Breaking: ఏపీ ప్రభుత్వానికి కేంద్రం గుడ్ న్యూస్.. భారీగా నిధుల విడుదల

Breaking: ఏపీ ప్రభుత్వానికి కేంద్రం గుడ్ న్యూస్.. భారీగా నిధుల విడుదల


కొత్త ప్రభుత్వానికి కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. వైఎస్ జగన్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన విషయం అందరికి తెలిసిందే. అయితే కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి కేంద్రం అండగా నిలిచింది.

అప్పులతో పాలన ప్రారంభించనున్న నేపథ్యంలో ఆర్థికంగా చేయూత ఇచ్చింది. పన్నుల పంపిణీ కింద రూ.5, 655 కోట్లను విడుదల చేసింది. ఏపీతో పాటు తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు నిధులు విడుదల చేసింది. తెలంగాణకు రూ. 2,937 కోట్లు, యూపీకి రూ.25,069 కోట్లు, బిహార్‌కు రూ.14,056 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు హర్షం వ్యక్తం చేశారు. ఆర్థికంగా ప్రధాని మోడీ అండగా నిలిచారని తెలిపారు.