గోదావరిలో క్రూడ్ ఆయిల్ లీక్.. దుర్వాసనతో యానం పరిసర ప్రాంత ప్రజలు ఆందోళన

www.mannamweb.com


యానాం పరిసర ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైప్ లైన్ లీక్ వల్ల జరగరాని అనర్థం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు. తరచు ఇలాంటి పైప్ లైన్‌ లీకేజ్ వల్ల మత్స్య సంపద కనుమరుగు అవుతుందంటున్నారు మత్యకారులు. పుదిచ్చేరి యానాం కాంగ్రెస్ పార్టీ మిత్ర పక్షాలు విషయం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లారు.

తూర్పు గోదావరి జిల్లా యానాం దరియాలతిప్ప వశిష్ట గోదావరిలో ONGC పైప్ లైన్ నుంచి క్రూడ్‌ ఆయిల్‌ లీక్ అవుతోంది. గోదావరిలో క్రూడ్ ఆయిల్ లీక్ అయి ఆ ప్రాంతమంతా దుర్వాసన రావడంతో యానాం పరిసర ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైప్ లైన్ లీక్ వల్ల జరగరాని అనర్థం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు. తరచు ఇలాంటి పైప్ లైన్‌ లీకేజ్ వల్ల మత్స్య సంపద కనుమరుగు అవుతుందంటున్నారు మత్యకారులు. పుదిచ్చేరి యానాం కాంగ్రెస్ పార్టీ మిత్ర పక్షాలు విషయం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లారు. ఇంత జరుగుతున్నా పైప్ లైన్ లీక్ పై ONGC అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నా పుదిచ్చేరి ఢిల్లీ అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ స్పందించడం లేదని.. ప్రజా ప్రతినిధులుగా ఏమి చేస్తున్నారని యానాం కాంగ్రెస్ పార్టీ మిత్ర పక్షాలు ప్రశ్నిస్తున్నాయి.