవారం నాడు అప్పు ఇస్తే కలహాలు పెరుగుతాయని చాలా మంది నమ్మకం.
శుక్రవారం డబ్బులిస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుందని.. లక్ష్మి ఇంటి నుంచి వెళ్లిపోతుందని కొంతమంది సెంటిమెంట్ గా భావిస్తుంటారు.
మంగళ, శుక్రవారాల సెంటిమెంట్ అన్ని ప్రాంతాల్లో ఉండదు.

ధనం విషయంలో సోమరిపోతు తనం తగ్గించాలనే పెద్దలు ఇలాంటి సంప్రదాయం పెట్టారు. మనకున్న చాలా సంప్రదాయాలు ఈవిధంగా మనకు మనం విధించుకొన్నవే. దీని వల్ల మంచేగాని చెడు లేదు. ఆచారం ఒక్కటే తెలిసి ఉంటే ఫలితం లేదు ఆచారణ కూడా ఉండాలి. అత్యవసర సమయాలలో , అపాయకర సమయాల్లో ఆచారాలు పాటించాల్సిన పనిలేదని శాస్త్రాలు, స్మృతులు చెబుతున్నాయి. కొన్నింటిని పోగోట్టుకుంటేనా కొన్నింటిని సాధించగలం. ఆర్ధిక లావాదేవీలకు ఆంక్షలు పెట్టుకోవడం మంచిదే. మంగళవారం, శుక్రవారాల్లో డబ్బులు ఇవ్వకూడదన్న దాంట్లో నిజం లేదు కానీ పాటించడం మంచిదే.

Food In Fridge : రెండు రోజులకు మించి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహారాన్ని తినవచ్చా?

Food In Fridge : రెండు రోజులకు మించి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహారాన్ని తినవచ్చా?

నేటి బిజీ టైమ్‌లో ఫ్రెష్‌గా వండుకోవడానికి సమయం దొరకడం లేదు. ఇంట్లో భోజనం వేడి వేడిగా వండుకుని తినడం కష్టమైపోయింది. దీని కోసం మనం సహజంగా మైక్రోవేవ్ లేదా రిఫ్రిజిరేటర్ వంటి పరికరాలను ఉపయోగిస్తాం.
ఆహారం చేసుకుని ఫ్రిజ్‍లో పెట్టి.. తర్వాత తింటుంటాం. ఇలా ఆహారాన్ని ఫ్రిజ్‌లో ఎంతసేపు ఉంచడం మంచిది? ఎక్కువసేపు ఉంచితే ఏమి జరుగుతుంది?

సాధారణంగా అన్నం, చిరుతిళ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, తరిగిన కూరగాయలు, పండ్లు, మాంసం మొదలైనవన్నీ ఫ్రిజ్‌లలో ఉంచుతాం. అలా చాలా రోజులు ఫ్రిజ్‌లో ఉంచి వినియోగిస్తాం. ముఖ్యంగా పాల ఉత్పత్తులను ఎక్కువ సేపు ఫ్రిజ్ లో ఉంచడం మంచిది కాదు. కానీ అలాంటి వాటిని ఫ్రిజ్ లో పెట్టుకుని తింటాం. అయితే ఇది మన ఆరోగ్యాన్ని ఎంత దారుణంగా ప్రభావితం చేస్తుందో చిన్న ఆలోచన కూడా ఉండదు.

అన్నం లేదా ఇతర మసాలా దినుసులు అంటే వండిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో ఉంచినట్లయితే, ఒకటి నుండి రెండు రోజులలోపు తినాలి.
రోటీ, చపాతీని తయారు చేసి ఉంచినట్లయితే లేదా చపాతీ పిండిని ఫ్రిజ్‌లో ఉంచినట్లయితే 12 నుండి 14 గంటలలోపు తినాలి. లేకపోతే దానిలోని పోషకాలు తగ్గిపోతాయి. ఈస్ట్ వంటి బ్యాక్టీరియా కూడా వృద్ధి చెందుతుంది. పొత్తి కడుపు నొప్పి వస్తుంది. పప్పు వంటి ఆహారాన్ని రెండు రోజులు ఫ్రిజ్ లో ఉంచి తినవచ్చు. కానీ అంతకు మించి ఫ్రిజ్ లో ఉంచి తింటే గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. మాంసం, పాల ఉత్పత్తులను రెండు రోజులకు మించి ఫ్రిజ్ లో ఉంచడం మంచిది కాదు. కానీ మాంసంతో చేసిన ఆహారాన్ని ఎక్కువసేపు ఫ్రిజ్లో ఉంచడం మంచిది కాదు.

కట్ చేసిన పండ్లు లేదా కూరగాయలను ఫ్రిజ్‌లో ఉంచొద్దు. వాటిని గాలి చొరబడని డబ్బాలో ఉంచడం మంచిది కాదు. లేకపోతే అవి పాడైపోతాయి. దీనిని తీసుకోవడం ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. కట్ చేసిన బొప్పాయి పండును ఫ్రిజ్‌లో ఉంచినట్లయితే, మీరు కనీసం ఆరు గంటలలోపు తినాలి. అలాగే కట్ చేసిన యాపిల్‌ను 4 గంటల్లోపు తినాలి. యాపిల్‌ను ఫ్రిజ్‌లో ఎక్కువసేపు ఉంచితే, అది ఆక్సిడైజింగ్ లక్షణాలను చూపిస్తుంది అంటే నల్లగా మారుతుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. స్ట్రాబెర్రీలు, బెర్రీలు మూడు నుండి ఆరు వారాల పాటు గాలి చొరబడని పెట్టెలో నిల్వ చేసుకోవచ్చు.

సిట్రస్ పండ్లను ఫ్రిజ్‌లో ఉంచినట్లయితే, అది ఒక వారంలోపు ఖాళీ చేయాలి. బీన్స్, మొక్కజొన్న, దోసకాయ, వంకాయ, పుట్టగొడుగు వంటి కూరగాయలను కనీసం నాలుగు రోజులలోపు వాడండి. లేకపోతే శరీరం పెద్ద పరిమాణంలో అనారోగ్యానికి గురవుతుంది.

22 గంటల తర్వాత పాత ఆహారం తినడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది జీర్ణక్రియలో ఇబ్బందిని కలిగిస్తుంది. శరీరంలో అనారోగ్యానికి కారణమవుతుంది. ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహారాన్ని ఉడికించి తిన్నప్పుడు, అందులోని పోషకాలు నాశనం అవుతాయి. మీరు ఆహారం తీసుకున్నా.. అందులోని పోషకాలు మీ శరీరంలోకి ప్రవేశించవు.

నిజానికి అసలు ఫ్రిజ్‍లోని ఫుడ్ తినకపోవడమే మంచిది. వండిన వెంటనే తినాలి. ముఖ్యంగా వండిన ఆహారాన్ని 24 గంటల కంటే ఎక్కువసేపు ఫ్రిజ్ లో ఉంచి తింటే మంచిది కాదు. పిల్లలకు ఫ్రిజ్ లో ఉంచిన ఆహారాన్ని ఇవ్వకండి. వీలైనంత వరకు పిల్లలకు స్వచ్ఛమైన, తాజా ఆహారాన్ని పెట్టండి.

Does the phone charge quickly..change this small setting on the phone..

ఫోన్ లో ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా..ఫోన్లో ఈ చిన్న సెట్టింగ్ మార్చేయండి..

ప్రస్తుతం మొబైల్ ఫోన్ ( Mobile phone )ఉపయోగించని వ్యక్తులు బహుశా ఉండరేమో. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి మనిషి చేతిలో మొబైల్ ఫోన్ తిరుగుతూనే ఉంటుంది.
అయితే మొబైల్ ఫోన్ ఉపయోగించిన కాసేపటికి ఫోన్లో త్వరగా చార్జింగ్ ( charging )అయిపోతూ ఉండడం ఒక ప్రధాన సమస్యగా మారింది. కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేశాక ఫుల్ ఛార్జ్ చేస్తే మొదట్లో రెండు లేదా మూడు రోజులు ఫోన్లు బ్యాటరీ బ్యాకప్ ( Phones battery backup )ఇస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ పాత పడే కొద్ది ఫుల్ ఛార్జ్ చేస్తే కొన్ని గంటలకే ఫోన్ లో ఛార్జింగ్ తర్వాత అయిపోతుంది.

ఈ సమస్యను అధిగమించడానికి ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు కొన్ని నియమాలను సూచించాయి. ఫోన్ లో త్వరగా బ్యాటరీ అయిపోతే ఏం చేయాలో అనే విషయాలు తెలుసుకుందాం.ఏ స్మార్ట్ ఫోన్ చార్జింగ్ పెట్టిన 100% పూర్తికాకుండానే అంటే 90% చార్జింగ్ పూర్తి అయితే ఫోన్ చార్జింగ్ తీసేయాలి.

ఫోన్ ను చార్జింగ్ పెట్టి అలాగే వదిలేస్తే బ్యాటరీ తన సామర్థ్యాన్ని క్రమంగా కోల్పోతూ వస్తుంది. అలాగే కంపెనీ ఛార్జర్ మాత్రమే ఉపయోగించాలి. అంతేకాకుండా ఒకవైపు ఫోన్ చార్జింగ్ లో పెట్టి మరొకవైపు ఫోన్ ఉపయోగించడం కూడా ప్రమాదకరమే. ఫోన్లో చార్జింగ్ పూర్తిగా అయిపోయేంతవరకు ఉపయోగించకూడదు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు ఫాస్ట్ ఛార్జింగ్ మోడ్( Smart phones fast charging mode ) లో ఉంటే.. ఫోన్ త్వరగా వేడిని గ్రహిస్తుంది.

దీంతో బ్యాటరీ లైఫ్ దెబ్బతింటుంది. ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి బ్యాటరీ ఆప్షన్ లో కనిపించే ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ను నిలిపివేయాలి. అయితే ఈ ఆప్షన్ నిలిపివేయడం వల్ల ఫోన్ చార్జింగ్ అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. స్మార్ట్ ఫోన్లో ఉపయోగించని యాప్స్ స్లీప్ మోడ్ లో ఉంటే చార్జింగ్ త్వరగా అయిపోదు. అందుకోసం సెట్టింగ్స్ లోకి వెళ్లి బ్యాటరీ ఆప్షన్ ను క్లిక్ చేస్తే క్లిక్ చేస్తే అక్కడ బ్యాక్ గ్రౌండ్ యూసేజ్ లిమిట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు ఉపయోగించని యాప్స్ ను స్లిప్ మోడ్ లోకి వెళ్తాయి.ఈ టిప్స్ పాటిస్తే ఫోన్ చార్జింగ్ త్వరగా అయిపోదు.

పిల్లలు స్కూల్​ నుంచి వచ్చాక పేరెంట్స్​ అడగాల్సిన ప్రశ్నలివే! ఎందుకో తెలుసా?

పిల్లలు స్కూల్​ నుంచి వచ్చాక పేరెంట్స్​ అడగాల్సిన ప్రశ్నలివే! ఎందుకో తెలుసా?

Parenting Tips in Telugu: మీ పిల్లలు స్కూల్​కు వెళ్తున్నారా..? మరి స్కూల్​ నుంచి ఇంటికి వచ్చాక వారిని ఈ ప్రశ్నలు అడుగుతున్నారా..? ఇలా ప్రశ్నలు అడగడం వల్ల పేరెంట్స్​ అండ్​ పిల్లల మధ్య కమ్యూనికేషన్​ డెవలప్​ అవుతుందని..
మానసిక నిపుణులు అంటున్నారు. మరి ఆ ప్రశ్నలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం..

Parents Must Ask these Questions to Children After they Coming from School: పిల్లలకు అత్యంత విలువైన కానుక పేరెంట్స్​ నుంచి ఉందంటే అది సమయం మాత్రమే. అయితే ఉద్యోగ ఒత్తిళ్లు, స్మార్ట్​ఫోన్ల వినియోగం, భార్యాభర్తలిద్దరికీ కనీసం మాట్లాడుకునే సమయం లేకపోవడం వంటివన్నీ పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. దీంతో పిల్లలకు, తల్లిదండ్రుల మధ్య కమ్యూనికేషన్ ఉండటం లేదు. దీనివల్ల పిల్లలు ఎదుర్కొనే సమస్యల(అది ఇంట్లో లేదా బయట) గురించి పేరెంట్స్​కు తెలియడం లేదు. కాబట్టి.. మీరు వారితో కాస్త సమయం గడిపితే ఏ సమస్య వచ్చినా ముందుగా మీతోనే చెప్పుకుంటారు.

పేరెంట్స్​కి, పిల్లలకి ఒకరి పట్ల ఒకరికి అండర్ స్టాండింగ్, నమ్మకం, స్నేహం ఉంటే ఇక పిల్లలు ఏ విషయాలకు కూడా భయపడరు. తల్లిదండ్రులు పిల్లలకు ఒక సపోర్ట్ సిస్టమ్​గా డెవలప్ అవుతారు. దానివల్ల వాళ్లు తప్పుదారి పట్టకుండా కాపాడుకోవచ్చు. కొంచెం ఓపిక, కొంచెం సానుభూతి, సరైన ప్రయత్నం ఉంటే మీ పిల్లలతో అనుబంధాన్ని పెంచుకోవచ్చు. ఎన్ని పనులున్నా, ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ కొంత సమయాన్ని పిల్లల కోసం కేటాయించండి. కాగా, పిల్లలకు స్కూలింగ్​ చాలా ఇంపార్టెంట్​. ఎందుకంటే ఏదైనా నేర్చుకునేది స్కూల్​ నుంచే.. అది మంచైనా లేదా చెడైనా. కాబట్టి స్కూల్​ నుంచి తిరిగొచ్చాక పిల్లల్ని తల్లిదండ్రులు అడగాల్సిన ప్రశ్నలివే.!

స్కూల్​ నుంచి తిరిగొచ్చాక పిల్లలను అడగాల్సిన ప్రశ్నలివే..

స్కూల్​ సమయంలో ఆడుకోవడానికి సమయం ఇచ్చారా లేదా అడగాలి. ఆటలంటే పిల్లలకు చాలా ఇష్టం. దీంతో ఉత్సాహంగా సమాధానం చెబుతారు.
స్కూల్లో జరిగిన ఫన్నీ సంఘటన గురించి అడగాలి. పిల్లలు వాటిని కథలు కథలుగా చెబుతారు.
పిల్లలు స్కూల్లో ఏ పని చేయడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారో తెలుసుకోవాలి. దీని వల్ల పిల్లల అభిరుచి, ఆసక్తి తెలుస్తోంది. దీంతో ఆ విషయంలో మీ ప్రోత్సాహం అందిచొచ్చు.
పాఠశాలలో కష్టంగా చేసిన పనేంటి అని అడగాలి. ఇలా అడిగితే పిల్లలు ఏ విషయంలో ఇబ్బందులు పడుతున్నారో తెలుస్తుంది. అందువల్ల వాటిని పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది.
పిల్లలు ఏ యాక్టివిటీస్​ పట్ల ఉత్సాహంగా ఉన్నారో తెలుసుకోవాలి. అవి వారి భవిష్యత్తును నిర్దేశించవచ్చు.
ఏ విషయం గురించైనా స్కూల్లో మెచ్చుకున్నరా అని అడగాలి. పిల్లల్లో సెల్ఫ్​ రెస్పెక్ట్​, ఆత్మవిశ్వాసం పెంపొందే అవకాశం ఉంటుంది.
స్కూల్లో ఏదైనా మంచి పని చేశావా అని అడగాలి. తద్వారా పిల్లలు మంచి నడవడిక వైపు వెళతారు.
ఈరోజు లంచ్​ నచ్చిందా అని అడగాలి. అదే కాకుండా ఇంకా ఏమైనా తిన్నారా అని అడగాలి. తద్వారా పిల్లలకు ఇష్టమైన ఆహారం గురించి ఈజీగా తెలిసిపోతుంది. అలాగే వారు ఏమి తిన్నారో కూడా తెలుసుకోవచ్చు.
స్కూల్లో కొత్తగా ఫ్రెండ్స్​ అయ్యారా అని అడగాలి. అందువల్ల వాళ్ల ఫ్రెండ్స్​ పేర్లు, వాళ్లతో జరిగిన విషయాలు కచ్చితంగా చెబుతారు.

ఫోన్లో యాడ్స్​తో చిరాకొస్తోందా? – ఈ చిన్న చేంజ్​ చేస్తే యాడ్స్ బంద్​!

ఫోన్లో యాడ్స్​తో చిరాకొస్తోందా? – ఈ చిన్న చేంజ్​ చేస్తే యాడ్స్ బంద్​!

How to Block Ads in Phone: ఫోన్లు ఉపయోగించే వారిలో ఎక్కువ మంది ప్రకటనల సమస్య ఎదుర్కొంటూ ఉంటారు. పదే పదే వస్తుంటే.. చిరాకు, అసహనం వ్యక్తం చేస్తుంటారు.
అయితే.. వీటిని బ్లాక్​ చేసుకోడానికి మార్గాలు ఉన్నాయని మీకు తెలుసా?

How to Block Ads in Android Phone in Telugu: ఆ స్మార్ట్​ యూగంలో.. స్మార్ట్​ఫోన్లు ప్రతి ఒక్కరి జీవితంలోనూ భాగమయ్యాయి. దాదాపు అన్ని ముఖ్యమైన పనులనూ ఫోన్‌ ద్వారానే సులభంగా చేసుకుంటున్నారు. అయితే.. ఫోన్​లో తరచూ యాడ్స్ వస్తుంటాయి. సాధారణ సమయాల్లో అయితే ఫర్వాలేదు. ఏదో ముఖ్యమైన పనిలో బిజీగా ఉన్నప్పుడు ప్రకటనలు వస్తే ఇబ్బందిగా ఉంటుంది. కొన్నిసార్లు చేస్తున్న పని మధ్యలో డిస్ట్రబ్​ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈ పరిస్థితిని చాలా మంది యూజర్స్ ఎదుర్కొంటూ ఉంటారు.
Tips to Block Advertisements in Smartphones: అత్యవసర సమయంలో ఫోన్ ఉపయోగించేటప్పుడు యాడ్స్ వస్తే ఫోన్ నేలకేసి కొట్టాలన్నంత కోపం వస్తుంది. Apple iPhoneలో ప్రకటనలు ఎప్పుడూ కనిపించవు. కానీ.. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఉపయోగించే వారిలో చాలామంది ఈ సమస్యను ఇప్పటికే ఎదుర్కొని ఉంటారు. యూట్యూబ్, ఫేస్‌బుక్‌ వంటి సోషల్ మీడియా ప్లాట్​ఫామ్స్​లో ప్రకటనలను ఆపేయడానికి ఆప్షన్స్ ఉన్నాయి. ఫోన్‌లోనే(ఆండ్రాయిడ్) ప్రకటనలు కనిపిస్తే మాత్రం ఏం చేయాలో చాలా మందికి తెలియదు.

ఆ యాడ్ మొత్తం చూసి.. ఆ తర్వాత క్రాస్ (X) ఆప్షన్​పై నొక్కడం మినహా ఏమీ చేయలేకపోతుంటారు. ఇలాంటి పరిస్థితిని మీరు కూడా ఫేస్ చేస్తున్నట్టయితే.. మీకోసమే ఈ ఆర్టికల్. మొబైల్​లో వచ్చే ఈ ప్రకటనలను సులభంగా బ్లాక్ చేయవచ్చని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. మరి.. Android ఫోన్లలో వచ్చే ప్రకటనలను ఎలా బ్లాక్ చేయవచ్చో ఇప్పుడు చూద్దాం.

ఫోన్లో యాడ్స్​ బ్లాక్​ చేయడం ఎలా..?

ఇందుకోసం ముందుగా ఫోన్​లో Settings ఓపెన్​ చెయ్యండి.
ఆ తర్వాత Google ఆప్షన్​పై క్లిక్​ చేయండి.
ఇప్పుడు మీరు Manage Your Google Account అనే దానిపై క్లిక్ చేయాలి.
మీరు ఆ ఆప్షన్‌ను నొక్కిన వెంటనే.. మీకు Data & Privacy ఆప్షన్ వస్తుంది.
అక్కడ మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేసినప్పుడు, మీరు Personalized Ads ఆప్షన్ కనిపిస్తుంది.
Personalized Ads కింద, మీకు My Ad Center ఆప్షన్ ఉంటుంది.
మీరు దానిపై క్లిక్​ చేసిన తర్వాత Personalized Ads టోగుల్(అది మీ స్క్రీన్​​ పైన కుడివైపున ఉంటుంది) ఆఫ్ చేయాలి.
ఆ తర్వాత మళ్లీ Settings ఓపెన్​ చేసి Google ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
Manage Your Google Account కింద Services on this Device సెక్షన్​లో Ads ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
ఆ తర్వాత Delete Advertising IDని ట్యాప్ చేసి డెలిట్ చేయండి.
ఇలా చేస్తే ఇకపై ఆండ్రాయిడ్​ ఫోన్లలో యాడ్స్ రాకుండా ఆగిపోతాయి.
చూశారుగా పైన చెప్పిన విధానాన్ని ఫాలో కావడం ద్వారా .. సింపుల్​ యాడ్స్​ను బ్లాక్​ చేసుకోవచ్చు.

EMI | హోంలోన్‌ ఈఎంఐ తగ్గాలంటే ఇలా చేయండి..

రిజర్వ్‌ బ్యాంక్‌ సంవత్సరంన్నర క్రితం నుంచి మొదలుపెట్టి వరుస వడ్డీ రేట్ల పెంపుతో గృహ రుణాలపై నెలసరి వాయిదాల చెల్లింపు పెనుభారంగా మారింది. రెండేండ్ల క్రితం చెల్లించిన ఈఎంఐలకు ఇప్పుడు అదనంగా 20 శాతం చెల్లించాల్సి వస్తున్నది.
ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ 2.5 శాతం మేర రేట్ల భారం మోపిన తర్వాత పెంపులకు బ్రేక్‌వేసిన ఆర్బీఐ తాజా సమీక్షలోనూ వడ్డీ రేట్లను యథాతథంగా అట్టిపెట్టింది. క్రమేపీ ద్రవ్యోల్బణం దిగివస్తున్న నేపథ్యంలో 2024 మార్చి లో అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్లకు కోతపెడితే భారత్‌లోనూ ఏప్రిల్‌లో తగ్గుతాయని, ఫెడ్‌ జాప్యం చేస్తే ఇక్కడ మరింత ఆలస్యం కావచ్చని విశ్లేషకులు అంటున్నారు. మొత్తంమీద వచ్చే ఏడాది ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న అంచనాలు బలంగా ఉన్నాయి. కానీ…రిజర్వ్‌బ్యాంక్‌ తగ్గించినంత మాత్రాన గృహ రుణ వినియోగదారులందరికీ ఈఎంఐలూ వెంటనే తగ్గవు. గృహ రుణాల్ని బ్యాంకులు వివిధ రేట్లకు అనుసంధానించి ఇస్తుంటాయి. ఈబీఎల్‌ఆర్‌ (ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌ మార్క్‌ లింక్డ్‌ లెండింగ్‌ రేట్‌), ఎంసీఎల్‌ఆర్‌ (మార్జినల్‌ కాస్ట్‌ లింక్డ్‌ లెండింగ్‌ రేట్‌), బేస్‌ రేట్‌ లింక్‌ అయ్యి రుణాలు మంజూరవుతాయి.

భారం తగ్గించే రేటు ఇదే..
ఆర్బీఐ రెపో రేటుకు కోతపెడితే ఈబీఎల్‌ఆర్‌తో లింక్‌ చేసి మంజూరైన గృహ రుణాలపై వడ్డీ రేటునే బ్యాంక్‌లు వెనువెంటనే తగ్గిస్తాయి. ఈ రుణాలు తీసుకున్నవారికి తక్షణ ఊరట లభిస్తుంది. రెపో రేటు ఎంత తగ్గిస్తే ఆ మేరకు నేరుగా ప్రయోజనం కలుగుతుంది. ఈ నేపథ్యంలో మీరు తీసుకున్న రుణం ఈబీఎల్‌ఆర్‌తో లింక్‌ చేసిందో కాదో తెలుసుకోండి. లేకపోతే మీ గృహ రుణాన్ని ఈబీఎల్‌ఆర్‌కు మార్పు చేయమంటూ బ్యాంక్‌ను కోరండి. నామమాత్రపు ఫీజుతో బ్యాంక్‌ షిప్ట్‌కు అనుమతిస్తుంది. ఉదాహరణకు ఒన్‌టైమ్‌ స్విచోవర్‌కు ఎస్బీఐ రూ.1,000 చార్జీ వసూలు చేస్తుంది. దీనికి పన్నులు అదనం.

ఎన్‌బీఎఫ్‌సీ రుణం అయితే
మీరు నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ నుంచి గృహ రుణాన్ని తీసుకున్నట్లయితే మాత్రం రేటు మార్పిడి కుదరదు. ఆర్బీఐ రేట్లు తగ్గించిన తర్వాత కొత్తగా తీసుకునేవారికి రేట్లను తగ్గించి ఇస్తూ, మీ ఈఎంఐలు తగ్గించకపోతే గృహ రుణాన్ని బదిలీ చేసుకోవడం ఉత్తమం. కొత్త రుణాలకు, మీ రుణానికి రేటు వ్యత్యాసం 0.5 శాతం లేదా అంతకు మించి ఉంటే మీ గృహ రుణాన్ని మరో రుణదాతకు బదిలీ చేసుకోండి. అయితే బదిలీకి అయ్యే వ్యయాన్ని, ఒనగూడే ప్రయోజనాన్ని మీరు చూసుకోవాలి. పలు బ్యాంక్‌లు ప్రాసెసింగ్‌ ఫీజు రద్దుతో సహా వివిధ చార్జీలపై డిస్కౌంట్లు ఇస్తుంటాయి. మీ బదిలీ వ్యయాన్ని మరింత తగ్గించే బ్యాంక్‌ కోసం అన్వేషించండి.

ఓవర్‌బాట్‌ జోన్‌లో మార్కెట్‌

వరుసగా రెండోవారమూ బలమైన ర్యాలీ జరిపిన నిఫ్టీ మరో 701 పాయింట్లు లాభపడి 20,969 పాయింట్ల వద్ద ముగిసింది. రెండు వారాల్లో 1,179 పాయింట్లు పెరిగింది. వేగవంతమైన ర్యాలీ కారణంగా మార్కెట్‌ ఓవర్‌బాట్‌ జోన్‌లో పడిందని, ఇలాంటి స్థితిలో కరెక్షన్‌ జరిగిన సందర్భాలు గతంలో ఉన్నాయని జేఎం ఫైనాన్షియల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ సోనీ పట్నాయక్‌ తెలిపారు. అయితే కరెక్షన్‌ సంకేతాలు అందేవరకూ ఇన్వెస్టర్లు అప్‌సైడ్‌ మూమెంటంలో పాలుపంచుకోవచ్చని చెప్పారు. మార్కెట్‌ భారీగా పెరిగినందున, ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించాలని, రక్షణాత్మక రంగాలకు చెందిన ఎంపికచేసిన షేర్లను మాత్రమే కొనుగోలు చేయాలంటూ ఈక్విటీరీసెర్చ్‌. ఆసియా వ్యవస్థాపకుడు మిలన్‌ వైష్ణవ్‌ సూచించారు. నిఫ్టీ వీక్లీ చార్టులు అప్‌ట్రెండ్‌నే సూచిస్తున్నాయని సామ్కో సెక్యూరిటీస్‌ సీఈవో జిమిత్‌ మోది చెప్పారు.

కీలక స్థాయి 21,000
ఈ వారం నిఫ్టీకి 21,000 పాయింట్ల స్థాయి కీలకమైనదని, ఆ స్థాయి వద్ద సూచి వ్యవహరించే తీరుపై తదుపరి ట్రెండ్‌ ఆధారపడి ఉంటుందని మిలన్‌ వైష్ణవ్‌ విశ్లేషించారు. ఈ స్థాయిని దాటి, పైన నిలదొక్కుకుంటే మరికొంత పెరిగే అవకాశం ఉంటుందని, లేకపోతే పరిమిత శ్రేణిలో కన్సాలిడేషన్‌ జరుగుతుందని తెలిపారు. నిఫ్టీకి 21,000పైన తదుపరి అవరోధం 21,265 పాయింట్ల వద్ద ఏర్పడవచ్చని, 20,700, 20,580 స్థాయిలు మద్దతుగా నిలుస్తాయని అంచనా వేశారు. 20,800 పాయింట్ల స్థాయిని బ్రేక్‌చేస్తేనే స్వల్పకాలిక కరెక్షన్‌ జరగవచ్చని, అప్పటివరకూ ర్యాలీ కొనసాగుతుందని సోనీ పట్నాయక్‌ వివరించారు. వీక్లీ చార్టుల ప్రకారం 20,500 మద్దతుస్థాయి కీలకమైనదని, ఈ స్థాయిపైన ఉన్నంతవరకూ అప్‌ట్రెండ్‌కు ప్రమాదమేదీ లేదని జిమిత్‌ మోది తెలిపారు. ఐటీ, రియల్టీ, బ్యాంకింగ్‌ రంగాల సూచీలు పటిష్ఠంగా ఉన్నాయన్నారు.

బైక్‌ మైలేజ్​ ఇవ్వడం లేదా? వారానికి ఒకసారి ఇలా చేయండి – స్పీడ్‌, మైలేజ్​ రెండు పెరుగుతాయి!

బైక్‌ మైలేజ్​ ఇవ్వడం లేదా? వారానికి ఒకసారి ఇలా చేయండి – స్పీడ్‌, మైలేజ్​ రెండు పెరుగుతాయి!

How to Improve Bike Mileage: మీకు బైక్​ ఉందా..? అది మంచి మైలేజ్​ ఇవ్వడం లేదని వాపోతున్నారా..? నో టెన్షన్​. ఈ చిన్న టిప్స్​ పాటిస్తే.. మంచి మైలేజ్​తో పాటు సూపర్​ స్పీడ్​ కూడా గ్యారెంటీ..!
How to Improve Bike Mileage with Simple Tips: బైక్ కొన్న కొత్తలో బాగానే ఉంటుంది. కానీ.. కొన్నాళ్ల తర్వాత మైలేజ్ సమస్య మొదలవుతుంది. లీటరుకు కనీసం 40 కిలోమీటర్లు కూడా రావడం లేదని చాలా మంది వాపోతుంటారు. మరి.. ఈ మైలేజ్​ సమస్యను అరికట్టడమెలా? మైలేజ్​ పెంచేందుకు ఏం చేయాలి? ఏమైనా పరిష్కార మార్గాలున్నాయా? అన్నది ఈ స్టోరీలో చూద్దాం.

How to Clean Bike Chain in Telugu: చాలా మంది బైక్​ను ఇష్టం వచ్చినట్లు నడుపుతుంటారు. బైక్​ క్లీనింగ్ విషయంలో కూడా శ్రద్ధ చూపించరు. అవసరం ఉన్నప్పుడు వాడి.. తర్వాత పక్కన పెడతారు. దీనివల్ల మైలేజ్ సమస్య వస్తుంది. ఈ ప్రాబ్లం నుంచి బయటపడి.. బండి పర్ఫెక్ట్​ మైలేజ్​ ఇవ్వాలంటే బైక్​ను జాగ్రత్తగా చూసుకోవడంతోపాటు.. బైక్​ చైన్​ను వారానికి ఒకసారి క్లీన్​ చేయాలని ఆటోమొబైల్​ నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల బండి మంచి మైలేజ్​ ఇవ్వడంతోపాటు ఇంధనం అవసరం కూడా తగ్గుతుందని అంటున్నారు.
బైక్‌ చైన్‌ ఎలా క్లీన్‌ చేయాలంటే..?

ఇంట్లో బైక్ చైన్‌ను శుభ్రం చేయడానికి ముందుగా బ్రష్, చైన్ క్లీనింగ్ సొల్యూషన్, క్లాత్, చైన్ ఆయిల్ సిద్ధం చేసుకోవాలి.
తర్వాత బైక్​ను డబుల్ స్టాండ్ మీద నిలబెట్టాలి.
శుభ్రపరిచే ముందు చైన్​ను చెక్​ చేయాలి.
చైన్ వదులుగా ఉందా? లింక్‌లు గట్టిగా ఉన్నాయా? తుప్పు పట్టిందా? అనేది చూడాలి.
వీటన్నింటినీ తనిఖీ చేసిన తర్వాత.. చైన్ క్లీనర్ ఉపయోగించి బ్రష్‌తో రుద్దాలి.
చైన్​ ఒక వైపు మాత్రమే కాకుండా రెండు వైపులా శుభ్రం చేయాలి.
సరిగ్గా క్లీన్​ చేసిన తర్వాత లైట్ ప్రెజర్ వాటర్ పైపుతో లేదా బకెట్‌లో నీటిని తీసుకొని చైన్​ను సరిగ్గా శుభ్రం చేసిన తర్వాత శుభ్రమైన క్లాత్​తో పూర్తిగా తుడవండి.
చైన్​ పూర్తిగా ఆరిపోయాక దానిపై నాణ్యమైన లూబ్రికెంట్ ఆయిల్​ను అప్లై చేయండి.
టైర్​ను నెమ్మదిగా తిప్పుతూ అప్లై చేయడం వల్ల మొత్తం చైన్​కు ఆయిల్​ పడుతుంది.
లూబ్రికెంట్ అప్లై చేసిన తర్వాత కొంత సేపు అలాగే వదిలేయాలి.
దీనివల్ల టైర్స్​ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్రీగా తిరుగుతాయి. బైక్‌ స్పీడ్‌, మైలేజీ రెండు పెరుగుతాయి.

అయితే బైక్​ను ఇంట్లో క్లీన్​ చేసుకోలేని వారు సర్వీసింగ్​కు ఇస్తుంటారు. బండి సర్వీసింగ్​ చేయించే సమయంలో కొన్ని విషయాలు గమనించుకోవాలి. ఎందుకంటే.. బండిని సర్వీసింగ్​కు ఇచ్చినప్పుడు చాలా మంది మెకానిక్​లు చేసే తప్పు.. బైక్‌ సర్వీసింగ్‌ అయిపోయిన వెంటనే గొలుసుపై ఆయిల్‌ వేయడం. ఇది చాలా తప్పు. చైన్‌ నుంచి నీరు పూర్తిగా తొలగించిన తర్వాత క్లాత్​ పెట్టి తుడిచిన తర్వాత.. తడి పూర్తిగా ఆరిపోయిన తర్వాత మాత్రమే దానిపై ఆయిల్‌ వేయాలి. దీంతో బైక్‌ స్పీడ్‌, మైలేజ్​ రెండు పెరుగుతాయి.

Andhra Pradesh: 73 మందితో టీడీపీ ఫస్ట్ లిస్ట్.. అందులోని నియోజవర్గాలు ఇవే !

ఆంధ్రప్రదేశ్, జనవరి 20: వచ్చే ఎన్నికల్లో సీట్ల మార్పులు, చేర్పుల విషయంలో వైసీపీ దూసుకుపోతోంది. ఇప్పటికే నాలుగు విడుతల్లో నియోజకవర్గ బాద్యుల లిస్ట్ విడుదల చేసింది.
దీంతో టీడీపీ కూడా అలెర్టయ్యింది. కూటమిలో జనసేనకు కేటాయించిన సీట్లు మినహా చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. 73 మంది పేర్లతో తొలి జాబితా ప్రకటనకు టీడీపీ సిద్దమైనట్లు తెలుస్తోంది. తొలి జాబితాలో పేర్లపై ఇప్పటికే స్పష్టత వచ్చింది.

) ఇచ్ఛాపురం – బెందాళం అశోక్

2) టెక్కలి – అచ్చెనాయుడు

3) ఆముదాలవలస – కూన రవికుమార్

4) పలాస – గౌతు శిరీష

5) రాజం – కొండ్రు మురళీ మోహన్

6) బొబ్బిలి – బేబీ నాయన

7) విజయనగరం – అశోక గజపతి రాజు
8) చీపురుపల్లి – కిమిడి నాగార్జున

9) కురుపాం – టి.జగదీశ్వరి

10) పార్వతీ పురం – బి. విజయచంద్ర

11) వైజాగ్ (తూర్పు) – వెలగపూడి రామకృష్ణ బాబు

12) వైజాగ్ (పశ్చిమ) – గణబాబు

13) పాయకరావుపేట – అనిత

14) నర్సీపట్నం – చింతకాయల విజయ్

15) తుని-యనమల దివ్య

16) జగ్గంపేట – జ్యోతుల నెహ్రూ

17) పెద్దాపురం – చినరాజప్ప
18) అనపర్తి – నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి

19) రాజమండ్రి (అర్బన్) – ఆదిరెడ్డి వాసు

20) గోపాలపురం – మద్దిపాటి వెంకటరాజు

21) ముమ్మడివరం – దాట్ల సుబ్బరాజు

22) అమలాపురం – బత్తుల ఆనందరావు

23) మండపేట – వేగుళ్ల జోగేశ్వరరావు

24) నిడదవోలు – బూరుగుపల్లి శేషారావు

25) ఆచంట – తండ్రి సత్యనారాయణ

26) పాలకొల్లు – నిమ్మల రామానాయుడు

27) ఉండి – మంతెన రామరాజు
28) దెందులూరు – చింతమనేని ప్రభాకర్

29) విజయవాడ తూర్పు-గద్దె రామ్మోహనరావు

30) విజయవాడ (సెంట్రల్) – బోండా ఉమ

31) నందిగామ – తంగిరాల సౌమ్య

32) జగ్గయ్యపేట – శ్రీరామ్ తాతయ్య

33) మచిలీపట్నం – కొల్లు రవీంద్ర

34) గన్నవరం – యార్లగడ్డ వెంకటరావు

35) పెనమలూరు-బోడే ప్రసాద్

36) మంగళగిరి-నారా లోకేష్

37) పొన్నూరు-ధూళిపాళ్ల నరేంద్ర
38) చిలకలూరిపేట – పత్తిపాటి పుల్లారావు

39) సత్తెనపల్లి – కన్నా లక్ష్మీ నారాయణ

40) వినుకొండ – జి.వి.ఆంజనేయులు

41) గురజాల – యరపతినేని శ్రీనివాసరావు

42) మాచర్ల – జూలకంటి బ్రహ్మానంద రెడ్డి

43) వేమూరు – నక్కా ఆనంద బాబు

44) పర్చూరు – ఏలూరి సాంబశివ రావు

45) ఒంగోలు – దామెచెర్ల జనార్దన్

46) కొండెపు – శ్రీ బాల వీరాంజనేయ స్వామి

47) కనిగిరి – ఉగ్ర నరసింహ రెడ్డి

48) కోవూరు – పోలం రెడ్డి దినేష్ రెడ్డి
49) ఆత్మకూరు – ఆనం రామనారాయణ రెడ్డి

50) నెల్లూరు రూరల్ – కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి

51) శ్రీకాళహస్తి – బొజ్జల సుధీర్ రెడ్డి

52) నగిరి – గాలి భానుప్రకాష్

53) పలమనేరు – అమరనాథ్ రెడ్డి

54) పీలేరు – నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి

55) తంబళ్లపల్లి – పర్వీన్ తాజ్

56) మదనపల్లి – రాటకొండ మధుబాబు

57) రాయచోటి – ద్వారకానాథ రెడ్డి

58) జమ్మలమడుగు – భూపేష్ రెడ్డి
59) మైదుకూరు-పుట్టా సుధాకర్
60) పులివెందల-బీటెక్ రవి

61) నంద్యాల – ఎన్‌ఎండి ఫరూక్

62) బనగానేపల్లి – బీసీ జనార్దన్ రెడ్డి

63) ఆళ్లగడ్డ – భూమా అఖిల ప్రియ

64) పాణ్యం – గౌరు చరిత రెడ్డి

65) శ్రీశైలం – బుడ్డా రాజశేఖర్ రెడ్డి

66) కర్నూలు – టీజీ భరత్

67) ఎమ్మిగనూరు – బివి జయనాగేశ్వర రెడ్డి

68) ఆదోని – పరిటాల సునీత

69) ఉరవకొండ – పయ్యావుల కేశవ్
70) తాడిపత్రి – జేసీ అస్మిత్ రెడ్డి

71) కళ్యాణదుర్గం – ఉమా మహేశ్వర నాయుడు

72) హిందూపురం – నందమూరి బాలకృష్ణ

73) కదిరి – కందికుంట వెంకట ప్రసాద్

బీ అలర్ట్.. అయోధ్య రాముడి పేరుతో మెసేజ్‌లు.. వాటిని క్లిక్ చేస్తే ఇక అంతే సంగతులు..

అయోధ్యలో రామ్‌లలా విగ్రహప్రతిష్ఠాపనకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరికొన్ని గంటల్లో జరిగే.. మహోన్నత క్రతువును తిలకించేందుకు.. యావత్ హిందూ సమాజం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ శుభ సమయంలో.. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతునప్నారు. రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం వేళ.. ప్రజల నుంచి పెద్ద ఎత్తున సొమ్మును దోచుకునేందుకు సైబర్ నేరగాళ్లు కుట్రపన్నారు. దీనికోసం.. ‘అయోధ్య ఎక్స్‌క్లూజీవ్ ఫోటోలు’ ఉన్నాయని పేర్కొంటూ ఆన్‌లైన్‌లో లింక్‌లు సర్కులేట్ చేస్తున్నారు. వాటిని క్లిక్ చేస్తే మీ ఖాతాలలోని నగదు గల్లంతనట్లే. ఇలాంటి హానికర లింక్స్ తో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతుండటంతో.. సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు.

“జనవరి 22, 2024… ఆ తర్వాత, ‘అయోధ్య లైవ్ ఫోటోలు’ లాంటి పేరుతో ఉన్న అనేక లింక్స్ మీ మొబైల్స్‌కు మెసెజీల రూపంలో వచ్చే అవకాశం ఉంది. మీరు అలాంటి లింక్‌లను క్లిక్ చేయవద్దు. పొరపాటున వాటిని ఓపెన్ చేస్తే మీ మొబైల్ ఫోన్ హ్యాక్ అవ్వొచ్చు. మీ బ్యాంక్ ఖాతాలు నుంచి నగదు దోచుకునే అవకాశం ఉంది” అని సైబర్ క్రైమ్ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా సోషల్ మీడియాపై అవగాహన లేని.. సీనియర్ సిటిజన్‌లను సైబర్ కేటుగాళ్లు టార్గెట్ చేసే అవకాశం ఉందని.. వారిని అలెర్ట్ చేయాలని సూచించారు. అదే విధంగా ఈ మెసేజ్‌ను అందరికి సర్కులేట్ చేయాలని సూచించారు.
ఎవరైనా ఓటిపీ నెంబర్లు చెప్పాలని అడిగినా.. బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పినా.. ఫోన్లలో ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం మంచిది. లేకపోతే.. ఖాతాల్లోని నగదు మాయమయ్యే అవకాశం ఉంది. ఇంకా లింకుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. పొరపాటున కూడా వాటిని క్లిక్ చేయొద్దని సూచిస్తున్నారు.

10th అర్హతతో ఏపీఈఆర్‌సీలో ఉద్యోగాలు..డైరక్ట్ రిక్రూట్ మెంట్..నెలకు రూ.63 వేల జీతం

10th అర్హతతో ఏపీఈఆర్‌సీలో ఉద్యోగాలు..డైరక్ట్ రిక్రూట్ మెంట్..నెలకు రూ.63 వేల జీతం
హైదరాబాద్‌లోని ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(APERC) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిలో 6 ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
10వ తరగతి ఉత్తీర్ణత ఆధారంగా వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 24 దరఖాస్తులకు చివరితేది. ఈ పోస్టులకు అప్లయ్ చేసుకునే ముందు ఈ ముఖ్య వివరాలను చూడండి.

పోస్టుల వివరాలు

ఆఫీస్ సబార్డినేట్: 06 పోస్టులు

అర్హత

10వ తరగతి ఉత్తీర్ణత. తెలుగు, ఇంగ్లిష్‌ చదవడం, రాయడం, శారీరక దార్ఢ్యం, ద్విచక్ర వాహన డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

వయోపరిమితి

21 – 35 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం

నెలకు రూ.20,600 నుంచి రూ.63,660.

దరఖాస్తు విధానం

ఆఫ్‌లైన్‌ ద్వారా అప్లయ్ చేయాలి.

అప్లికేషన్ ఫీజు

రూ.500. రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తులతు తుది గడువు

24 జనవరి, 2024.

దరఖాస్తు విధానం
ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను కమిషన్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్, రెడ్ హిల్స్, ఖైరతాబాద్, హైదరాబాద్ అడ్రెస్ కు పంపాలి. దరఖాస్తుకు టెన్త్ సర్టిఫికెట్ కాపీ, టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్, రీసెంట్ 3 పాస్‌ పోర్ట్ సైజ్ ఫోటో గ్రాఫ్స్ తో పాటు కమ్యునిటీ డిక్లరేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలను జతపర్చాలి. దరఖాస్తు ఫారమ్ లను https://aperc.gov.in/admin/upload/Notification_OS_10Jan24.pdf పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్ సైట్ – https://aperc.gov.in/

Business Idea: మీరు ఐఆర్‌సీటీసీ ఏజెంట్‌గా చేరండి.. నెలకు రూ.80 వేలు సంపాదించండి!

మీరు కూడా వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే, ఇప్పుడు మీరు రైల్వేలో చేరి డబ్బు సంపాదించవచ్చు. నెలకు రూ. 80,000 సంపాదించే అవకాశాన్ని రైల్వే మీకు కల్పిస్తోంది.
ఈ వ్యాపారం కోసం మీరు ఏజెంట్ కావడానికి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వెబ్‌సైట్‌కి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. దీని ద్వారా మీరు ఇంట్లో కూర్చొని ప్రతి నెలా వేల రూపాయలు సంపాదించవచ్చు. మీరు ఈ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించవచ్చో తెలుసుకుందాం.

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) అనేది రైల్వేకు సంబంధించిన సర్వీసు. రైలు టికెట్ బుకింగ్‌తో సహా అనేక ఇతర సౌకర్యాలు దీని ద్వారా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మీరు IRCTC సహాయంతో ప్రతి నెలా వేల రూపాయలు సంపాదించవచ్చు. దీని కోసం మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఆదాయం పొందవచ్చు. దీని కోసం మీరు టిక్కెట్ ఏజెంట్‌గా మారాలి. ప్రతిఫలంగా మీరు నెలకు 80 వేల రూపాయల వరకు సంపాదించవచ్చు.

రైల్వే కౌంటర్‌లో గుమస్తా టిక్కెట్‌ ఇచ్చినట్లు మీరు ప్రయాణికుల టికెట్‌ ఇవ్వవచ్చు. ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి మీరు IRCTC వెబ్‌సైట్‌ని సందర్శించి ఏజెంట్ కావడానికి దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత మీరు అధీకృత టిక్కెట్ బుకింగ్ ఏజెంట్ అవుతారు. ఇంటి నుండి పెద్ద మొత్తంలో సంపాదిస్తారు. మీరు IRCTCకి అధీకృత టిక్కెట్ బుకింగ్ ఏజెంట్ అయితే, మీరు తత్కాల్, RAC మొదలైన అన్ని రకాల రైలు టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు. టిక్కెట్ల బుకింగ్ కోసం ఏజెంట్లు IRCTC నుండి మంచి కమీషన్ పొందుతారు.

మీరు ఏజెంట్‌గా ఉండి ప్రయాణీకుల కోసం నాన్-ఏసీ కోచ్ టిక్కెట్‌ను బుక్ చేస్తే మీకు టికెట్‌కు రూ.20 కమీషన్, మీరు ఏసీ క్లాస్ టిక్కెట్‌ను బుక్ చేస్తే మీకు ఐఆర్‌సిటిసి నుండి టిక్కెట్‌కు రూ.40 కమీషన్ లభిస్తుంది. ఇది కాకుండా టికెట్ ధరలో ఒక శాతం కూడా ఏజెంట్‌కు ఇవ్వబడుతుంది.
IRCTC ఏజెంట్ కావడానికి నిర్దిష్ట రుసుము చెల్లించాలి. ఒక సంవత్సరానికి ఏజెంట్‌గా మారడానికి IRCTCకి రుసుము 3999 చెల్లించాలి. మీరు రెండేళ్లపాటు ఏజెంట్‌గా మారాలనుకుంటే రూ.6999 చెల్లించాలి.

Sania Mirza: సానియా మీర్జాకు విడాకులు?.. నటిని పెళ్లాడిన షోయబ్‌ మాలిక్‌!

Shoaib Malik marries Pakistani actress Sana Javed:పాకిస్తాన్‌ వెటరన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. పాకిస్తానీ నటి సనా జావెద్‌ను పెళ్లాడాడు.
ఈ విషయాన్ని షోయబ్‌ మాలిక్‌ స్వయంగా వెల్లడించాడు. సోషల్‌ మీడియా వేదికగా తమ పెళ్లి ఫొటోలు పంచుకుంటూ.. ”జంటగా మేము ఇలా” అంటూ హార్ట్‌ ఎమోజీలు జతచేశాడు షోయబ్‌ మాలిక్‌.

షోయబ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సానియా
కాగా భారత టెన్నిస్‌ స్టార్‌, హైదరాబాదీ సానియా మీర్జా- షోయబ్‌ మాలిక్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2010లో వీరి వివాహం జరుగగా.. 2018లో కుమారుడు ఇజహాన్‌ జన్మించాడు. అయితే, సానియా కంటే ముందు షోయబ్‌ మాలిక్‌ అయేషా సిద్దిఖీ అనే మహిళను పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. ఆమె నుంచి విడిపోయిన తర్వాత సానియాను పెళ్లాడినట్లు తెలుస్తోంది.

హృదయం ముక్కలైందన్న సానియా

ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా సానియా- షోయబ్‌ మధ్య విభేదాలు తలెత్తాయనే వార్తలు వచ్చాయి. వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారంటూ వదంతులు వ్యాపించాయి. నటి ఆయేషాతో ఓ ఫొటోషూట్‌లో షోయబ్‌ మాలిక్‌ అత్యంత సన్నిహితంగా కనిపించడం.. అదే సమయంలో హృదయం ముక్కలైందంటూ సానియా పోస్టులు పెట్టడం వీటికి ఊతమిచ్చింది.

అదే విధంగా కుమారుడి పుట్టినరోజు వేడుకలోనూ సానియా- షోయబ్‌ అంటీ ముట్టనట్టుగానే వ్యవహరించడంతో విడాకుల వార్తలు విస్తృతంగా వ్యాపించాయి. ఈ నేపథ్యంలో సానియా మీర్జా బుధవారం నర్మగర్భ సందేశం పోస్ట్‌ చేయడంతో వీరు విడిపోయారని నిర్ధారణకు వచ్చారు నెటిజన్లు.

వివాహ బంధం.. విడాకులు.. రెండూ క్లిష్టమైనవే: సానియా
”వివాహ బంధం అత్యంత క్లిష్టమైనది. విడాకులు కూడా అంతే కష్టమైనవి. ఇందులో ఏది అత్యంత ఇబ్బందికరమైందో మీరే ఎన్నుకోండి. ఒబేసిటీ హార్డ్‌.. ఫిట్‌గా ఉండటం కూడా కష్టమే. మరి ఇందులో ఏది ఎంచుకుంటారు? అప్పుల్లో కూరుకుపోవడం కష్టంగా తోస్తుంది.. అదే సమయంలో ఆర్థికంగా క్రమశిక్షణతో ఉండటం కూడా అలాగే అనిపిస్తుంది.

ఇందులో మీకు ఏం కావాలో ఎంచుకోండి. కమ్యూనికేట్‌ చేయడం.. కమ్యూనికేట్‌ చేయకుండా ఉండటం కూడా కష్టమే. ఇందులో ఏది అత్యంత కష్టమో మీరే ఎంచుకోండి. జీవితం నల్లేరు మీద నడకలాంటిది కాదు.

తెలివిగా ఎంచుకోవాలి
ఎప్పుడూ క్లిష్టతరంగానే ఉంటుంది. అయితే, అందులో మనకేదీ కావాలో మనం తెలివిగా ఎంచుకోవాలి” అని సానియా మీర్జా భావోద్వేగపూరిత నోట్‌ షేర్‌ చేసింది. ఇంతలో షోయబ్‌ మాలిక్‌ ఇలా శనివారం నటి సనా జావెద్‌తో పెళ్లి ఫొటోలను షేర్‌ చేయడం గమనార్హం. సానియా- షోయబ్‌ జంట అభిమానులు ఈ చేదు వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది ఏదైనా యాడ్‌ షూట్‌కు సంబంధించిన ఫొటో అయితే బాగుండని కామెంట్లు చేస్తున్నారు.

‘మై మెమోరీస్‌ ఆఫ్‌ టోటల్‌ కమిట్‌మెంట్‌’ -ఓ విజేత ‘డైరీ’..నా జీవితంలో మరోసారి ప్రిలిమ్స్‌ రాయను. ఇదే చివరిది’.. ఓ కుర్రాడు తన డైరీలో రాసుకున్న మాటలు.. బయటి ప్రపంచానికి కనపడకూడదని గుండు చేయించుకున్నారు. వెంట్రుకలు తిరిగి వచ్చేలోపు ప్రిపరేషన్‌ పూర్తి కావాలని తన రూమ్‌కే పరిమితమయ్యారు…విజేతగా నిలిచారు…

ఓ విజేత ‘డైరీ’..
ప్రస్తుతం తిరుపతి అర్బన్ ఎస్పీగా నియామకం అయిన ఆవుల రమేష్ రెడ్డి.. స్టోరీ..
‘నా జీవితంలో మరోసారి ప్రిలిమ్స్‌ రాయను. ఇదే చివరిది’.. ఓ కుర్రాడు తన డైరీలో రాసుకున్న మాటలివి. ఆ మాటలో సాధిస్తానన్న విశ్వాసం, ఆత్మస్థైర్యం తొణికిసలాడింది. అనుకున్నట్టే ఆయన సంకల్పం ముందు విజయం మోకరిల్లింది. ఆ మాటలు అక్షర సత్యం అయ్యాయి. విజేతగా నిలబడేందుకు ఆ కుర్రోడు పడ్డ తపన, శ్రమ ఎందరికో స్ఫూర్తికలిగిస్తాయి. ఇవాళ వందలాది మంది సివిల్స్‌ విజేతలకు రోల్‌ మోడల్‌ ఆయన. అచీవర్స్‌ స్టోరీస్‌ సగర్వంగా అందిస్తున్న ఐపీఎస్‌ అధికారి ఆవుల రమేష్ రెడ్డి సక్సెస్‌ స్టోరీ..

చాలా మంది తమ మనసులో మాటను డైరీ రూపంలో నిక్షిప్తం చేస్తుంటారు. అయితే విజయాన్ని ముందే ఊహించి ఓ డైరీలో రాసుకోవడం ఎప్పుడైనా విన్నారా? రమేష్ రాసిన డైరీ ‘మై మెమోరీస్‌ ఆఫ్‌ టోటల్‌ కమిట్‌మెంట్‌’ అలాంటిదే. ఉన్నతమైన స్థానంలో తనను చూసుకోవాలని చిన్ననాటి నుంచే ఆయన కల కన్నాడు. తన కష్టానికి ఫలితం ఉంటుందని, విజేతను అవుతానని తన లక్ష్యాన్ని అక్షర రూపం చేసుకున్నారు. పోటీపరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్న సమయంలో 2001లో మై మెమోరీస్‌ ఆఫ్‌ టోటల్‌ కమిట్‌మెంట్‌ రూపుదిద్దుకుంది. తనను తాను స్ఫూర్తి పొందడానికి ఎందరో విజేతల ఫోటోలు పదిలపర్చుకున్నారు ఆ డైరీలో. ఎంత కష్టపడితే ఇలా విజేతలు అవుతారో అంటూ తనకుతాను మోటివేట్‌ అయ్యేవారు. వాళ్ల స్థాయిలోనే తానూ అచీవ్‌ అవ్వాలని పట్టుదలతో ఉండేవారు. మనసును హత్తుకునే సంఘటనల చిత్రాలెన్నో ఆ అమూల్యమైన డైరీలో చోటుసంపాదించాయి. ఇప్పుడా డైరీ ఎందరికో స్ఫూర్తి కలిగించే అపురూప కళాఖండం అంటే ఆశ్చర్యమేయక మానదు.

రమేష్ రెడ్డి స్వస్థలం ప్రకాశం జిల్లా కనిగిరి సమీపంలోని జాల్లపాలెం. తండ్రి తిరుపతి రెడ్డి సోషల్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌లో వార్డెన్‌. తల్లి లక్ష్మి నారాయణమ్మ గృహిణి. ఇంటర్‌ వరకు రమేష్ విద్యాభ్యాసం కనిగిరి, దాని చుట్టుపక్కల ఊర్లలో జరిగింది. మేనమామ మంత్రి కావడం, బంధువుల్లో సివిల్‌ సర్వెంట్స్‌ ఉండడం రమేష్ ఆలోచనలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండేవి. ఉన్నతమైన స్థానంలో తనను తాను చూసుకోవాలని కలలు కనేవాడు. ఏ ఊర్లో పనిచేసినా హాస్టల్‌ పక్కనే ఇల్లు తీసుకుని ఉన్న తన తండ్రి అనుసరించిన విలువలే రమేష్ మనసులో చెరగని ముద్రవేశాయి. ఇంటర్లో తాలూకా ఫస్ట్‌ రావడంతో ఆయనలో మనోధైర్యం పెంచింది. ఎంసెట్‌లో 1,461 ర్యాంకు వచ్చినా ఎంబీబీఎస్‌ సీటు రాలేదు. ఏదైతేనేం బాపట్లలో బీఎస్సీ అగ్రికల్చర్‌ సీటు రావడం గొప్పగా భావించారు. బాపట్ల కళాశాల విద్యార్థులు ఎందరో సివిల్స్‌ సాధించడమే వారి ఆనందానికి కారణం.

డిగ్రీ పూర్తి అయ్యాక కోయంబత్తూరులోని తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీలో చేరారు. అదే సమయంలో సివిల్‌ సర్వీసెస్‌ వైపు బీజం పడింది. రైటింగ్‌ స్కిల్స్‌ తనకు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడానికి ఫారెస్ట్‌ సర్వీసెస్‌ పరీక్ష రాశారు. ఇంటర్వ్యూ దాకా వెళ్లారు. 2003లో మరోసారి ఫారెస్ట్‌ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ దాకా వెళ్లినా ఫలితం దక్కలేదు. సబ్జెక్ట్స్‌ పరంగా మంచి మార్కులు వచ్చాయి. ఇంటర్వ్యూలో పోవడంతో చాలా బాధపడ్డారు. ఆ షాక్‌ నుంచి చాలా రోజులు కోలుకోలేదు. సివిల్స్‌కు ఏం చదవాలో తెలీదు. మార్గదర్శి ఎవరూ లేరు. అయినాసరే తన లక్ష్య సాధనలో ఎక్కడా వెనక్కి చూడలేదు రమేష్. శిక్షణ కోసం ఢిల్లీలో అడుగుపెట్టారు. స్నేహితుల గదిలో మకాం.

సైన్స్‌ సబ్జెక్టులతో సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యారు. తొలి ప్రయత్నంలో ప్రిలిమ్స్‌లోనే అపజయం ఎదురైంది. రెండో ప్రయత్నంలో ఇంటర్వ్యూ దాకా వెళ్లి వెనక్కి వచ్చేశారు. మూడో ప్రయత్నంలో ప్రిలిమ్స్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మూడు ప్రయత్నాలు విఫలం కావడంతో అందరూ సానుభూతి చూపేవారు. సానుభూతి తిండిపెట్టదని రమేష్ భావించారు. ఢిల్లీ నుంచి మకాం హైదరాబాద్‌కు మార్చారు. తనకు తాను మోటివేట్‌ కావడానికి, ఒత్తిడిని జయించడానికి క్రికెట్‌ను దినచర్యలో భాగం చేసుకున్నారు. నాల్గవ ప్రయత్నంలో పబ్లిక్‌ అడ్మిన్, ఆంత్రోపాలజీతో రంగంలోకి దిగారు. 2006 మే నెలలో ప్రిలిమ్స్‌ ఎగ్జామ్‌ కాగానే తాను ఈ ఏడాది సివిల్స్‌ సాధించబోతున్నానని ప్రగాఢంగా నమ్మారు. ఇదే చివరి ప్రిలిమ్స్‌ కాబోతోందని డైరీలో గర్వంగా రాసుకున్నారు. రాసుకున్న కొన్ని గంటల్లోనే ఓ మిత్రుడి నుంచి ఫోన్‌.. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్‌ లీక్‌ అయిందన్నది ఆయన నుంచి వచ్చిన సమాచారం. ఈ హఠాత్‌పరిణామంతో రమేష్ ఒక్కసారి షాక్‌ అయ్యారు. ఏదైతేనేం మళ్లీ పెట్టిన ఆ ఎగ్జామ్‌లో పాస్‌ అయ్యారు.

మెయిన్స్‌కు కఠోర శ్రమ చేశారు. బయటి ప్రపంచానికి కనపడకూడదని గుండు చేయించుకున్నారు. వెంట్రుకలు తిరిగి వచ్చేలోపు ప్రిపరేషన్‌ పూర్తి కావాలని తన రూమ్‌కే పరిమితమయ్యారు. వెంట్రుకలు లేకపోతే ఒకపట్టాన ఎవరినీ కలవడానికి మనసు ఒప్పదు కాబట్టే గుండు గీయించుకున్నానని అంటారు రమేష్ రెడ్డి. ‘ప్రిపరేషన్‌ సమయంలో ఫోన్‌ లేకుండా ఆ రోజులు గడిపాను. బయటి ప్రపంచానికి దూరంగా ఉన్నాను. సివిల్స్‌ ఈసారి సాధించాల్సిందేనని పట్టుబట్టాను. 54వ ర్యాంకుతో ఐపీఎస్‌ వచ్చింది. మావాడు ఎప్పటికైనా సివిల్స్‌ సాధిస్తాడు అని గర్వంగా చెప్పుకునే నాన్న మాటలు నిజం చేశాను. ప్రయత్నం వదలవద్దని అమ్మానాన్న చెప్పేవారు. ఇలాంటి తల్లిదండ్రులు ఉంటే ఏ కల అయినా పిల్లలకు సాధ్యమే. లక్ష్య సాధనలో ఎన్నడూ బాధపడలేదు. అదృష్టాన్ని నమ్మను. నా కష్టాన్ని నమ్ముకున్నాను. ఐడెంటిటీ కోసమే నా కష్టమంతా’ అని గర్వంగా చెప్పారు.

పోటీ పరీక్షల్లో ఎంపిక విధానమే బాగోలేదని కుండబద్దలు కొట్టినట్టు చెబుతారు రమేష్. ఎంతో కష్టపడి మెయిన్స్‌ పాసైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ మార్కులు వారి భవిష్యత్‌ను నిర్ణయించడం బాగోలేదని అంటారు. ‘పరీక్షా విధానంలో సమూల మార్పులు రావాలి. రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే ఎంపిక ఉండాలి. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన అభ్యర్థులూ సమర్థులే అన్న విషయం బోర్డు గ్రహించాలి. ఇంటర్వ్యూలో అభ్యర్థి క్వాలిటీని మాత్రమే చూడాలి’ అంటూ తన మనసులో మాట చెప్పారు.

కుటుంబ బంధాలకు ఎక్కువ విలువ ఇస్తానని అంటారు రమేష్. ‘వారితో గడపాలని ఎప్పుడూ అనుకుంటాను. అందుకే సెలవులకు ఊరెళ్లడం, పండుగలు పల్లెటూర్లో జరుపుకోవడం చేస్తుంటా. అక్కడి ఆత్మీయ స్పర్శ మరువలేనిది. ఆ అనుభూతిలో మునిగిపోవాలి. స్నేహితులూ నా కుటుంబంలో భాగమే. ఎన్ని పదవులు వచ్చినా నడిచిన దారి మరువరాదు. మానవ సంబంధాలకు విలువ ఇవ్వాలి. నా జీవితంలో అందరి రోల్‌ ఉంటుంది. నన్ను రోల్‌ మోడల్‌గా తీసుకుని సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతున్నవారెందరో. కనిగిరిలో ప్రతి ఇంటా నన్ను అభిమానించేవారుండడం గొప్ప అనుభూతి. ఈ 10 ఏళ్ల కాలంలో సివిల్స్‌ సాధించిన ప్రతి ఒక్కరి మనసులో నేనున్నాను’ అని వినమ్రంగా చెప్పారు.

సివిల్స్‌ సాధించిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వమే ఒక సామాజిక బాధ్యత అప్పగించాలి. ఇలా చేస్తే ఎంతో మార్పును చూడొచ్చు అని అంటారు రమేష్ రెడ్డి. ‘సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటా. సమాజాన్ని ప్రత్యక్షంగా చూడడం ఇష్టం. పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు వెన్నంటి ఉంటాను. ఇతర విజేతలతో ఔత్సాహికులకు శిక్షణ ఇప్పించడానికి ఓ భారీ ప్రణాళిక సిద్ధం చేస్తున్నాను. ఇందుకు హైదరాబాద్‌లో ఉన్న అభిరామ్‌ క్రికెట్‌ అకాడమీని వేదికగా చేసుకోవాలని భావిస్తున్నాను’ అని వివరించారు.

ఐపీఎస్‌ అధికారి అయినా ఆయనలో గర్వం కొంచెం కూడా కనపడదు. సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నాయి. సమాజానికి ఏదో చేయాలని తపన పడతారు. చెరగని చిరునవ్వు రమేష్ సొంతం. వర్షం వస్తే ఆయనలోని చిలిపితనం బయటకు వస్తుంది. పిల్లలు క్షేత్ర, అభిరామ్‌తో కలిసి చిన్నపిల్లాడిలా తడుస్తారు. డ్యాన్స్‌ చేస్తారు. వర్షంలోనూ స్విమ్మింగ్‌ పూల్‌లో ఈత కొడతారు. ప్రకృతిని ప్రేమిస్తారు. ఈ ముగ్గురు పిల్లలు చేసే అల్లరిని ఆస్వాదిస్తుంటారు ఆ ఇంటి హోమ్‌ మినిస్టర్‌ డాక్టర్‌ సుష్మా రెడ్డి. రమేష్ హైదరాబాద్‌ వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు, స్నేహితులను పోగేసుకుని ఫామ్‌ హౌజ్‌లో సేదతీరతారు. ఈ ఫామ్ హౌజ్ లోనే అచీవర్స్ స్టోరీస్ టీముతో ఆత్మీయంగా తన స్వగతాన్ని పంచుకున్నారు.

Rice అన్నం ఇలా వండి తింటే అస్సలు బరువు పెరగరు!

Rice అన్నం ఇలా వండి తింటే అస్సలు బరువు పెరగరు!

చాలా మంది అన్నం తినడం వలన బరువు పెరుగుతారు అని చాలా తక్కువ మోతాదులో తింటూ ఉంటారు. అలాగే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కూడా అన్నం తినకూడదు అంటారు.
కానీ ఆయుర్వేదంలో షుగర్, థైరాయిడ్, పీసీఓడి సమస్యలు ఉన్నవారు కూడా అన్నం తినొచ్చని చెబుతున్నారు. అయితే అన్నం వండే బియ్యంలో కూడా ఎన్నో రకాల బియ్యం ఉంటాయి. ఒక్కో రకం బియ్యంలో వేరే వేరే పోషక విలువలు, అలాగే ఒక్కో రకం బియ్యం ఒక్కో రుచిని కలిగి ఉంటాయి.

అయితే అన్నం వండే విధానాన్ని బట్టి పోషకాలు, మంచి ఆరోగ్యం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. బియ్యంలోని కార్బోహైడ్రేట్స్‌ శరీరానిక శక్తిని ఇస్తాయి. బియ్యంలో ఉండే ఫైబర్‌ జీర్ణక్రియకి హెల్ప్ అవుతుంది. పొటాషియం, బి విటమిన్, ఐరన్, మెగ్నీషియం అనేక పోషకాలను శరీరానికి ఇస్తుంది. మరి మంచి ఆరోగ్యం కావాలంటే ఎలాంటి బియ్యంతో అన్నం వండాలి, ఏ విధంగా వండాలో ఇప్పుడు తెలుసుకుందాం..
అన్నం వండే ముందు బియ్యం ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆ తరువాత 1 కప్పు బియ్యంలో 4 కప్పుల నీళ్లు పోసి చిటికెడు ఉప్పు 1 టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి వేసి ఉడికించి ఎక్కువగా ఉన్న నీళ్లని వంపాలి. వంపిన నీళ్లని సూప్ లాగా తాగొచ్చు. ఇలా వండిన అన్నం తినడం ద్వారా మంచి ఆరోగ్యం లభిస్తుంది. అంతే కాదు అన్నం కూడా పొడిపొడిగా ఉండి మంచి రుచిగా ఉంటుంది. బరువు కూడా పెరగరు. తక్కువ క్వాంటిటీలో తిన్నప్పుడు మాత్రమే ఈ లాభాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

SOS Boxes: రోడ్డుపై కనిపించే ఈ బాక్స్ లు ప్రాణాలు కాపాడుతాయని తెలుసా?

SOS Boxes: రోడ్డుపై కనిపించే ఈ బాక్స్ లు ప్రాణాలు కాపాడుతాయని తెలుసా?

SOS Boxes: రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి కారు లేదా బైక్ ప్రమాదం జరిగినప్పుడు అచేతన స్థితిలో ఉండాల్సి వస్తుంది.
మరికొన్ని సందర్భాల్లో కారు పాడైపోతుంది. ఆ సమయంలో ఎవరైనా సాయం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఆ సమయంలో ఎవరూ అందుబాటులో ఉండరు. కనీసం కనుచూపు మేర కూడా మనుషులు కనిపించరు. అయితే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎమర్జెన్సీ బాక్సులను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
రోడ్డుమీద లేదా రైలు ప్రయాణించే మార్గంలో కొన్ని బాక్సులు కనిపిస్తూ ఉంటాయి. వీటిని చాలా మంది చూస్తారు. కానీ వాటి గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ ఆ బాక్సులు ప్రాణాలు కాపాడుతాయంటే ఎవరూ నమ్మరు. అయితే బాక్సులను చాలా మంది చూసినా వాటిపై అవగాహన లేకపోవడంతో వాటిని ఉపయోగించుకోరు. కొన్ని బాక్సులపై SOS అని రాసి ఉంటుంది. Save Our Soul అని దీని అర్థం. దీనిని సరైన విధంగా వీటిని వాడుకుంటే ఎన్నో ప్రాణాలు నిలిచేవి. ఇంతకీ ఈ బాక్సుల పనితీరు ఎలా ఉంటుందంటే.

ఉదాహరణకు రోడ్డుమీద వెళ్లేటప్పడు ప్రమాదం జరిగిందనుకుందాం…వాహనం పూర్తిగా డ్యామేజ్ అయి.. కనీసం ఫోన్ కూడా పనిచేయని సందర్భంలో చాలా మందికి ఏం తోచదు. ఇలాంటి సమయంలో రోడ్డు పక్కన ఉండే బాక్స్ దగ్గరకు వెళ్లొచ్చు. ఇక్కడ ఉన్న ఎమర్జెన్సీ బాక్స్ పై ఉన్న మధ్యలో బటన్ నొక్కి వాయిస్ మెసేజ్ పంపించవచ్చు. ఈ మెసేజ్ సమీపంలోని పోలీస్ స్టేషన్, ఫైర్ స్టేషన్, అంబులెన్స్ కు ఒకేసారి వెళ్తుంది. ఈ సమాచారం ఆధారంగా వారు ప్రమాదం జరిగిన ప్రదేశానికి వచ్చి ప్రాణాలు కాపాడుతారు.
అలాగే ప్రయాణ సమయంలో కారు పాడైపోయినా.. లేదా డ్రైవింగ్ లో ఎటువంటి ఇబ్బందులు పడినా ఈ బాక్సును ఉపయోగించుకోవచ్చు. అయితే కారు పాడైపోయిన ప్రదేశంలో ఈ బాక్స్ లేదు. అలాంటప్పుడు మొబైల్ నుంచి 1033 కి డయల్ చేయాలి. ఇలా కాల్ చేయగానే సంబంధిత మెకానిక్ చేసేవాళ్లు అక్కడికి చేరుకుంటారు. దూర ప్రయాణాలు చేసేవారికి ఇది ఎందో ఉపయోగకరంగా ఉంటుంది.

Water Heater : మీరు వాటర్ హీటర్ వాడుతున్నారా.? అయితే ఇది తెలుసుకోకపోతే ఇక అంతే..?

Water Heater : మీరు వాటర్ హీటర్ వాడుతున్నారా.? అయితే ఇది తెలుసుకోకపోతే ఇక అంతే..

Water Heater : శీతకాలంలో వేడి నీళ్లతో స్నానం చేయడంలో ఒక విధమైన వినోదం ఉంటుంది. ఈ వింటర్ సీజన్లో వాటర్ హీటర్ ను కొనాలని ఆలోచిస్తున్నట్లయితే.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
హీటర్ తో నీటిని వేడి చేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. లేదంటే చిన్న తప్పులే పెద్ద ప్రమాదానికి దారి తీస్తూ ఉంటాయి. అయితే ఈ వాటర్ హీటర్ వినియోగించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం.. నీటిని వాటర్ హీటర్ తో వేడి చేసేటప్పుడు నీరు వేడి ఆయ్యిందా.. లేదా.. అని చెక్ చేస్తూ ఉంటారు. అలా చేసేటప్పుడు స్విచ్ ఆన్ లో ఉన్నప్పుడు అలాంటి పనులు చేయొద్దు.. స్విచ్ ఆఫ్ లో ఉన్నప్పుడే నీటిని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అలా స్విచ్ ఆన్ లో ఉన్నప్పుడు కరెంట్ షాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

కాబట్టి ఎప్పుడైనా స్విచ్ ఆఫ్ చేసిన తర్వాతనే నీటిని చెక్ చేసుకోవడం మంచిది. అలాగే చూడడానికి హీటర్ రాడ్ మంచిగానే అనిపిస్తుంది. కొన్ని సంవత్సరాల తరబడి వినియోగిస్తే అది కొన్ని అంతర్గత ప్రాబ్లమ్స్ వచ్చి షాక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటర్ హీటర్ ను రెండు సంవత్సరాలు కంటే ఎక్కువగా ఉపయోగించకూడదు.. వాటర్ హీటర్ ను వాడేటప్పుడు నీటిలోకి ఎంత పంపాలో దానిపై గుర్తు ఉంటుంది. ఆ గుర్తు వెళ్లే వరకు నీటిలో ఉంచాలి. అలాగే ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో దీంతో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ వాటర్ హీటర్ పెట్టిన బకెట్ వద్దకు వారు వెళ్లకుండా చూసుకోవాలి. ఒక రూమ్లో హీటర్ పెట్టిన బకెట్ ఉంచి డోర్ లాక్ చేస్తే ఎటువంటి ప్రమాదం జరగదు.

ప్లాస్టిక్ బకెట్ వాటర్ హీటర్ వేడికి కరగకుండా ఉండడానికి దానికి చెక్క కర్రను జోడిస్తే మంచిది. అలాగే నీటిని వేడి చేసేటప్పుడు స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత 10 సెకండ్ల తర్వాత నీటిలోంచి బయటికి తీయాలి. అలాగే ఇనుము లేదా స్టీల్ బకెట్లలో హీటర్ తో నీటిని ఇప్పుడు వేడి చేయకూడదు. ఇది ప్రమాదకరమైన విద్యుత్ షాక్ కు గురవుతుంది. కావున ఎప్పుడైనా ప్లాస్టిక్ మాత్రమే వినియోగించాలి. మీకు వాటర్ హీటర్ పై పూర్తిగా అవగాహన ఉంటేనే వాడాలి. లేదంటే వేడి నీటి కోసం లేదా మీ యొక్క గ్యాస్ పై ద్వారా వేడి చేసుకోండి. దీనిలో ఉన్న రిస్క్ కూడా తక్కువే మరియు కరెంట్ బిల్లు తలనొప్పి కూడా ఉండదు.

Land lord దేశంలో అతిపెద్ద భూస్వామి ఎవరు.. 38,37,793 ఎకరాల ల్యాండ్ ఎవరి దగ్గర ఉందంటే..?

Land lord దేశంలో అతిపెద్ద భూస్వామి ఎవరు.. 38,37,793 ఎకరాల ల్యాండ్ ఎవరి దగ్గర ఉందంటే..?

భారతదేశంలో గత కొన్ని దశాబ్దాలుగా భూమి విలువ భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలోని నగరాల్లో భూములు కొనుగోలు సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్షగా మారింది.
ఎందుకంటే దేశంలో భూమి ధరలు ప్రతిరోజూ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక ముంబై-చెన్నై వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో నివాసం కోసం చాలా తక్కువ భూమి మాత్రమే మిగిలి ఉందంట. ఇటీవలి ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం.. 2030 నాటికి, భారతదేశం తన పౌరుల గృహ అవసరాలను తీర్చడానికి 40 నుండి 80 లక్షల హెక్టార్ల అదనపు భూమి అవసరమని తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో భూము ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే మన దేశంలో భారతదేశంలో అత్యధిక భూమి ఎవరివద్ద ఉందో మీకు తెలుసా..?

ఎవరిది అని మీకు తెలుసా? అతిపెద్ద ‘భూస్వామి’ ఎవరు?

ఎవరికి ఎక్కువ భూమి ఉంది?

ఈ ప్రశ్నకి భారత ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. గవర్నమెంట్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (GLIS) వెబ్‌సైట్‌లో ఇచ్చిన డేటా ప్రకారం.. ఫిబ్రవరి 2021 నాటికి, భారత ప్రభుత్వం దాదాపు 15,531 చదరపు కిలోమీటర్ల భూమికి యజమానిగా ఉంది. ఈ భూమి 51 మంత్రిత్వ శాఖలు మరియు 116 ప్రభుత్వ రంగ సంస్థలతో ఉంది.
అయితే విషయమేమిటంటే.. ప్రపంచంలో దీని కంటే చిన్న దేశాలు చాలా ఉన్నాయి. ప్రపంచంలో కనీసం 50 దేశాలు భారత ప్రభుత్వం కలిగి ఉన్న భూమి కంటే చిన్నవి. ఖతార్ (11586 చదరపు కిలోమీటర్లు), బహామాస్ (13943 sqk), జమైకా (10991 sqk), లెబనాన్ (10452 sqk), గాంబియా (11295 sqk), సైప్రస్ (9251 sqk), Brunei (5765 sq), బహ్రైన్ (5765 sq), సింగపూర్ (726 spk) మొదలైనవి. మంత్రిత్వ శాఖల వారీగా గణాంకాలను పరిశీలిస్తే, భారత రైల్వే అత్యధిక భూమి ఉంది.
భారతీయ రైల్వేకు దేశవ్యాప్తంగా 2926.6 చదరపు కిలోమీటర్ల భూమి ఉంది. దీని తర్వాత రక్షణ మంత్రిత్వ శాఖ (ఆర్మీ) మరియు బొగ్గు మంత్రిత్వ శాఖలకు 2580.92 చదరపు కిలోమీటర్ల ల్యాండ్ ఉంది. ఇక ఇంధన మంత్రిత్వ శాఖ నాల్గవ స్థానంలో 1806.69 చదరపు కిలోమీటర్లు భూమి, భారీ పరిశ్రమలు ఐదవ స్థానంలో 1209.49 చదరపు కిలోమీటర్ల భూమి, షిప్పింగ్ ఆరవ స్థానంలో 1146 చదరపు కిలోమీటర్ల భూమి ఉంది.
అయితే ఇదంతా భారత ప్రభుత్వం గురించిన విషయం. అయితే ప్రభుత్వం తర్వాత అత్యధిక భూమి ఎవరి దగ్గర ఉందో తెలుసా..? రెండో అత్యధిక భూ స్వామి ఏ బిల్డరో లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారో కాదు.. కాథలిక్ చర్చ్ ఆఫ్ ఇండియా దగ్గర.. ప్రభుత్వం తర్వాత రెండవ అతిపెద్ద భూమి యజమాని. ఇది దేశవ్యాప్తంగా వేలాది చర్చిలు, ట్రస్టులు, స్వచ్ఛంద సంఘాలు, పాఠశాలలు, కళాశాలలు మరియు ఆసుపత్రులను నిర్వహిస్తోంది.
కాథలిక్ చర్చ్ ఆఫ్ ఇండియా 1972 నాటి ఇండియన్ చర్చ్‌ల చట్టం తర్వాత పెద్ద మొత్తంలో భూమిని స్వాధీనం చేసుకుంది. బ్రిటీష్ ప్రభుత్వ హయాంలో దీనికి పునాది పడింది. బ్రిటిష్ వారు యుద్ధం తర్వాత స్వాధీనం చేసుకున్న భూమిని చౌక ధరలకు చర్చాకు లీజుకు ఇచ్చారు.. తద్వారా వారు క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేశారు.

చర్చి భూమి విలువ ఎంత?

మీడియంలో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం.. కాథలిక్ చర్చి దేశవ్యాప్తంగా 14429 పాఠశాలలు-కళాశాలలు, 1086 శిక్షణా సంస్థలు, 1826 ఆసుపత్రులు మరియు డిస్పెన్సరీలను నడుపుతోంది. ఒక అంచనా ప్రకారం క్యాథలిక్ చర్చి మొత్తం భూమి విలువ లక్ష కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది.

మూడో స్థానంలో ఎవరు ఉన్నారు?

భూమి విషయంలో వక్ఫ్ బోర్డు మూడో స్థానంలో ఉంది. వక్ఫ్ బోర్డు అనేది 1954 వక్ఫ్ చట్టం ప్రకారం ఏర్పడిన స్వయంప్రతిపత్త సంస్థ. ఇది దేశవ్యాప్తంగా వేలాది మసీదులు, మదర్సాలు మరియు శ్మశానవాటికలను నిర్వహిస్తుంది. మీడియం ప్రకారం వక్ఫ్ బోర్డులో కనీసం 6 లక్షలకు పైగా స్థిరాస్తులు (వక్ఫ్ ల్యాండ్) ఉన్నాయి. ముస్లింల హయాంలో వక్ఫ్ భూములు, ఆస్తులు ఎక్కువగా పొందారు.

Driving Safe App: ఈ ఒక్క యాప్‌ ఉంటే.. మీ డ్రైవింగ్‌ చాలా సేఫ్‌!

Driving Safe App: ఈ ఒక్క యాప్‌ ఉంటే.. మీ డ్రైవింగ్‌ చాలా సేఫ్‌!

Driving Safe App: సొంత వాహనాల్లో వెళ్లేవారు..కొత్త ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు తాము చేరుకోవాల్సిన డెస్టినేషన్‌ కోసం గూగుల్‌ మ్యాప్‌ ఎక్కువగా వాడుతున్నారు.
ఈ మ్యాప్‌లో కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు జరిగాయి. కొన్నిసార్లు వాహనాలు నదులు, బావులు, చిన్న చిన్న గల్లీల్లోలకి కూడా దూసుకుపోయాయి. ఇలా అనేక మంది వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

అనుకోని ప్రమాదాలు..
గూగుల్‌ తల్లిని నమ్ముకుని ముందుకు సాగే వాహనదారులు ప్రమాదాలకు కూడా గురవుతున్నారు. అకస్మాత్తుగా వచ్చే సమస్యను గూగుల్‌ మ్యాప్‌ అప్‌డేట్‌ చేయలేదు. అంచనా వేయదు. దీంతో ఒక్కోసారి స్పీడ్‌గా వెళ్తున్న కారు కూడా సడన్‌గా బ్రేక్‌ వేయాల్సిన పరిస్థితి. ఒక్కోసారి రోడ్డు డైవర్షన్‌ గురించి తెలియక దారి తప్పిన సందర్భాలు చూస్తున్నాం. గూగుల్‌ తల్లిని నమ్ముకుని యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి.

ఈ యాప్‌తో సేఫ్‌ డ్రైవ్‌..
గూగుల్‌ మ్యాప్‌లో పొరపాట్లను గుర్తించిన ఓ అమ్మాయి సేఫ్‌ డ్రైవింగ్‌ కోసం ఓ కొత్త యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌తో మన డెస్టినేషన్‌ను సేఫ్‌గా చేరుకోవడంతోపాటు మనం వెళ్తున్న వాహనాలకు ముందు రాబోయే ప్రమాదాలను కూడా ఈ యాప్‌ హెచ్చరిస్తుంది. డైవర్షన్, స్పీడ్‌ బ్రేక్, రిపేర్స్, ట్రాఫిక్, ఇలా అన్నీ మనకు వాయిస్‌ మెసేజ్‌ ద్వారా అందిస్తుంది. ఇక మన చేరుకునే గమ్యానికి దగ్గరి దారిని కూడా చూపుతుంది. ఫ్లై ఓవర్లు ఎక్కాలో వద్దో కూడా తెలియజేస్తుంది. యూటర్న్‌ ఎక్కడ తీసుకోవాలి. ఎక్కడి నుంచి నియర్‌గా మన గమ్యం ఉంటుంది అనే వివరాలు తెలియజేస్తుంది.. ఇంతకీ ఈ యాప్‌ పేరు చెప్పలేదు కదూ.. దానిపేరే మాపిల్స్‌ మ్యాప్‌ (maapls map). ఇదిగూగుల్‌ కన్నా చాలా అక్యూరసీగా పనిచేస్తుంది. మనం వెళ్తున్న మార్గంలో ఎన్ని టోల్స్‌ ఉన్నాయి. ఎంత టోల్‌ చెల్లించాలి అనే వివరాలను కూడా ముందే తెలియజేస్తుంది. మనం వెళ్తున్న మార్గంలో సేఫ్‌గా జర్నీ చేయడానికి ఈ మాపిల్స్‌ మ్యాప్‌ ఎంతో ఉపయోగపడుతుంది. మీరూ ఒకసారి ట్రై చేయండి.

Call History: గత 6 నెలల్లో మీరు ఎంత మందికి కాల్‌ చేశారు? ఈ యాప్‌ ద్వారా అన్ని తెలుసుకోవచ్చు!

Call History: గత 6 నెలల్లో మీరు ఎంత మందికి కాల్‌ చేశారు? ఈ యాప్‌ ద్వారా అన్ని తెలుసుకోవచ్చు!

మనం ప్రతి రోజు ఎన్నో ఫోన్‌ కాల్స్‌ మాట్లాడుతుంటాము. కానీ ఎవరెవరితో మాట్లాడామన్న వివరాలు ఉండవు. అప్పుడప్పుడు ఫోన్‌ కాల్స్‌ హిస్టరీ డిలీట్‌ చేస్తుంటాము.
గత 6 నెలల్లో మీరు కాల్‌లో ఎప్పుడు, ఎవరితో మాట్లాడారో తెలుసుకోండి. మీరు రిలయన్స్ జియో కంపెనీ యూజర్ అయితే, మీ కాల్ హిస్టరీ తెలుసుకోవాలంటే My Jio యాప్ మీకు సహాయం చేస్తుంది. అయితే ఈ యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత, మీ ఫోన్ ఏ థర్డ్ హ్యాండ్‌లో పడకుండా భద్రంగా ఉంచుకోవాలి.
ఎందుకంటే మీ ఫోన్ వేరొకరి చేతిలో పడితే, ఆ వ్యక్తి ఈ యాప్ సహాయంతో మీ గత 6 నెలల కాల్ హిస్టరీని దొంగిలించవచ్చు. మీరు ఎవరికి కాల్ చేసారు లేదా ఏ రోజు ఎవరి కాల్ అందుకున్నారనే వివరాలన్నీ హిస్టరీలో స్పష్టంగా కనిపిస్తాయి. ఇది మాత్రమే కాదు, ఈ యాప్ కాల్ హిస్టరీ మీరు ఏ నంబర్‌కి ఎన్ని కాల్స్ చేసారో కూడా తెలియజేస్తుంది. మీరు మీ కాల్ చరిత్రను తనిఖీ చేయాలనుకుంటే, దీని కోసం మీరు కొన్ని సాధారణ దశలను అనుసరించాలి.
ముందుగా, ఫోన్‌లో My Jio యాప్‌ని తెరవండి. యాప్‌ను తెరిచిన తర్వాత మీకు మెనూ ఎంపిక కనిపిస్తుంది. ఈ ఎంపికను నొక్కండి. మెనూ ఆప్షన్‌ను ట్యాప్ చేసిన వెంటనే మీకు రైట్ స్టేట్‌మెంట్ ఆప్షన్ కనిపిస్తుంది.
స్టేట్‌మెంట్ ఆప్షన్‌ను నొక్కిన తర్వాత, మీకు ఎన్ని రోజుల కాల్ హిస్టరీ కావాలి అని అడుగుతారు. మీరు 7 రోజులు, 15 రోజులు, 30 రోజులు, అనుకూల తేదీ ఎంపికను పొందుతారు. మీకు 30 రోజుల కంటే ఎక్కువ కాల్ హిస్టరీ కావాలంటే, కస్టమ్ డేట్ ఆప్షన్‌ను ట్యాప్ చేయాలి.
తేదీని నమోదు చేసిన తర్వాత, మీరు ఇమెయిల్‌లో కాల్ హిస్టరీ కావాలనుకుంటున్నారా? డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్నారా లేదా మీరు చూడాలనుకుంటున్నారా అనే మూడు ఎంపికలు మీకు కనిపిస్తాయి. మీరు ఈ ఎంపికలలో దేనినైనా ఎంచుకోవచ్చు. మొత్తం సమాచారాన్ని పొందవచ్చు.

Maruti Swift: లీటర్ పెట్రోల్ పోసి 30 కిలోమీటర్లు తిరగొచ్చు.. మిడిల్ క్లాస్ కు బెస్ట్ కారు ఇదే..

Maruti Swift: లీటర్ పెట్రోల్ పోసి 30 కిలోమీటర్లు తిరగొచ్చు.. మిడిల్ క్లాస్ కు బెస్ట్ కారు ఇదే..

Maruti Swift: ఒకప్పుడు ధనవంతుల ఇళ్లల్లో మాత్రమే కార్లు కనిపించేవి. కానీ మిడిల్ క్లాస్ పీపుల్స్ కూడా కార్లలో తిరగాలని ఆరాటపడుతున్నారు. ఈ తరుణంలో బడ్జెట్, మెయింటనెన్స్ ను దృష్టిలో ఉంచుకొని తమకు అవసరమైన వాహనాన్ని కొనుగోలు చేస్తున్నారు.
ఈ పరిస్థితిని గమనించిన కొన్ని కార్ల కంపెనీలు మధ్య తరగతి వారి బడ్జెట్ కు అనుగుణంగా ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతున్నాయి. అటు ఉన్నత వర్గాలకు అవసరమైన ఫీచర్స్ ను అమరుస్తున్నాయి. ఇలా అన్ని వర్గాల వారిని ఆకర్షిస్తూ.. తక్కువ ధరకు మంచి కార్లను అందిస్తున్నాయి. ఇప్పుడు కొత్త సంవత్సరంలో ఓ కారు అందుబాటులోకి రాబోతుంది. ఇది ఇప్పటికే రోడ్లపై తిరుగుతున్నా.. లేటేస్ట్ ఫీచర్స్ తో పాటు ఆకట్టుకునే డిజైన్ తో రెడీ అవుతోంది. ఇంతకీ ఆ కారు గురించి తెలుసా?

నేటి కాలంలో కారు కొనడం పెద్ద విషయమేమి కాదు. ఎందుకంటే ఆటోమోబైల్ మార్కెట్లో పోటీ కారణంగా చాలా కంపెనీలు తక్కువ ధరకే కార్లను అందించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా కేవలం మిడిల్ క్లాస్ ను బేస్ చేసుకొని మారుతి సుజుకీ కంపెనీ వివిధ మోడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కంపెనీకి చెందిన ఎన్నో కార్లను వినియోగదారులు ఆదరించారు. వారికి అనుగుణంగా కంపెనీ సైతం తక్కువ బడ్జెట్ లో బెస్ట్ ఫీచర్స్, ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లను తయారు చేస్తూ వస్తోంది. తాజాగా ఓ కారును అప్డేట్ చేసి అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.

మారుతి నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన స్విప్ట్ గురించి కారున్న ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. గత రెండు సంవత్సరాలు ఈ మోడల్ అమ్మకాల్లో ముందంజలో ఉంటోంది. 2023 సంవత్సరంలో కూడా 2 లక్షలకు పైగా విక్రయాలు జరుపుకొని బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది. అయితే ఈ మోడల్ ను 2024లో అప్డేట్ చేసి రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకు హ్యాచ్ బ్యాక్ కారుగా ఉన్న దీనిని ఇప్పుడు హైబ్రిడ్ ఇంజిన్ తో అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

కొత్తగా వచ్చే స్విప్ట్ లో 1.2 లీటర్ పెట్రోల్, సీఎన్ జీ వేరియంట్ తో పాటు రెండో ఇంజిన్ 1.2 లీటర్ పెట్రోల్ ఉంటుంది. ఈ బాహుబలి ఇంజిన్ కారణంగా లీటర్ పెట్రోల్ తో 30 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.మైలేజ్ మాత్రమే కాకుండా ఇందులో అప్డేట్ ఫీచర్స్ ను అమర్చనున్నారు. ఎల్ ఈడీ టెయిల్ ల్యాంప్స్, ఏసీ వెంట్స్, డ్యాష్ బోర్డ్, స్టీరింగ్ వీల్ ను అమర్చారు. అలాగే డ్యూయల్ టోన్ కలర్ థీమ్ ను కొత్త కారులో చూడొచ్చు. ఇక ఈ కారులో రక్షణ కోసం 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. పార్కింగ్ కోసం సెన్సార్ కెమెరా, 10 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఎలక్ట్రికల్ 6 వే అడ్జస్టబుల్ సీట్లు ఇందులో కనిపిస్తాయి.

సాధారణ స్విప్ట్ రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు విక్రయించారు. కొత్తగా వచ్చే స్విప్ట్ రూ.14 లక్షలతో అమ్మకాలు జరిగే అవకాశం ఉంది. అయితే దీని గురించి అధికారికంగా ప్రకటించకపోయినా కంపెనీ ప్రకటనను బట్టి కారు ఫీచర్స్ లీక్ అయ్యాయి. ధర, మైలేజ్ తో పాటు బెస్ట్ ఫీచర్స్ ఉండడంతో మరోసారి బాహుబలి స్విప్ట్ అమ్మకాలు ఊపందుకుంటాయని కంపెనీ ప్రతినిధులు అంచనా వేస్తున్నారు.

Gas Bookings : వాట్సాప్ లో గ్యాస్ బుకింగ్స్..అదరగొడుతున్న కొత్త ఫీచర్!

Gas Bookings : వాట్సాప్ లో గ్యాస్ బుకింగ్స్..అదరగొడుతున్న కొత్త ఫీచర్!

ఈమధ్య సరికొత్త ఫీచర్స్ తో నెటిజెన్స్ ని ఆకట్టుకుంటున్న వాట్సాప్, ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్ తో మన ముందుకు వచ్చింది. సాధారణంగా మనం గ్యాస్ ని బుక్ చేసుకోవాలంటే సంబంధిత ఏజెన్సీ నెంబర్ కి కాల్ చేసి బుక్ చేస్తుంటాం.
లేదా ఆ ఏజెన్సీ కార్యాలయం లో వెళ్లి బుక్ చేస్తుంటాం. ఇప్పుడు ఈ బుకింగ్ సర్వీస్ ని జనాలకు మరింత సులభం అయ్యేలా ప్లాన్ చేసింది వాట్సాప్. వాట్సాప్ ద్వారా మీరు గ్యాస్ ని బుక్ చెయ్యాలంటే ముందుగా మీరు పలు ఏజెన్సీలకు సంబంధించిన నంబర్స్ ని మీ మొబైల్ లో సేవ్ చేసుకోవాలి. హెచ్ పీ గ్యాస్ – 9222201122,ఇండియన్ గ్యాస్ – 7588888824,భారత్ గ్యాస్ – 1800224344. ఈ నంబర్స్ ని సేవ్ చేసుకున్న తర్వాత మీరు రెగ్యులర్ గా బుక్ చేసే ఏజెన్సీ కి వాట్సాప్ లో హాయ్ అని మెసేజి చెయ్యండి.

ఆ తర్వాత వెంటనే మీకు బాషాని ఎంచుకోమని రిప్లై వస్తుంది. మనకి కావాల్సిన బాషని ఎంచుకున్న తర్వాత గ్యాస్ బుకింగ్ కి కావాల్సిన కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అందులో మనకి కావాల్సిన ఆప్షన్ ని ఎంచుకుంటే గ్యాస్ బుక్ అయిపోయినట్టే. ఆలస్యం చెయ్యకుండా గ్యాస్ బుక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు వెంటనే మీ వాట్సాప్ ని ఓపెన్ చేసి , పైన చెప్పినట్టు ఫాలో అయిపోండి.

Spirituality: దేవుడు తినడు కదా మరి నైవేద్యం ఎందుకు పెట్టాలి!

Spirituality: దేవుడు తినడు కదా మరి నైవేద్యం ఎందుకు పెట్టాలి!

Spirituality: ఏ పూజ చేసినా, భగవంతుడిని ఆరాధించినా పూజ చేసే విధానంలో ఎన్ని మార్పులున్నా చివరికి నైవేద్యం మాత్రం అందరూ సమర్పిస్తారు.
ఆయా దేవతా రూపాన్ని బట్టి నివేదన మారుతుంది కానీ నైవేద్యం సమర్పించడం మాత్రం మానరు. అసలు దేవుడు తింటాడా..మరి నైవేద్యం ఎందుకు పెట్టాలి…

తిరుమలలో శ్రీవారికి రోజంతా రకరకాల నైవేద్యాలు,పూరీ జగన్నాథుడి సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు నివేదించే పాత్రలతో గర్భగుడి నిండిపోతుందేమో..ఇక మిగిలిన ఆలయాల్లోనూ స్వామి, అమ్మవార్లకు భోగం సమర్పిస్తుంటారు. ఇవన్నీ దేవుడు తింటాడా అంటే తినడు కదా..ఆ విషయం మరి సమర్పించేవారికి తెలియదా అంటే తెలుసు.. మరెందుకు
నైవేద్యం ఎందుకంటే
భగవంతుడికి సమర్పించే నైవేద్యాలను భగవంతుడు తినడు. కానీ పూజించేవారికి భగవంతుడిపై ఉన్న కృతజ్ఞతాభావాన్ని సూచిస్తుంది నైవేద్యం. లోకంలో మనిషి బతకడానికి భుజించే ఆహారపదార్థాలన్నీ ప్రకృతి ప్రసాదించినవే. ప్రకృతిని సృష్టించి చల్లగా కాపాడుతున్నందుకు ఆ దేవుడికి ఈ జీవుడు కృతజ్ఞతాపూర్వకంగా అర్పించేదే నైవేద్యం. మనిషి జీవితం త్యాగ భావనలతోనే పరిపూర్ణమవుతుందనే సత్యాన్ని చెబుతుంది ఈ నివేదన. తాను అనుభవించడంకన్నా ఇతరులకు పంచడంలోనే ఆనందం ఉందన్నది ఆంతర్యం
ప్రసాదానికి ఎందుకంత రుచి
ఏ పూజలో అయినా నైవేద్యానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. పూట గడవని నిరుపేద నుంచి కోట్లకు పడగెత్తిన వారి వరకూ ఎవరి శక్తికి తగ్గా నైవేద్యం వారు సమర్పించుకుంటారు. భగవంతుడికి మాత్రం అందరూ సమానులే. భక్తితో ఏమిచ్చినా తీసుకుంటాడనేందుకు భక్త శబరి, భక్త కన్నప్పలే నిదర్శనం. వాస్తవానికి భగవంతుడి దృష్టి ప్రసరించిన ప్రతి పదార్థం అమృతమయమై, శరీరంలో తేజస్సును- ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తుందని ప్రాచీనగ్రంథాలు చెబుతున్నాయి. అందుకే గమనిస్తే ఇంట్లో ఎంత శ్రద్ధగా చేసినా ఆ రుచి రాదు కానీ ఆలయంలో స్వామి, అమ్మవార్లకు నివేదించిన తర్వాత తీసుకునే ఆ ప్రసాదం రుచి అద్భుతంగా ఉంటుంది. అందుకే చాలామంది అంటుంటారు కదా.. గుడిలో పులిహోరలా లేదు, గుడిలో దద్ధ్యోజనంలా లేదని…దానికి కారణం అందే.. స్వామివారి చూపు , అక్కడున్న ప్రశాంత తరంగాలు ప్రసాదంలో ప్రసరించి ఆ రుచిని ఇస్తాయన్నది పండితుల మాట
ఇంకా చెప్పాలంటే!

ఆహారం తినే ప్రతిసారి ఇది నేను సంపాదించినది అన్న అహంకారం లోలోపల ఉంటుంది. కానీ భగవంతునికి దాన్ని అర్పించాక తినడం వల్ల అహంకారం దశ దాటి అది భగవంతుడి అనుగ్రహం అన్న ఆలోచన వస్తుంది
నైవేద్యం కోసం వండే ఆహారాన్ని రుచి చూడకూడదని కూడా ఎందుకంటారంటే..వంటని కేవలం రుచి కోసం కాకుండా, ఓ పవిత్ర యజ్ఞంగా భావించమన్న సూచన. ఇలా రూపొందించిన ఆహారాన్ని సాత్వికత చేకూరుతుంది. ఆ ఆహారం తిన్నవారిలోనూ పవిత్ర భావనలు చోటు చేసుకుంటాయి.
మనకు లభించిన ఆహారాన్ని సాటిజీవులతో పంచుకోవాలనీ, ఇంటికి వచ్చిన అతిథల ఆకలి తీర్చాలనీ… నైవేద్యం మనకి సూచిస్తుంది.
మనం సంపాదించిన ప్రతి రూపాయీ నీతిగా ఉండాలని అర్థం. సంపాదన కోసం తెలియక చేసిన తప్పులని క్షమించమనీ, తెలిసి చేసిన తప్పులను మరోసారి చేయననీ… ఆ భగవంతుని వేడుకునేందుకు ఇదో విలువైన అవకాశం.
ఆహారాన్ని ఆ భగవంతునికి సమర్పించడంతో ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అన్న సత్యం గుర్తుకువస్తుంది. ఆ అన్నాన్ని వృధా చేయకూడదన్న విచక్షణ కలుగుతుంది
కొంతమంది తినే అన్నం ముందు కూర్చుని ఆహారానికి ఉన్న పరమార్థం మరిచిపోయి జిహ్వచాపల్యానికే ప్రాధాన్యతని ఇస్తారు. అదే నైవేద్యం పెట్టిన ఏ పదార్థాన్ని అయినా విమర్శించకుండా తింటారు..అంటే ఆహారానికి వంక పెట్టకూడదన్నది ఇందులో ఆంతర్యం
మన జీవితంలో కంటి ముందు ఉండే అగ్నిగుండం మన జీర్ణకోశమే! ఆ అగ్నిని శాంతింపచేసే ద్రవ్యం ఆహారం. అందుకే మన ఒంట్లోని అగ్నిని జఠరాగ్ని అన్నారు పెద్దలు. యజ్ఞగుండంలో తగినంత అగ్నిని వేస్తూ దానిని పవిత్రంగా చూసుకుంటామో..మన జఠరాగ్నిని కూడా అంతే పవిత్రంగా చూసుకోవాలి. మనం అందులో వేసే ఆహారాన్ని బట్టే మనసూ, శరీరమూ ఆరోగ్యంగా ఉంటాయి.

Coins – దారిలో కనిపించిన నాణెం తీసుకోవటం మంచిదా.. తీసుకుంటే జరుగుతుందో తెలుసా.?

Coins – దారిలో కనిపించిన నాణెం తీసుకోవటం మంచిదా.. తీసుకుంటే జరుగుతుందో తెలుసా.?
సాధారణంగా మనం రోడ్డుపై వెళ్లేటప్పుడు దారిలో అప్పుడప్పుడు మనకి రూపాయి రెండు రూపాయల నాణేలు కనిపిస్తూ ఉంటాయి. ఇలా కనిపించిన వెంటనే కొందరు వాటిని తీసుకోవటానికి ఆలోచిస్తారు.
ఎందుకంటే కొన్ని సందర్భాలలో నాణేలతో దిష్టి తీసి వాటిని రోడ్డు మీద పడేస్తూ ఉంటారు. అలా దిష్టి తీసిన వాటిని తీసుకోవడం వల్ల వారి దరిద్రం మనకి చుట్టుకుంటుందని చాలామంది ప్రజలు రోడ్డు మీద కనిపించిన నాణేలను తీసుకోవటానికి సంకోచిస్తూ ఉంటారు. అయితే ఇలా రోడ్డు మీద కనిపించిన నాణేలను తీసుకోవటం మంచిదా? లేదా? ఒకవేళ తీసుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

రోడ్డుమీద నడిచి వెళ్తున్నప్పుడు నాణేలు కనిపించడం అనేది లక్ష్మి కటాక్షం మనపై ఉందని తెలిపే ఒక సూచన. అందువల్ల రోడ్డు మీద నాణేలు కనిపించటం శుభపరిణామమని వాటిని తీసుకోవటం వల్ల ఎటువంటి చెడు ప్రభావాలు ఉండవని పండితులు సూచిస్తున్నారు. ఒకవేళ సందేహంతో నాణేలు తీసుకోకుండా వెళితే లక్ష్మీదేవి ని అవమానపరిచినట్లు ఉంటుంది. లక్ష్మీదేవి మనపై చూపించిన కటాక్షాన్ని మనమే తిరస్కరించినట్లు అర్థం. ఇలా చేయటం వల్ల మనం ఎన్ని పూజలు చేసినా కూడా మరల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందలేము. కావున రోడ్డు మీద ఎప్పుడైనా నాణేలు కనిపిస్తే వాటిని తప్పనిసరిగా తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.

ఇలా రోడ్డుమీద దొరికిన నాణేలను తీసుకొని వాటిని పసుపు నీళ్లు, ఆవు పంచితం తో శుద్ధిచేసి వాటిని వాడుకోవచ్చు. లేదా ఇలా రోడ్డుమీద నాణేలు దొరకడం లక్ష్మీ కటాక్షం గా భావించి అలా దొరికిన వాటిని శుద్ధి చేసిన తర్వాత పసుపు కుంకుమ పెట్టి దేవుడి గదిలో ఉంచుకొని పూజించవచ్చు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన ఇంట్లో నిత్యం సిరిసంపదలు నిండుగా ఉంటాయి.

FASTag ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలీదా..? ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు..!

FASTag

ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలీదా..? ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు..!

జాతీయ రహదారులపై వెళ్లే వాహనదారులకు కచ్చితంగా ఫాస్ట్‌ట్యాగ్ ఉండాలి. టోల్ ప్లాజాల మీదుగా వెళ్లేవాహనాలకు పక్కా ఫాస్ట్‌ట్యాగ్ ఉండాలి. ఇంచుమించుగా వాహనదారుల అందరికీ కూడా ఫాస్ట్‌ట్యాగ్ ఉంది.
ఫాస్ట్‌ట్యాగ్ కనుక లేకపోతే టోల్ ప్లాజాల దగ్గరే వీటిని ఇచ్చేస్తున్నారు. టోల్ ఛార్జీలను ఎలక్ట్రానిక్ పద్ధతిలో చెల్లించేందుకు ఫాస్ట్‌ట్యాగ్స్ ఉపయోగ పడతాయి.

ఈ ఫాస్ట్‌ట్యాగ్ కనుక పని చేయాలంటే అందులో బ్యాలెన్స్ తప్పక ఉండాలి. ఇక మరి ఇప్పుడు ఫాస్ట్‌ ట్యాగ్ అకౌంట్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలి…? ఈ విషయాన్ని ఇప్పుడు చూసేద్దాం. సింపుల్‌గా ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్ బ్యాలెన్స్ ని చూడచ్చు. వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి మీరు బ్యాలెన్స్ ని చూడచ్చు.

దీని కోసం మొదట మీరు వెబ్‌సైట్‌ లో లాగిన్ అవ్వాలి.
ఆ తరవాత మీరు ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్ సెక్షన్‌ లోకి వెళ్లాలి.
మీ డీటెయిల్స్ ఇచ్చేసి డీటెయిల్స్ తో లాగిన్ అవ్వాలి.
ఇప్పుడు వ్యూ బాలన్స్ పైన క్లిక్ చెయ్యండి.
ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్ బ్యాలెన్స్ ఇలా తెలుస్తుంది.
ఎస్ఎంఎస్ ద్వారా ఫాస్ట్‌ ట్యాగ్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చెయ్యచ్చు.
ఎస్ఎంఎస్ ద్వారా కూడా మీరు బ్యాలెన్స్ ని చూడచ్చు.
ఫాస్ట్‌ట్యాగ్‌కు రిజిస్టర్ చేసిన తర్వాత టోల్ ప్లాజాల దగ్గర నుండి డెబిట్ అయ్యాక మెసేజ్ వస్తుంది.
ఇలా ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్ బ్యాలెన్స్ ఎంతో తెలిసిపోతుంది.
ప్రీపెయిడ్ వ్యాలెట్‌కు మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయి ఉంటే ప్రీపెయిడ్ ఫాస్ట్‌ట్యాగ్ కస్టమర్ అయితే 08884333331 టోల్ ఫ్రీ కి కాల్ చెయ్యండి.
My FASTag యాప్ డౌన్‌లోడ్ చేసి కూడా మీరు బ్యాలెన్స్ ని చెక్ చెయ్యచ్చు.

Lord Ram: బాలరాముడి ముఖం రివీల్ చేశారుగా.. అయోధ్య రాముడి ఫుల్ సైజ్ ఫస్ట్ పిక్ ఇదే

Ayodhya Ram Idol Face: అయోధ్యలో రామ మందిరంలో గురువారం మంత్ర ఉచ్ఛరణల నడుమ బాల రాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చారు. ఇప్పటి వరకు ఆయన ముఖాన్ని బయటి ప్రపంచానికి చూపించలేదు.
తాజాగా, ఆ రాముడి విగ్రహం ముఖాన్ని రివీల్ చేశారు. బాలరాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకెళ్లడానికి ముందు వర్క్ షాప్‌లో ఉన్నప్పుడు తీసిన ఫొటో ఇది. అయోధ్య రామాలయంలో బాల రాముడి ముఖం ఇలా ఉన్నది.

ఐదేళ్ల బాలుడి రూపంలో నిలబడి ఉన్న స్థితిలో ఈ విగ్రహాన్ని చెక్కారు. 51 అంగుళాల ఎత్తు ఉన్న ఈ విగ్రహాన్ని మైసూరుకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కారు. కృష్ణ వర్ణపు శిలతో అరుణ్ యోగి రాజ్ ఈ విగ్రహాన్ని చెక్కారు.

ఈ బాల రాముడి చేతిలో బంగారి విల్లు, బాణం ఉన్నాయి. రాముడి బంగారు వర్ణం అస్త్రాలను చేత పట్టుకుని నిలబడిన స్థితిలో ఈ విగ్రహాన్ని అరుణ్ యోగి రాజ్ చెక్కారు.

బాలరాముడి మనోహర రూపం ఇదిగో.. ప్రాణప్రతిష్ఠకు ముందే దర్శనం

Ayodhya Ram Mandir: అయోధ్య బాలరాముడి దివ్యరూప దర్శనం భక్తులను తన్మయత్వంలో ముంచెత్తుతోంది. బాలరాముడికి సంబంధించిన ఫొటోలను అధికారులు విడుదల చేశారు.
ప్రాణప్రతిష్ఠకు ముందే బాలరాముడి విగ్రహం దర్శనమిచ్చింది. విగ్రహ పూర్తి భాగం కనిపించే ఫొటోలు విడుదలయ్యాయి.

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం ఈ నెల 22న జరగనుంది. దీనికి దాదాపు ఏడు వేల మంది హాజరవుతారు. సరయూ నదీ తీరంలో నిర్మించిన రామమందిరం.. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద హిందూ దేవాలయం. మన సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు రూపంగా నిలుస్తోంది. భవ్యరామ మందిరం అత్యంత ఖరీదైన మతపర నిర్మాణాల్లో ఒకటిగా నిలిచిపోనుంది.

అయోధ్య అభివృద్ధి
అయోధ్య రూపురేఖలు మారిపోయాయి. రామమందిర నిర్మాణం ప్రారంభమయిన దగ్గరినుంచే అయోధ్య అభివృద్ధి వేగంగా జరుగుతోంది. గతంలో అయోధ్యకు, ప్రస్తుత పట్టణానికి చాలా తేడా ఉంది. రైల్వేస్టేషన్ పునర్‌నిర్మాణం, ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు వంటివే కాదు…అడుగడుగునా అయోధ్యలో మార్పు కనపడుతోంది. ఆధ్యాత్మికంగానూ, ఆర్థికంగానూ ఇకపై అయోధ్య భారత్‌లో కీలక ప్రాంతంగా నిలవనుంది. రామమందిరం ప్రారంభం అయినదగ్గరనుంచి భక్తులు, పర్యాటకులు పెద్ద ఎత్తున తరలిరానుండడంతో…అందరూ సౌకర్యవంతంగా ఉండేలా అయోధ్యను తీర్చిదిద్దుతున్నారు.

అయోధ్య పునర్‌నిర్మాణం కోసం పెడుతున్న ఖర్చు రూ.85 వేల కోట్లు…. పదేళ్లలో అయోధ్య స్వరూపం సమూలంగా మార్చివేయడం కోసం భారీగా నిధులు ఖర్చుచేస్తున్నాయి కేంద్ర, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు. రామమందిరం ప్రారంభం తర్వాత రోజూ మూడులక్షలమంది అయోధ్యను సందర్శిస్తారని ఓ అంచనా. దేశ,విదేశాల నుంచి పెద్దసంఖ్యలో తరలివచ్చే భక్తుల కోసం అయోధ్యను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతున్నారు. అయోధ్యలో ఏ మూల చూసినా త్రేతాయుగం ఆనవాళ్లు కనిపించేలా రూపురేఖలు మారిపోయాయి. ప్రతిచోటా రామాయణ ఇతిహాసపు గుర్తులు కనిపిస్తున్నాయి. త్రీడీ ఆర్ట్‌ వర్క్క్‌ అయోధ్యకు సరికొత్త రూపంలో ఆవిష్కరిస్తున్నాయి.

విశాలమైన రోడ్లు, ఫుట్‌పాత్‌లు, సువిశాల సరయూ తీరం, నది ఒడ్డున ఘాట్‌లు, అండర్‌ గ్రౌండ్ విద్యుత్ సరఫరా, భవనాల పునర్‌నిర్మాణంతో..అయోధ్య అభివృద్ధి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అయోధ్య ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకొచ్చింది. రైల్వేస్టేషన్…ఎయిర్‌పోర్టులను తలదన్నేలా పునర్‌నిర్మితమైంది.

అయోధ్యాపురి హైవే నుంచి వాహనం దిగగానే సువిశాల కారిడార్, స్వాగత తోరణం నుంచి ఎత్తయిన స్తంభాలు, రామాలయం ప్రవేశమార్గం వంటివి అయోధ్యను శోభాయమానంగా మార్చేశాయి. అయోధ్య విద్యుత్ వ్యవస్థ కూడా మారిపోయింది. విద్యుత్ వైర్లు గాలిలో ఎక్కడా కనిపించకుండా అండర్‌గ్రౌండ్ విద్యుత్ సరఫరా జరగనుంది. సరయూ నదీ తీరంలో గుప్తార్ ఘాట్ నుంచి నిర్మాలీ కుండ్ వరకు 10.2 కిలోమీటర్ల మేర 470 సోలార్ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తున్నారు.

ఆలయ సముదాయంతో పాటు అయోధ్య మొత్తాన్ని ఆధ్యాత్మికంగానూ, పర్యాటకంగానూ, ఆర్థికంగానూ తీర్చిదిద్దుతున్నారు. లక్షలమంది పర్యాటకులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అంతర్జాతీయ స్థాయిలో అయోధ్య ఆతిథ్య ప్రాంతంగా మారనుంది. అయోధ్యతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి.

అయోధ్య పునర్‌నిర్మాణం…యాత్రాస్థలాలు, పర్యాటకపరంగా ఓ విప్లవంలాంటిదని ఆర్థికనిపుణులు అంటున్నారు. అయోధ్య చారిత్రక నేపథ్యం,సాంస్కృతిక వారసత్వం కొనసాగిస్తూనే అధునాతన అయోధ్యను ప్రపంచస్థాయిలో తీర్చిదిద్దుతున్నారు.

రామమందిర నిర్మాణం మొత్తం పూర్తయిన తర్వాత అయోధ్యలో స్థానికులు, పర్యాటకుల నిష్పత్తి 1:10గా ఉంటుందని అంచనావేస్తున్నారు. 31వేల 662 కోట్ల బడ్జెట్‌తో 37 రాష్ట్ర్ర, కేంద్ర ఏజెన్సీలు ప్రస్తుతం అయోధ్య రూపురేఖలు మార్చడంలో నిమగ్నమై ఉన్నాయి. ఆధ్మాత్మిక అయోధ్య, పరిశుభ్ర అయోధ్య, అందరికీ సౌకర్యవంతంగా ఉండే అయోధ్య, ప్రయోగాత్మక అయోధ్య, సాంస్కృతిక అయోధ్య, ఆరోగ్య అయోధ్య, ఆధునిక అయోధ్య, సమర్థవంతమైన అయోధ్య పేరుతో మొత్తం 8 కేటగిరీల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.

అయోధ్యలో ఆతిథ్య రంగ దిగ్గజాలు
ఆన్‌లైన్ ఫుడ్ కంపెనీలు, వాటర్ కంపెనీలు, ఆతిథ్య రంగ దిగ్గజాలు అయోధ్యలో బ్రాంచ్‌లు తెరుస్తున్నాయి. 2021లో అయోధ్యకు 3లక్షల25వేలమంది పర్యాటకులు వచ్చారు. 2022లో రెండుకోట్ల 39లక్షలమంది సందర్శించారు. 2031 నాటికి ఏటా నాలుగుకోట్లమంది అయోధ్యను సందరిస్తారని అంచనా. భక్తులకు, పర్యాటకులకు ఇబ్బందులు కలగకుండా అయోధ్యను ఆతిథ్యనగరంగా తీర్చిదిద్దనున్నారు.
ఇప్పటికే అయోధ్యలో యూనిఫాం బిల్డింగ్ కోడ్ అమలవుతోంది. వాణిజ్య, వ్యాపార భవనాలకు ఓ కేటగిరీ, నివాస భవనాలు మరో కేటగిరీ, ఆలయాలు, ఇతర ప్రార్థనాస్థలాలు ఇంకో కేటగిరీ, చారిత్రక కట్టడాలు, భవంతులు మరో కేటగిరీగా చేశారు. వీటికి రంగులు కేటాయించి డిజైన్, స్టయిల్‌లో మార్పుచేస్తున్నారు.

రోడ్డు విస్తరణతో తొలగించిన భవనాల స్థానంలో కొత్త భవనాలు, పాత భవనాల మరమ్మతులు, సామర్థ్యం పెంపు వంటివి వేగంగా జరుగుతున్నాయి. అదనపు అంతస్థులు, కొత్త నిర్మాణాలతో అయోధ్యలో రియల్‌ఎస్టేట్ ఊహకందని విధంగా అభివృద్ధి చెందుతోంది. ప్రయివేట్ హోటళ్లు, రిసార్టులు ఏర్పడుతున్నాయి. మొత్తంగా చారిత్రక ఆయోధ్య…ఇతిహాసపు కాలాన్ని గుర్తుకు తెస్తూనే..ఆధునిక అయోధ్య, పర్యాటక స్వర్గధామంగా కొత్తరూపు తెచ్చుకుంటోంది.

Ram Date of Birth: శ్రీ రాముడు పుట్టింది ఎప్పుడో తెలుసా..?

ఇప్పుడు ఎవరి నోట విన్న అయోధ్య మాటే. అందరి చూపు అయోధ్య వైపు. జనవరి 22న రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట జరగనుంది. ఈ వేడుకను ప్రధాని మోదీ నిర్వహించనున్నారు.
అంతేకాకుండా.. ఈ వేడుకలో దేశ, విదేశాల ప్రముఖులు పాల్గొననున్నారు. మరుసటి రోజు అంటే జనవరి 23 నుంచి భక్తులు ‘అయోధ్య రాముడు’ని దర్శించుకోవచ్చు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి 11,000 మంది అతిథులను ఆలయ ట్రస్ట్ ఆహ్వానించింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు.
ఇదిలా ఉంటే.. శ్రీ రాముడు పుట్టిన తేదీని ఓ సంస్థ తెలిపింది. పురాణాలన్నీ రాముడు త్రేతాయుగంలోనే జన్మించాడని చెబుతూఉంటాయి. వాల్మీకి రామాయణం కూడా.. రామాయణమంతా త్రేతాయుగంలో జరిగిందేనని స్పష్టం చేస్తోంది. అయినప్పటికీ.. మనందరికీ అర్థమయ్యేలా స్పష్టమైన తేదీలేవీ చెప్పలేదు. వాల్మీకి రామాయణంలో.. శ్రీరాముడు వనవాసానికి వెళ్లే సమయానికి ఆయన వయస్సు 25 ఏళ్లుగా తెలిపారు.
కాగా.. శ్రీరాముడు పుట్టిన తేదీ క్రీస్తుపూర్వం 5114వ సంవత్సరం, జనవరి 10న మధ్యాహ్నం 12.05 నిమిషాలకు అని ఇనిస్ట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ గణాంకాలతో నిర్ధారించింది. మహాభారతం, రామాయణాలు, పౌరాణిక ఇతిహాసాలు.. కేవలం కల్పిత కావ్యాలు కావని, అవి చారిత్రక గ్రంధాలని సంస్థ తెలిపింది. అంతేకాకుండా.. లంకలోని అశోకవనంలో సీతాతల్లిని కలిసిన సంవత్సరం 5076 సెప్టెంబర్ 12న కలిశాడని ఆ సంస్థ తెలిపింది. మరోవైపు.. మహాభారత యుద్ధం క్రీస్తుపూర్వం 3,139, అక్టోబర్ 13 నుంచి ప్రారంభమైందని పేర్కొంది.

 

Promotions – Promotion list -పదోన్నతుల జాబితా ఎలా తయారు చేస్తారు? Roaster Points in Promotions Communal Roaster Points & Seniority in Promotions

పదోన్నతుల జాబితా ఎలా తయారు చేస్తారు?

Roaster Points in Promotions Communal Roaster Points & Seniority in Promotions

ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 5 (ఐ.ఇ.) తేది 14-2-2003 ప్రకారము పదోన్నతుల పోస్టుల యందు కూడ ప్రభుత్వములోని అన్ని శాఖలలోని, అన్ని కేటగిరి పోస్టులలో 15% ఎస్సిలకు, 6% ఎస్టిలకు రిజర్వేషన్ కల్పించబడినది. ఆ ఉత్తర్వును అమలు చేయుటకు మార్గదర్శక సూత్రాలు *GO.Ms.No. 21 Dt. 1 8.03.2003* ద్వారా విడుదలయిన

అదే విధముగ 3% వికలాంగులకు కూడ రిజర్వు చేయబడినవి. (GO.Ms.No.42 Dt. 19.10.2011) అంధ ఉద్యోగులకు పదోన్నతులకు అవసరమైన డిపార్ట్మెంట్ పరీక్షల నుండి 5 సంవత్సరములు మినహయింపు కలదు. (G0.Ms.No.748 GAD Dt: 29.12.2008).

పదోన్నతులలో SC,ST & PHC కేటగిరీ లో అర్హులు దొరకనట్లయితే సంభందిత రోస్టర్ పాయింట్లు 2 సంవత్సరముల వరకు బ్యాక్ లాగ్ ఉంచాలి. రెండవ సంవత్సరం కూడా భర్తీ కానట్లయితే ఆ పోస్టులకు డీ – రిజర్వు చేసి తదుపరి సంవత్సరం మరల యధావిధంగా బ్యాక్ లాగ్ గా ఉంచాలి.

SC , ST కేటగిరి లలో మహిళలు లేనిచో పురుషులలో భర్తీ చేస్తారు. *(G.O.Ms.No.18 Dt:17.2.2005)

సీనియారిటీ, ప్రమోషన్సు రిజిస్టర్ల గురించి తెలుసుకుందాం.

DSC లోని మెరిట్ ర్యాంకు, DOB ల సహాయంతోనూ, SC, ST, PH, BC లకు కేటాయించిన రోష్టరు ప్రకారం తయారు చేసిన ప్రమోషన్ రిజిస్టర్నే మెరిట్ కం రోష్టరు రిజిస్టర్ అంటారు.

గౌరవ కోర్టువారు మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారమే సీనియారిటీ లిష్టు తయారు చేయాలని తీర్పులిస్తున్నారు. గౌరవ భారత సుప్రీం కోర్టు వారు మెరిట్కి,రోస్టర్ ర్యాంకుకు అన్యాయం జరగకుండా పదోన్నతులు ఇవ్వాలని తీర్పునిచ్చింది. APSSSR 1996 రూల్సు నందుకూడా 33 నుండి 37 వరకు మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం సీనియారిటీ లిష్టులు ఎలాతయారు చేయవలసి ఉందో స్పష్టంగా ఉన్నది.

సీనియారిటీ లిష్టులు మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం తయారు చేసి, దీని ఆధారంగా ప్రమోషన్సు రిజిస్టర్ తయారు చేయాలి. ఈ ప్రమోషన్సు రిజిస్టర్లో ప్రమోషన్సులో రిజర్వేషన్లు ఉన్న SC, ST, PH అభ్యర్థులను రోష్టర్లో పెట్టి ప్రమోషన్సు ఇవ్వాలి .

సీనియారిటీ రిజిస్టర్ (లిష్టు):

ఒకే సారి(DSC) లో సెలక్టు కాబడిన వారందరూ డేట్ ఆఫ్ జాయినింగ్ తో సంభందం లేకుండా మెరిట్ కమ్ రోస్టర్( DSC Appointment)ర్యాంకు ప్రకారం సీనియారిటీ లిష్టులు తయారు చేయాలి, ఈ రిజిస్టర్ ప్రకారం SC, ST, PH అభ్యర్థులు లిష్టులో చివరలో ఎక్కడ ఉన్నా మెరిట్ కమ్ రోష్టరు ప్రకారం ప్రమోషన్సు పొందుతారు.

3. ప్రమోషన్సు రిజిస్టర్: ప్రమోషన్సులో రిజర్వేషన్లు ఉన్న SC (15%) , ST(6%), PHC (3%) లకు రోష్టరు పాయింట్లు అడక్వసీ నిబంధనలకు లోబడి వర్తిస్తాయి.

SC :General : 7, 16, 27, 41, 52, 62, 72, 77, 91, 97 (మొత్తం : 10) Women : 2,22,47,66,87 (మొత్తం : 5)

ST :General : 25, 33, 75, 83 (మొత్తం : 4) Women : 8, 58 (మొత్తం : 2)

PHC :6 (అంధత్వం లేదా తక్కువ చూపు ), 31 (చెవుటి లేక మూగ ), 56 ( అంగవైకల్యం).

Total Roaster Points : 24

మిగిలిన 76 పాయింట్లు అన్నీ ఓపెన్ కేటగిరీ క్రింద అందరికీ కలిపి (మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం) పదోన్నతులు ఇవ్వబడతాయి ఓపెన్ కేటగిరీలో OC, BC, SC, ST, PH అభ్యర్ధులు అందరూ మెరిట్ కమ్ రోస్టర్ ర్యాంకు (DSC Appointment Rank) ప్రకారం ప్రమోషన్సు పొందుతారు, SC, ST, PH లు నిర్ణీత కోటా మేరకు పదోన్నతి పొందితే వారి కోటాలో అడక్వసీ చేరుకున్నట్లు. అప్పుడు వారి యొక్క రోష్టరు పాయింట్లు జనరల్ గామార్చబడుతాయి. ఇదంతా ప్రమోషన్సు రిజిస్టర్లో ఉంటుంది.

అడక్వసీ అంటే

“ఒక కేడర్ పోస్టులకు సంబందించి, ఆ కేడర్లో SC,ST ,PH అభ్యర్థులు తమకు కేటాయించిన పర్సంటేజి మేరకు ఇప్పటికే పనిచేస్తూ ఉంటే ,ఆ కేడర్ లో అడిక్వసీ చేరుకున్నట్లు”. అడిక్వసీ చేరుకుంటే తదుపరి ప్రమోషన్లకు రిజర్వేషన్ వర్తించదు.అప్పుడు వారి పాయింట్లు అన్నీ జనరల్‌ క్రింద మారతాయి. అప్పుడు అందరినీ కలిపి కామన్ గా మెరిట్ కమ్ రోస్టర్ (DSC Appointment Rank) ర్యాంకు ప్రకారం సీనియారిటి లిస్ట్ తయారు చేసి పదోన్నతులు ఇస్తారు.

(G.O.Ms.No. 2 dt: 9.01.2004)

(G.O.Ms.No.18 dt: 17.02.2005)

వికలాంగ ఉద్యోగులకు పదోన్నతులలో 3% రిజర్వేషన్లు – విధివిధానాలు

భారత ప్రభుత్వ సూచనలు అనువర్తించుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము 30 జులై 1991 నుండి ప్రభుత్వ ఉత్తర్వులు సంఖ్య 115 ద్వారా అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియమాకాల్లో అంగవికలురైన నిరుద్యోగులకు 3% రిజర్వేషన్లు ప్రవేశపెడుతూ 19 అక్టోబర్ 2011న ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 42ను విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం

ఉద్యోగుల సంఖ్య 5 కన్నా ఎక్కువ ఉన్న ప్రతి ప్రభుత్వ కేడర్లోను పదోన్నతులలో వికలాంగులకు రిజర్వేషన్లు ఇవ్వాలి.

పాయింట్ల పదోన్నతి రోస్టర్లో 6,31 మరియు 56 పాయింట్లను వికలాంగులకు కేటాయించాలి.

ఈ రిజర్వేషన్లు, సదరు పోస్టుకు పూర్తిగా అర్హతలున్నవారికే ఇవ్వాలి. విద్యార్హతలలో కానీ, శాఖాపరమైన పరీక్షల కృతార్ధతలో కాని ఎటువంటి మినహయింపు ఉండదు.

అంగవికలురు పనిచేయలేని కొన్ని పోస్టులకు తప్ప మిగిలిన అన్ని పోస్టులలో ఈ రిజర్వేషన్ విధానము అమలుపరచాలి. ఏ డిపార్ట్మెంట్ అయినా దానిలో కొన్ని కేడర్లకు ఈ రిజర్వేషన్లు అమలు పరచుట సాధ్యం కాకపోతే రోజుల్లో ఈ ఉత్తర్వులు ఇవ్వని శాఖనుండి మినహయింపు (Exemption) కు అనుమతి పొందాలి.

పదోన్నతులలో వికలాంగుల 6, 31, 56 రోస్టర్ పాయింట్లలో అభ్యర్థులు దొరకపోతే సీనియారిటీలో అట్టడుగున ఉన్న వికలాంగ అభ్యర్థిని సదరు పాయింట్స్లో ఉంచి పదోన్నతి కల్పించాలి. సీనియారిటీ జాబితాలో పైన ఉన్న అభ్యర్థి క్రింది రోస్టర్ పాయింట్ కు తీసుకురాకూడదు. అతడు/ఆమె కు అతని సీనియారిటీ ప్రాతిపదికనే పదోన్నతిగా ఇవ్వాలి.

ఈ పద్ధతిలో పదోన్నతులు ప్రతి కేడర్లో 3% వికలాంగ అభ్యర్థులు కోటా సంతృప్తి పడేవరకు కొనసాగాలి. అట్లు పూర్తయిన వెంటనే పదోన్నతులలో వికలాంగులకు రిజర్వేషన్లు సంబంధిత కేడర్లో నిలిపివేయాలి.

పదోన్నతులలో వివిధ రకాల రిజర్వేషన్ అమలు పరుచు విధము:

(G.O.Ms.No.23 WCDE&DE Dt.26-5-2011) నియామకాలలో అనుసరించినట్లే వికలాంగులకు నిర్దేశించిన 3% రిజర్వేషన్లో గుడ్డివారికి 1%, చెవుడు/మూగవారికి 1%, చలనాంగాల వైకల్యత లేక మస్తిష్య పక్షవాతము ఉన్నవారికి 1% చొప్పున రిజర్వేషన్లు అమలు పరచాలి. వరుసగా 3 సైకిల్స్ లో వికలాంగులలో స్త్రీ లతో సహా పై మూడు రకాల అంగవైకల్యము కలవారికి పదోన్నతులలో రోస్టర్ పాయింట్లు కేటాయించాలి.

ఎస్.సి, ఎస్.టి.లకు పదోన్నతులలో రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. కావున ఈ వికలాంగ రిజర్వేషన్ కొరకు ప్రస్తుతం అమలులో ఉన్న రోస్టర్ జాబితానే కొనసాగించవచ్చును. కొత్తగా రోస్టర్ జాబితాను 1వ పాయింట్తో ప్రారంభించనవసరం లేదు.

పై పాయింట్లలో 3 సైకిల్స్ పూర్తి అయిన తరువాత మరల 4వ సైకిల్ నుండి 6వ సైకిల్ వరకు ఆ పైన సైకిళ్లకు ఇదే విధానమును కొనసాగించుకోవాలి.

ఒక ప్యానల్ లేక పదోన్నతి సంవత్సరములో ఒక వికలాంగ విభాగమునకు చెందిన అర్హుడైన అభ్యర్థి దొరకపోతే, మరుసటి సంవత్సరమునకు (Next Succeding Year) అదే విభాగానికి, ఆ పోస్ట్ ను క్యారీ ఫార్వర్డ్ చేయాలి. మరుసటి సంవత్సరం కూడా అర్హుడైన అభ్యర్థి దొరకకపోతే ఈ 3విభాగాలలో మరొక విభాగమునకు గ్రుడి, చెవిటి, OH వరుసలో ఉన్న అంతరమార్పు (Interchange) చేసుకోవచ్చును. స్త్రీ అభ్యర్థి దొరకకపోతే పురుష వికలాంగునకు ఇవ్వవచ్చును.

పై మూడు విభాగములలో దేనిలోనూ అభ్యర్థులు దొరకకపోతే రెండవ సంవత్సరము వికలాంగత లేని అభ్యర్థిచే ఆ పోస్టును పదోన్నతి ద్వారా భర్తీ చేయవచ్చును.

ఉదాహరణకు 6వ పాయింట్ వద్ద అర్హుడైన గ్రుడ్డి స్త్రీ అభ్యర్థి దొరకపోతే ఆ ఖాళీని తదుపరి పదోన్నతి సంవత్సరమునకు క్వారీఫ్వార్డ్ చేయాలి. ఆ తదుపరి సంవత్సరము కూడా సదరు అభ్యర్థి దొరకకపోతే పురుష గ్రుడ్డి అభ్యర్థికి అవ్వాలి. పురుష అభ్యర్థి దొరకపోతే చెవిటి, మూగవారికి, వారుకూడా దొరకపోతే OH అభ్యర్థిచే పదోన్నతి ద్వారా భర్తీ చేయవచ్చును.

అదే విధముగా 31వ రోస్టర్ పాయింట్లో చెవిటివారికి పదోన్నతి ఇవ్వవలసి యున్నది. మొదటిసారి ఆ అభ్యర్థి దొరకకపోతే తదుపరి సంవత్సరమునకు ఆఖాళీని క్యారీఫార్వర్డ్ చేయాలి. అప్పుడు కూడా అభ్యర్థి దొరకకపోతే మొదటగా OH అభ్యర్థికి అవకాశము ఇవ్వాలి. వారు కూడా దొరకకపోతే గ్రుడ్డివారికి అవకాశమివ్వాలి. ఈ ఇద్దరూ దొరకకపోతే సీనియారిటీ ప్రకారం అంగవైకల్యము లేని అభ్యర్థిచే ఆ పోస్టు భర్తీ చేయవచ్చును.

ఇదే విధంగా 56వ రోస్టర్ పాయింట్ వద్ద OH లేక మస్తిష్క పక్షవాతము ఉన్నవారికి పదోన్నతి ఇవ్వవలసియున్ని. మొదటిసారి ఆ అభ్యర్థి దొరకకపోతే తదుపరి సంవత్సరమునకు ఆ ఖాళీను క్యారీఫార్వర్డ్ చేయాలి. అప్పుడు కూడా అభ్యర్థి దొరకకపోతే మొదటగా గ్రుడ్డివారికి తరువాత చెవిటి, మూగవారికి అవకాశమివ్వాలి. వారు కూడా దొరకకపోతే సీనియారిటీ ప్రకారము వైకల్యత లేని అభ్యర్థికి అవకాశమివ్వాలి.

Related GOs & Proc :

G.O.Ms.No.5 dt:14.2.2003 Reservation in Promotions.

G.O.Ms.No. 2 dt: 09.01.2004 Policy of Provding Rule of Reservation in Promotions in favaour of SCs & STs.

G.O.Ms.No. 21 dt: 18.03.2003 Policy of Providing Rules of Reservation in Promotions in favour of SCs & STs .

G.O.Ms.No. 18 dt: 17.02.2005 In case there are no qualified women candidates available, for promotion to fill in the roster points earmarked for SC(Women) / ST (Women) the vacancies shall be filled by SC(Male) / ST (Male) candidates.

G.O.Ms.No.16 dt: 17.02.2005 Policy of Providing Rules of Reservation in Promotions in favour of SCs & STs – Modification Orders.

G.O.Ms.No. 42 dt: 19.10.2011 Providing Reservations in Promotions to the Differently Abled Employees.

G.O.Ms.No. 23 dt: 26.05.2011 Providing Reservation in Promotions to the Differently Abled Employees in 3 Categories.

G.O.Ms.No. 748 dt: 29.12.2008 Promotion to the higher posts – Visually Handicapped employees – Passing of Departmental Tests for promotion to next higher

Categories – 5 years time allowed

Pension Rules Book – పెన్షను రుాల్స్ పై ప్రశ్నలు-జవాబులు పుస్తకము. జాగ్రత్త గా భద్రపర్చుకోండి. ఉపయోగపడును.

Pension Rules Book – పెన్షను రుాల్స్ పై ప్రశ్నలు-జవాబులు పుస్తకము. జాగ్రత్త గా భద్రపర్చుకోండి. ఉపయోగపడును.

Download..pension Rules book…

MEMO/CHARGE MEMO ల గురించి పూర్తి సమాచారం….

MEMO/CHARGE MEMO

మెమో అనేది సాధారణమైన కమ్యూనికేషన్ విధానం. అధికారులు తన క్రింది స్థాయి కార్యాలయాల తో, అధికారులతో, ఉద్యోగులతో సంప్రదింపులు జరపడానికి మెమో ఫార్మాట్ ని ఉపయోగిస్తారు. సమాచారాన్ని, నివేదికలు, అభిప్రాయాలు, సంజాయిషీలు ఇలా క్రింది స్థాయి సిబ్బంది తో లేదా కార్యాలయాలతో దేని కోసం అయినా మెమో ఫార్మాట్ ని వాడతారు.

సాధారణంగా మెమో ఇచ్చారు అనేది ఏదైనా తప్పు చేస్తే ఇస్తారు అనే అభిప్రాయం చాలా మందికి ఉంది. ఇది పూర్తిగా వాస్తవం కాదు. ఏదైనా తప్పు జరిగిన సందర్భంలో మెమో లు జారీ చేయడం సహజమే. దానర్ధం తప్పు చేసినట్లు ఆరోపించడం కాదు. ఏదైనా తప్పు జరిగినపుడు డానికి సంబంధించిన ఆధారాలు, సమాచారం, అభిప్రాయం లేదా సంజాయిషీ తెలుసుకోవడానికి సంబంధిత ఉద్యోగులకి మెమో లు ఇవ్వడం జరుగుతుంది. ఇలా మెమో ల రూపం తో పాటు వివిధ మార్గాల ద్వారా సేకరించిన సమాచారాన్ని, ఆధారాలను, సాక్షులని బట్టి జరిగిన తప్పులకి బాధ్యులు ఎవరు? ఎవరు నిబంధనలను అతిక్రమించారు అని నిర్ధారణ కు వస్తారు. దీనిని ప్రాధమిక విచారణ అంటారు. దీనికి ప్రత్యేక విధి విధానాలు ఏమీ ఉండవు. జరిగిన తప్పుకు ఆధారాలను, బాధ్యులను గుర్తించడం ప్రధాన లక్ష్యం. (ఇది పోలీస్ శాఖ కేసు దర్యాప్తు తరహా గా భావించవచ్చు)

ప్రాధమిక విచారణ జరగడానికి లేదా ఆధారాలు సేకరించడానికి ఏదైనా ఇబ్బంది కలుగుతుందని భావించిన సందర్భాలలో ఆధారాలను తారుమారు చేయడానికి అవకాశం లేకుండా అవసరమైన వారిని సస్పెండ్ చేస్తారు (క్రిమినల్ కేసులలో అరెస్ట్ చేయడం గా భావించవచ్చు)

ప్రాధమిక విచారణ లో తేలిన అంశాల ఆధారంగా బాధ్యులైన వారిపై అభియోగాలు నమోదు చేస్తూ ఆ అభియోగాలకు ఆధారాలను, సాక్ష్యాలను జతపరుస్తూ ఛార్జ్ మెమో జారీ చేయటం జరుగుతుంది. (క్రిమినల్ కేసులలో ఇదే విధంగా కోర్టు లో ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు).

ఆ ఛార్జ్ మెమో కి సంజాయిషీ ఇవ్వవలసిందిగా సదరు ఉద్యోగిని కోరతారు. అతని సంజాయిషీ ని బట్టి అభియోగాలు డ్రాప్ చేయడం లేదా కొనసాగిస్తూ తదుపరి చర్యలు ప్రారంభించడం జరుగుతుంది (పోలీసులు ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ ని వాటిని ఎందుకు అడ్మిట్ చేసుకోరాదో తెలిపమని కోర్టు నిందితులకు పంపుతుంది. వారు ఇచ్చిన సమాధానం ఆధారంగా ఆ ఛార్జ్ షీట్ ని విచారణకు తీసుకోవడం లేదా తిరస్కరించడం జరుగుతుంది)

ఉద్యోగి ఇచ్చిన సంజాయిషీ తో సంతృప్తి చెందితే తదుపరి చర్యలు డ్రాప్ చేయడం జరుగుతుంది. అభియోగాలు తీవ్రమైనవి అయి మేజర్ పనిష్మెంట్ ఇచ్చే ఉద్దేశ్యం ఉన్నట్లయితే ఉద్యోగికి తన తప్పు లేదని నిరూపించుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఎంక్వయిరీ ఆఫీసర్ (ఈయన జడ్జి తరహాలో వ్యవహరిస్తారు) ప్రెజెంటింగ్ ఆఫీసర్ (పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేదా గవర్నమెంట్ ప్లీడర్ తరహాలో వ్యవహరిస్తారు). అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగి తన తరపున తాను లేదా సహాయకుడిని (డిఫెన్స్ అసిస్టెంట్) ని (ఈయన డిఫెన్స్ లాయర్ గా వ్యవహరిస్తారు). ప్రెజెంటింగ్ ఆఫీసర్ అభియోగాలు నిరూపించడానికి ప్రయత్నిస్తే డిఫెన్స్ అసిస్టెంట్ ఆ అభియోగాలు తప్పని నిరూపించడానికి ప్రయత్నిస్తారు. వీరి వాదనలను బట్టి, ఆధారాలను ఎంక్వయిరీ ఆఫీసర్ అభియోగాలు రుజువు అయ్యాయా లేదా అనే నివేదిక సమర్పిస్తారు.

ఈ విచారణ నివేదిక ని ఆరోపణలను ఎదుర్కొంటున్న ఉద్యోగికి ఇచ్చి అతని అభిప్రాయాన్ని తీసుకుంటారు.

ఆరోపణలు రుజువైనట్లు నివేదిక ఇస్తే ఆ ఉద్యోగిపై ఈ పనిష్మెంట్ ఎందుకో ఇవ్వకూడదో తెలుపమని షో కాజ్ నోటీసు జారీ చేస్తారు.

అతని సంజాయిషీ తీసుకుని ప్రొపోజ్ చేసిన పనిష్మెంట్ ని తగ్గించడం కానీ లేదా అదే పనిష్మెంట్ ని ఇస్తూ కానీ ఆదేశాలు జారీ చేస్తారు.

ముందుగానే మైనర్ పనిష్మెంట్ ఇవ్వాలని భావించినప్పుడు ఈ విచారణ అనేది లేకుండా ఛార్జ్ మెమో ఇచ్చిన సంజాయిషీ ఆధారంగా సంతృప్తి చెందకపోతే నేరుగా షో కాజ్ జారీ చేసి పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది.

ఈ పనిష్మెంట్ లో ప్రభుత్వం తో సహా ఉన్నతాధికారులు ఎవరూ కూడా ఉద్యోగి అప్పీల్ చేసుకుంటే తప్ప కలగజేసుకోలేరు. ఒకవేళ ఉద్యోగి అప్పీల్ చేసుకుంటే కనుక ఉన్నతాధికారులకు పనిష్మెంట్ తగ్గించడం, అదే పనిష్మెంట్ ని నిర్ధారించడం తో పాటు పెంచడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. (ఆరోపణలు రుజువైన సందర్భంలో అప్పీల్ కి వెళ్లినా కూడా పనిష్మెంట్ తీవ్రత ని మార్చడం సాధ్యం కానీ పనిష్మెంట్ లేకుండా డ్రాప్ చేయడం సాధ్య పడదు).

ప్రొబేషన్ లో ఉన్నా, ప్రొబేషన్ పూర్తి అయినా తప్పు చేసినట్లు నిర్ధారణ చేయకుండా చర్యలు తీసుకోలేరు. కాకపొతే ప్రొబేషన్ లో ఉండగా తప్పు నిర్ధారణ అయితే చిన్న తప్పుకు కూడా ఉద్యోగం నుండి తొలగించడం సులభం. అలాగే తరచుగా ఆరోపణలు వచ్చి (నిర్ధారణ అయినా కాకపోయినా) సంజాయిషీ ఇచ్చుకునే పరిస్థితి ఉంటే ఆ కారణంగా ఉద్యోగి సర్వీస్ పట్ల సంతృప్తి చెందలేదనే నెపంతో ప్రొబేషన్ ని పొడిగించవచ్చు.

Compassionate Appointments-Karunya Niyaamakaalu (కారుణ్య నియామకాలు )-Get Details in Telugu

Compassionate Appointments-Karunya Niyaamakaalu (కారుణ్య నియామకాలు )-Get Details in Telugu

✍️చాలా మంది ఉద్యోగ ఉపాధ్యాయులు ఇటీవలి కాలంలో కోవిడ్ బారిన పడి మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులకు నిబంధనల ప్రకారం కారుణ్య నియామకం కు అర్హత ఉంటుంది.. దాని కోసం కారుణ్య నియామకాల పూర్తి నిబంధనలను ఇక్కడ పొందుపర్చుతున్నాము.

Compassionate Appointments-Karunya Niyaamakaalu (కారుణ్య నియామకాలు )-Get Details in Telugu

????కారుణ్య నియామకాలు

ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న వ్యక్తి హఠాత్తుగా మరణిస్తే ఆ కుటుంబ సభ్యులు ఆసరా కోల్పోతారు. ఇబ్బందుల్లో కూరుకుపోతారు. ఆరోగ్య కారణాల రీత్యా ఉద్యోగం చేయలేని అసక్తత ఏర్పడినా అదే పరిస్థితి. ఇలాంటి కుటుంబాలను ఆదుకోడానికే కారుణ్య నియామకాలను ప్రవేశపెట్టారు. అయితే ఈ నియామకాలపై చాలా మందికి చాలా అనుమానాలున్నాయి. ఎప్పుడిస్తారు, ఎలా ఇస్తారు, ఎవరికిస్తారు, ఎక్కడిస్తారు, ఎప్పటిలోపు ఇవ్వాలి, ఏ పోస్టులిస్తారు ఇలా అనేక అనుమానాలున్నాయి.

????మీకోసమే ఈ సమాచారం

????కారుణ్య నియామకాలు :

????రెండు రకాలు.

ఒకటి : మరణించిన ఉద్యోగి కుటుంబీకులకు ఇచ్చేది.

రెండు : వైద్య కారణాల వల్ల ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగి ఆధారితులకు ఇచ్చేది.

????కారుణ్య నియామకాల లక్ష్యం ఏమిటి ?

మరణించిన లేక అనారోగ్య సమస్య వల్ల ఉద్యోగం చేయలేని అసక్తత ఏర్పడిన ఉద్యోగుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడం.

????జీవోలు:

మరణించిన ప్రభుత్వ ఉద్యోగిపై ఆధారపడినవారికి జీవో 687, జీఏడీ, 03.10.1977 ద్వారా కారుణ్య నియామకం ఇస్తారు. కాలక్రమంలో ఈ జీవోకు సంబంధించి పలు సవరణలు, వివరణలు ఇచ్చారు. వీటన్నింటినీ చేర్చి 60681/సర్వీస్‌-ఏ/2003-1, జీఏడీ, 12.08.2003 ద్వారా సమగ్ర ఉత్తర్వులు ఇచ్చారు. వైద్య కారణాల వల్ల రిటైర్‌ అయిన ఉద్యోగుల వారసుల కారుణ్య నియామక అవకాశాన్ని జీవో ఎంఎస్‌ నెం.661, జీఏడీ, తేదీ 23.10.2008 ద్వారా పునరుద్ధరించారు. సర్వీసులో ఉండి మరణించిన ఎయిడెడ్‌ టీచర్ల వారసులకు కారుణ్య నియామకాలను జీవో ఎంఎస్‌ నెంబర్‌ 113, విద్యాశాఖ, తేదీ : 6.10.2009 ద్వారా అనుమతించారు.

????కారుణ్య నియామకాలకు అర్హులెవరు?

మరణించిన ఉద్యోగి వారసులు, వైద్య కారణాల వల్ల రిటైర్‌మెంట్‌ తీసుకున్న ఉద్యోగి వారసులు, ఏడేళ్లపాటు కనిపించకుండాపోయిన ఉద్యోగి వారసులు ఈ నియామకాలకు అర్హులు. వైద్య కారణాల వల్ల కనీసం ఐదేళ్ల సర్వీసు ఉండగా రిటైర్‌మెంటు తీసుకుంటే ఆ ఉద్యోగిపై ఆధారపడిన కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం ఇస్తారు. కనిపించకుండాపోయిన ఉద్యోగి విషయంలో పోలీసు రిపోర్టు ఆధారంగా ఉద్యోగం ఇస్తారు.

???? ఎవరికిస్తారు?

ఎలాంటి కారణ్య నియామకమైనా ఎవరికిస్తారన్న అనుమానం చాలా మందికి ఉంటుంది. దానికి విధివిధానాలు ఉన్నాయి.

????1.ఉద్యోగి భార్య/భర్త.

???? 2.కుమారుడు/కుమార్తె.

????3.ఉద్యోగి మరణించిన నాటికి కనీసం ఐదేళ్ల మునుపు చట్టబద్ధంగా దత్తత తీసుకున్న కుమారుడు/కుమార్తె.

????4.ఉద్యోగి భార్య/భర్త నియామకానికి ఇష్టపడని సందర్భంలో ఆ కుటుంబంపై ఆధారితురాలైన వివాహిత కుమార్తె.

????5. మరణించిన ఉద్యోగికి ఒక వివాహిత కుమార్తె, మైనర్‌ కుమార్తె ఉంటే వారి తల్లి సూచించినవారికి ఉద్యోగం ఇస్తారు.

????6.ఉద్యోగి అవివాహితుడై మరణించినపుడు అతని తమ్ముడు, చెల్లెలు కారుణ్య నియామకానికి అర్హులు.

????ఏ పోస్టులో నియమిస్తారు?

జూనియర్‌ అసిస్టెంటు పోస్టులోగానీ, ఆ పోస్టు స్కేలుకు మించని పోస్టులోగానీ, అంతకన్నా తక్కువస్థాయి పోస్టులోగానీ నియమిస్తారు.

????నియామక విధానం ఎలా?

ఉద్యోగి మరణించిన ఏడాదిలోపు అతని కుటుంబ సభ్యులుయ నియామకం కోరుతూ దరఖాస్తు చేసుకోవాలి. మైనర్‌ పిల్లల విషయంలో ఉద్యోగి మరణించిన రెండు సంవత్సరాలలోపు 18 సంవత్సరాలు వయసు నిండినపుడు మాత్రమే వారి దరఖాస్తు పరిగణించబడుతుంది. వైద్య కారణాల వల్ల రిటైర్మెంట్‌ కోరుకునేవారి దరఖాస్తు జిల్లా/రాష్ట్ర వైద్యుల కమిటీకి పంపి వారి నివేదిక ఆధారంగా జిల్లా/రాష్ట్ర కమిటీ సిఫార్సు మేరకు నియామకాధికారి అనుమతి ఇస్తారు.

????అర్హతలు :

ఆయా పోస్టులకు సంబంధించిన నిర్ణీత అర్హతలు కలిగివుండాలి. అయితే జూనియర్‌ అసిస్టెంట్‌గా సబార్డినేట్‌ ఆఫీసులో నియామక అర్హతైన ఇంటర్మీడియెట్‌ పాసయ్యేందుకు 3 సంవత్సరాల గడువు, శాఖాధిపతి కార్యాలయం లేక సచివాలయం అయితే నియామక అర్హతైన డిగ్రీ పాసయ్యేందుకు 5 సంవత్సరాల గడువు ఇస్తారు. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ కులాల వారికి ఐదేళ్ల మినహాయింపు ఉంది. ఉద్యోగి భార్య/భర్తకు నియామకం ఇవ్వాల్సి వస్తే వారికి వయోపరిమితి 45 ఏళ్లు. చివరి శ్రేణి పోస్టుకు వయసు, అర్హతలు తగిన విధంగా లేనపుడు ముందు నియామకం ఇచ్చి ఆ తరువాత మినహాయింపును సంబంధిత శాఖ నుంచి పొందవచ్చును.

????నియామక పరిధి

మరణించిన ప్రభుత్వ ఉద్యోగి పనిచేసిన యూనిట్‌లో నియామకం ఇస్తారు. ఆ యూనిట్‌లో ఖాళీలు లేనపుడు ఆ కేసులను నోడల్‌ అధికారి అయిన జిల్లా కలెక్టర్‌కు పంపిస్తే ఆయన ఇతర డిపార్టుమెంట్లకు కేటాయిస్తారు. ఏ డిపార్టుమెంట్‌లోనూ ఖాళీలు లేని సందర్భంలో కలెక్టరు ఒక క్యాలెండర్‌ సంవత్సరంలో 5 వరకు సూపర్‌ న్యూమరీ పోస్టులు సృష్టించొచ్చు. అంతకు మించి పోస్టులు అవసరమైనపుడు సంబంధిత శాఖలకు ప్రతిపాదనలు పంపాలి.

Health

సినిమా