Ayodhya Ram Mandir | అంకెల్లో అయోధ్య రామ మందిరం వివరాలు..

Ayodhya Ram Mandir | అయోధ్య రామమందిరంలో ప్రాణ ప్రతిష్ట వేడుకలను ప్రపంచంలోని హిందువులంతా పండుగలా చేసుకుంటున్నారు. ఈ తరుణంలో అయోధ్యలో నూతనంగా నిర్మించబడిన ఆ శ్రీ రాముని దివ్య మందిరం గురించిన అంకెల వివరాలు మీ కోసం..
శంకుస్థాపన జరిగిన తేదీ: 5.08.2020
ప్రాణ ప్రతిష్ఠ: 22.01.2024
మందిరం నిర్మాణం సంపూర్ణమయ్యేది (అంచనా) : 2026 నాటికి
ఆలయం విస్తీర్ణం : 2.77 ఎకరాలు
నిర్మాణ విస్తీర్ణం : 57,400 చదరపు అడుగులు
ఆలయం పొడవు : 360 అడుగులు
ఆలయం వెడల్పు : 235 అడుగులు
ఆలయ శిఖరం ఎత్తు : 161 అడుగులు
ప్రవేశ ద్వారాలు : 12
గర్భగుడిలో బాలరాముడి విగ్రహం ఎత్తు : 51 అంగుళాలు
భక్తులకు దర్శనం ఇచ్చే దూరం : 35 అడుగులు
రామమందిరం కాంప్లెక్స్‌ మొత్తం విస్తీర్ణం : 110 ఎకరాలు
ఏకకాలంలో కాంప్లెక్స్‌లో ఎంతమంది ఉండొచ్చు : 10 లక్షల మంది వరకు
రామ మందిరానికి అయిన ఖర్చు : 900 కోట్లు
కాంప్లెక్స్‌ నిర్మాణానికి అయ్యే ఖర్చు అంచనా : 1,800 కోట్లు
జూన్, 2022 నాటికి ట్రస్ట్‌కు వచ్చిన విరాళాలు : 3,400 కోట్లు.