Madan Mohan: ‘విజయసాయిరెడ్డికి డీఎన్‌ఏ పరీక్ష చేయాల్సిందే’

www.mannamweb.com


Madan Mohan: ‘విజయసాయిరెడ్డికి డీఎన్‌ఏ పరీక్ష చేయాల్సిందే’

అమరావతి: తన భార్యకు పుట్టిన కుమారుడి విషయమై వివాదం తీరాలంటే ఎంపీ విజయసాయిరెడ్డి, న్యాయవాది సుభాష్‌ డీఎన్‌ఏ టెస్టుకు రావాలని దేవాదాయ శాఖ ఏసీ శాంతి మొదటి భర్త మదన్‌మోహన్‌ డిమాండ్‌ చేశారు. విజయవాడలో శుక్రవారం దళిత, గిరిజన, బహుజన సంఘాల నేతలతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘నా భార్య శాంతికుమారి విశాఖపట్నంలో కుమారుడికి జన్మనిచ్చింది. ఆ సమయంలో నేను అమెరికాలో ఉన్నాను. నేను వచ్చి ఆ గర్భానికి కారణమేంటని ప్రశ్నిస్తే.. విజయసాయిరెడ్డితో శారీరకంగా కలిశానని ఓసారి, ఆయన ద్వారా ఐవీఎఫ్‌ చేయించుకుని కుమారుడికి జన్మనిచ్చానని మరోసారి చెప్పింది. విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో శాంతి ప్రసవించింది. ఆ సమయంలో ఆసుపత్రి రికార్డుల్లో భర్తగా హైకోర్టు న్యాయవాది పోతురెడ్డి సుభాష్‌ పేరుంది. సుభాష్‌ను సంప్రదిస్తే.. శాంతికి, తనకు సంబంధం లేద[న్నారు. 2016లో విడాకులు ఇచ్చినట్లు శాంతి చెబుతున్న మాటలు అవాస్తవం. కావాలంటే నిజనిర్ధారణ పరీక్షలకు పంపించవచ్చు. మా ఇద్దరికి ఇప్పటికే కవల ఆడపిల్లలు ఉన్నారు’ అని మదన్‌మోహన్‌ తెలిపారు.

భూదందాల కోసం అడ్డుపెట్టుకున్నారు: ఎంపీ విజయసాయిరెడ్డి, సుభాష్‌రెడ్డి పథకం ప్రకారం దేవాదాయ అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతిని లోబరుచుని విశాఖపట్నంలో రూ.కోట్ల విలువైన దేవాదాయ భూములను ఆక్రమించుకున్నారని దళిత, గిరిజన, బహుజన సంఘాల నేతలు ఆరోపించారు. సోషల్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ జాతీయ నేత మాదిగాని గురునాథం మాట్లాడుతూ.. ‘ఏసీ శాంతిని అడ్డుపెట్టుకుని భూ దందాలు చేసిన విజయసాయిరెడ్డి, సుభాష్‌రెడ్డిలపై ప్రభుత్వం కేసులు నమోదుచేయాలి. ఈ అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేయాలి’ అని డిమాండ్‌ చేశారు. మాజీ జడ్జి రామకృష్ణ మాట్లాడుతూ, ‘ఆర్థికంగా ఎదగడానికి ఎంపీ విజయసాయిరెడ్డి శాంతిని వాడుకోవడం దారుణం. ఈ విషయంలో మీ ప్రమేయం లేకపోతే.. డీఎన్‌ఏ పరీక్షకు ఎందుకు రావట్లేదు?’ అని ప్రశ్నించారు. సమావేశంలో దళిత బహుజన ఫ్రంట్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యరావు పాల్గొన్నారు.