???? దేశంలో చిట్టచివరి గ్రామం ఇది, రెండు సముద్రాల మధ్య ఏకాకిలా….. ధనుష్కోడి… తమిళనాడులోని రామేశ్వరానికి సుమారు 19 కిమీల దూరంలో పంబన్ దీవుల్లో ఈ గ్రామం ఉంది. ఇండియా, శ్రీలంకను కలిపే రామ సేతు లేదా ఆడమ్స్ బ్రిడ్జ్‌ ఈ గ్రామంలోనే ఉంది. ఇప్పుడు ఈ గ్రామానికి రోడ్ మార్గం వేశారు…. రామేశ్వరం నుంచి ధనుష్కోడి జర్నీ వీడియోను ని కూడా ఇక్కడ చూడండి.

Dhanushkodi is an abandoned town at the south-eastern tip of Pamban Island of the state of Tamil Nadu in India. It is situated to the South-East of Pamban and is about 18 miles west of Talaimannar in Sri Lanka. The town was destroyed during the 1964 Rameswaram cyclone and remains uninhabited in the aftermath.
Dhanushkodi is an abandoned town at the south-eastern tip of Pamban Island of the state of Tamil Nadu in India. It is situated to the South-East of Pamban and is about 18 miles west of Talaimannar in Sri Lanka. The town was destroyed during the 1964 Rameswaram cyclone and remains uninhabited in the aftermath. ఉత్తరాన్న హిమాలయాలతో మొదలుకుని.. దక్షిణాన్న సముద్రంతో ముగిసే ఈ దేశంలో వింతలు విశేషాలకు కొదవ లేదు. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో రెండు సముద్రాల మధ్య నిర్మానుష్యంగా కనిపించే ఈ గ్రామం గురించి తెలిస్తే.. ఆశ్చర్యమే కాదు, అయ్యో పాపం అని బాధపడతారు కూడా. ఎందుకంటే.. ఇండియాలోనే చిట్టచివరి గ్రామమైన ఈ ప్రాంత చరిత్ర విషాదంతో ముడిపడి ఉంది. ధనుష్కోడి.. దేశంలోనే చిట్టిచివరి గ్రామం ఇది.



ఉత్తరాన్న హిమాలయాలతో మొదలుకుని.. దక్షిణాన్న సముద్రంతో ముగిసే ఈ దేశంలో వింతలు విశేషాలకు కొదవ లేదు. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో రెండు సముద్రాల మధ్య నిర్మానుష్యంగా కనిపించే ఈ గ్రామం గురించి తెలిస్తే.. ఆశ్చర్యమే కాదు, అయ్యో పాపం అని బాధపడతారు కూడా. ఎందుకంటే.. ఇండియాలోనే చిట్టచివరి గ్రామమైన ఈ ప్రాంత చరిత్ర విషాదంతో ముడిపడి ఉంది.

ధనుష్కోడి.. దేశంలోనే చిట్టిచివరి గ్రామం ఇది. తమిళనాడులోని రామేశ్వరానికి సుమారు 19 కిమీల దూరంలో పంబన్ దీవుల్లో ఈ గ్రామం ఉంది. ఇండియా, శ్రీలంకను కలిపే రామ సేతు లేదా ఆడమ్స్ బ్రిడ్జ్‌ ఈ గ్రామంలోనే ఉంది. దనుష్కోడికి చేరాలంటే 2016 వరకు సముద్రంలోనే ప్రయాణం చేయాల్సి వచ్చేది. పర్యాటకులు, జాలర్లు సముద్రం ఆటుపోటులు చూసుకుని బస్సుల్లో, జీపుల్లో చేరుకొనేవారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇటీవల రోడ్డు మార్గాన్ని అందుబాటులోకి తెచ్చింది.

తీరని విషాదం: దేశ చరిత్ర, ఇతిహాసాల్లో ధనుష్కోడికి ప్రత్యేక స్థానం ఉంది. అయితే, ప్రకృతి విపత్తుల వల్ల ఈ ప్రాంతం మనుషులను మింగేసింది. 1964లో ఏర్పడిన తుఫాను రామేశ్వరం వద్ద తీరం దాటింది. దీంతో 23 అడుగుల ఎత్తులో ఉప్పెన వచ్చింది. ఫలితంగా ఆ గ్రామంలో నివసిస్తున్న 1800 మంది చనిపోయారు. తుఫాన్ సమయంలో 115 మంది ప్రయాణికులతో వెళ్తున్న రైలు కూడా ఉప్పెనలో చిక్కుకుంది. ఆ విషాద గుర్తులు ఇప్పటికీ దనుష్కోడిలో కనిపిస్తూనే ఉంటాయి. ప్రస్తుతం ఇక్కడ జాలర్లు మాత్రమే నివసిస్తున్నారు. 2004లో ఏర్పడిన సునామీ సైతం 1,600 అడుగుల ఎత్తైన అలలతో దనుష్కోడిని ముంచేశాయి. దీంతో ఈ ప్రాంతంలో అడుగుపెట్టాలన్నా, నివసించాలన్నా ప్రజలు వణికిపోతున్నారు.

ఆ సమయాల్లో వెళ్తే ప్రమాదమే: రామేశ్వరానికి రైలు లేదా బస్సులో చేరుకోవచ్చు. లేదా మధురైలో విమానం దిగి రామేశ్వరం మీదుగా దనుష్కోడికి వెళ్లేందుకు ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. రాత్రి వేళ్లలో ఈ ప్రాంతాన్ని సందర్శించడం ప్రమాదకరం. వర్షాకాలం, తుఫాన్ల సమయంలో ఈ ప్రాంతం భయానకంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో రెండు సముద్రాలు ఉంటాయి. అవి రెండు ఒకే చోట కలుస్తాయి. ఫలితంగా అక్కడ విభిన్న వాతావరణం కనిపిస్తుంది. ఆ ప్రాంతంలో బంగాళాఖాతం నిశబ్దంగా ఉంటే.. హిందూ మహా సముద్రం అలలతో ఎగసిపడుతూ కనిపిస్తుంది. . ఈ రెండు సముద్రాల్లో ఎక్కడ తుఫాన్ ఏర్పడినా.. ఈ ప్రాంతం మునిగిపోతుంది.

శ్రీలంకకు 18 మైళ్ల దూరంలోనే: ఈ ప్రాంతానికి 18 మైళ్ల దూరంలోనే శ్రీలంకలోని తలైమన్నార్ పోర్టు ఉండేది. అక్కడికి చేరుకోవడం కోసం చెన్నై నుంచి పంబన్ దీవి వరకు రైల్లో ప్రయాణించి, అక్కడి నుంచి ఓడల్లో శ్రీలంక చేరుకునేవారు. అయితే, 1964 తర్వాత ఆ మార్గం ధ్వంసమైంది. 1982లో శ్రీలంకలో అంతర్యుద్ధం వల్ల ఓడల రవాణా సేవలు కూడా నిలిచిపోయాయి. ఇప్పటికీ అక్కడ రైల్వే స్టేషన్ గోడలు, చర్చి తదితర శిథిల భవనాలు కనిపిస్తూనే ఉంటాయి. ఈ సారి రామేశ్వరం వెళ్లినప్పుడు తప్పకుండా ఈ చిట్టచివరి గ్రామాన్ని సందర్శించి సెల్ఫీ తీసుకోండి.

రామేశ్వరం నుంచి ధనుష్కోడి జర్నీ వీడియోను ఇక్కడ చూడండి: