ఉత్తరప్రదేశ్ సుల్తాన్పూర్లో విషాదం చోటు చేసుకుంది. రోడ్డుపైనే కారును నిలిపిన డ్రైవర్.. సడెన్గా డోర్ ఓపెన్ చేయడంతో వెనుక నుంచి సైకిల్పై వచ్చిన వ్యక్తికి తగిలి కిందపడిపోయాడు.
అదే సమయంలో అపోజిట్లో వస్తున్న మరో కారు అతని మీద నుంచి వెళ్లడంతో స్పాట్లోనే చనిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. కార్ డోర్ ఓపెన్ చేసే ముందు మిర్రర్ చేసుకోవాలని సూచిస్తున్నారు నెటిజన్లు. ఇలాంటి వారికి లైసెన్స్ ఎలా ఇస్తారని మండిపడుతున్నారు.
































