OnePlus Mobiles: దేశంలో One Plus ఫోన్ల్ అమ్మకాలు బంద్.. మే 1 నుంచే.. ఎందుకంటే..

భారతదేశంలోని రిటైల్ చైన్‌లు మే 1 నుంచి చైనాకు చెందిన ప్రసిద్ధ వన్‌ప్లస్ బ్రాండ్ మెుబైల్ పరికరాల అమ్మకాలను నిలిపివేయనున్నాయి. కంపెనీకి, రిటైలర్లకు మధ్య తలెత్తిన వివాదాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆర్గనైజ్డ్ రిటైలర్స్ అసోసియేషన్ ప్రకారం దేశంలోని OnePlus ఉత్పత్తులపై స్థిరంగా తక్కువ లాభాల మార్జిన్‌లు రిటైలర్‌లు తమ వ్యాపారాన్ని కొనసాగించడం సవాలుగా మార్చాయని చెబుతున్నారు.
వీటికి తోడు వారంటీ, సర్వీస్ క్లెయిమ్‌ల ప్రాసెసింగ్‌లో నిరంతరం జాప్యంతో పాటు సంక్లిష్టతల కారణంగా వినియోగదారులు అసంతృప్తిగా ఉన్నట్లు ఆర్గనైజ్డ్ రిటైలర్స్ అసోసియేషన్ పేర్కొంది. వీటిని వాటిని పరిష్కరించడానికి పదేపదే ప్రయత్నించినప్పటికీ వారి భారం పెరిగిందని వారు చెబుతున్నారు. దేశంలోని గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా కొన్ని ప్రధాన ఫలిత మార్కెట్లలో నిషేధం వర్తిస్తుందని తెలుస్తోంది. ముఖ్యంగా ఇవి ప్రభావవంతమైన, ఆర్థికంగా పెద్ద రాష్ట్రాలు కావటం గమనార్హం. అందువల్ల మొబైల్‌లు, టాబ్లెట్‌లు, ఇయర్‌ఫోన్‌లతో సహా అన్ని OnePlus పరికరాలు ఈ రాష్ట్రాల్లోని మొత్తం 4,500 స్టోర్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉండవని తెలుస్తోంది. ఇది కంపెనీకి నిజంగా పెద్ద ఎదురుదెబ్బగా తెలుస్తోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *