Car Tips: కారులో కూర్చోగానే ఈ తప్పు అస్సలు చేయకండి.. చాలా డేంజర్‌..

www.mannamweb.com


ఒకప్పుడు లగ్జరీ వస్తువుగా ఉన్న కారు ఇప్పుడు నిత్యవసరంగా మారుతోంది. మరీ ముఖ్యంగా కరోనా తర్వాత సొంత కారు కొనుగోలు చేసే వారి సంఖ్య పెరగుతోంది. సొంతింటి ప్రాధాన్యత ఇచ్చే వారితో పాటు కారుకు కూడా ప్రాధాన్యత పెరుగుతోంది. బ్యాంకులు సులభంగా రుణాలు ఇస్తుండడం, సెకండ్ హ్యాండ్‌ కార్‌ మార్కెట్ పెరగడంతో కార్లను ఉపయోగిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది.

ఇదిలా ఉంటే కారును ఉపయోగించే సమయంలో పలు సూచనలు కచ్చితంగా పాటించాలని నిపుణులు చెబుతున్నారు. మనలో చాలా మంది తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తుంటారు. ఇలాంటి వాటిలో కారు ఏసీ ప్రధానమైంది. కారులో ఏసీ ఉపయోగించే సమయంలో కొన్ని రకాల నిబంధనలు పాటించాలి. మనలో చాలా మంది కారులో కూర్చోగానే ఏసీ ఆన్‌ చేస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ కారులో కూర్చోగానే ఏసీ ఆన్‌ చేయడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* మన శరీరం సాధారణ ఉష్ణోగ్రత కంటే కారు ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది డ్రైనెస్‌ సమస్యకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలెర్జీ సమస్యలతో బాధపడేవారికి సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కారులో కూర్చోగానే ఏసీ ఆన్‌ చేయకూడదు.

* సాధారణంగా కారు ఏసీ వెంట్స్‌ను క్రమంతప్పకుండా శుభ్రం చేసే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి కాబట్టి కారులో కూర్చున్న వెంటనే ఏసీ ఆన్‌ చేస్తే ఆ దుమ్ము నేరుగా ముక్కులోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. అందుకే ఏసీ ఆన్‌ చేసిన కొన్ని క్షణాల పాటు విండోస్‌ను ఓపెన్‌ చేయాలని సూచిస్తుంటారు.

* ఇక కారులో కూర్చొగానే ముందుగా విండోస్‌ను ఓపెన్‌ చేయాలి. ఆ తర్వాతే ఏసీ ఆన్‌ చేయాలి. సాధారణంగా కారు ఇంటీరియర్‌లో ఉండే వస్తువులు ఫైబర్‌ లేదా ప్లాస్టిక్‌తో తయారు చేస్తారు. ఇవి వేడికి గురైనప్పుడు వచ్చే వాయువులు ఆరోగ్యాన్ని పాడు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. కారు ఎండలో ఉన్నప్పుడు ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. అందుకే కారులోకి ఎక్కగానే ముందుగా విండోస్‌ అన్ని ఓపెన్‌ చేసి లోపలి గాలి బయటకు వెళ్లిన తర్వాతే విండోస్‌ క్లోజ్‌ చేసి ఏసీ ఆన్‌ చేయాలి. లేదంటే ఈ ప్రమాదకరమై వాయువు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.