రైతులకు కేంద్రం గుడ్​ న్యూస్.. ‘పీఎం కిసాన్’ డబ్బులు వచ్చేశాయ్!

www.mannamweb.com


రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వం 17వ విడత పీఎం-కిసాన్ సాయాన్ని విడుదల చేసింది. ఇవాళే బ్యాంకు అకౌంట్లలో నగదు జమ చేస్తున్నారు.

మొత్తం 9.26కోట్ల మంది రైతులకు ఈ స్కీమ్ ద్వారా లబ్ధి కలుగుతోంది. దాదాపు రూ. 20 వేల కోట్ల రూపాయల నిధి విడుదల చేసింది.

కేంద్ర బీజేపీ సర్కార్ రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని తీసుకోచ్చింది. ఈ స్కీమ్‌ను 2019లో ప్రారంభించారు.

అప్పటి నుంచి ప్రతి ఏడాది మూడు విడతల్లో ప్రతి 4 నెలలకు ఒకసారి రూ.2 వేల చొప్పున రైతుల అకౌంట్‌లో నేరుగా కేంద్రం వేస్తోంది. కాగా, రైతుల సంఖ్య కోట్లలో ఉన్న కారణంగా.. కొందరికి ముందు, మరికొందరికి వెనుక డబ్బులు జమ అయ్యే ఛాన్స్ ఉంది.