ఇంట్లో దరిద్ర దేవత ప్రవేశించకుండా వుండాలంటే ఇలా చేయండి..!

ఏ దేవత అయినా ఇంట్లోకి ప్రవేశించాలని అనుకుంటారు. కానీ దరిద్ర దేవత ఇంట్లోకి వస్తే జీవితం సమస్యల్లో పడుతుంది. అందువల్ల దరిద్ర దేవతను ఇంట్లోకి రానివ్వకూడదు.


దరిద్ర దేవత ఇంట్లోకి రాకుండా వుండాలంటే ఏమి చేయాలో ప్రముఖ పండితులు ముందుగానే చెప్పివున్నారు. హిందూ శాస్త్రం ప్రకారం దరిద్ర దేవత రాకుండా వుండాలంటే కొన్ని ప్రత్యేక నియాలను కచ్ఛితంగా పాటించాల్సిందే. అలాగే కొన్ని వస్తువులను తీసుకుంటే కూడా దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాంటి వస్తువులను తిరస్కరించాలి, వెంట పెట్టుకోకుండా జాగ్రత్తపడాలి.

జ్యేష్టా దేవి, లక్ష్మీ దేవి ఇద్దరూ అక్కా చెల్లెల్లు. లక్ష్మీ దేవిని శ్రీమహా విష్ణువు పెళ్లి చేసుకుంటే, జ్యేష్టా దేవిని శనీశ్చరుడు వివాహం చేసుకున్నాడు. జ్యేష్టా దేవిని పెళ్లి చేసుకున్న తరువాత శనీశ్చరుడు తన తాతగారి దగ్గరికి వెల్దామని అంటాడు. మీ తాతగారు ఎవరు అని జ్యేష్టాదేవి అడుగుతుంది. అప్పుడు శనీశ్చరుడు.. నా తండ్రి సూర్య దేవుడు, నా తల్లి ఛాయా దేవి, మా తాత కష్యప ప్రజాపతి అని చెప్పి తాతగారి దగ్గరకు తీసుకెళ్తాడు. కష్యప ప్రజాపతి ఇంట్లోకి జ్యేష్టాదేవి ప్రవేశించలేకపోయింది. ఎందుకు ప్రవేశించలేకపోతున్నావని జ్యేష్టాదేవిని అడిగితే.. ఏ ఇంటి గడపకు పసుపు కుంకుమ రాసి ద్వార లక్ష్మిని పూజిస్తారో ఆ ఇంట్లోకి ప్రవేశించనంటుంది. ఏ ఇంటి ముందరైతే చక్కగా అలికి ముగ్గు పెట్టివుంటారో అటువంటి ఇంట్లోకి కూడా ప్రవేశించలేనని అంటుంది. ఇంటి ముందు తులసి చెట్టును పూజించే ఇంట్లోకి కూడా ప్రవేశించలేనని జ్యేష్టా దేవి చెబుతుంది. తులసిలో లక్ష్మీ నారాయణుడు వుంటాడు. లక్ష్మీ దేవి ఎక్కడైతే వుంటుందో అక్కడ జ్యోష్టా దేవి వుండలేదు.

ఎక్కడైతే యగ్నయాగాలు జరుగుతుంటాయో అక్కడికి కూాడా నేను ప్రవేశించరలేనని జ్యేష్టా దేవి చెబుతుంది. ఏ ఇంట్లోనైతే నిత్య దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో కూడా నేను ప్రవేశించలేను అని అంటుంది. ఏ ఇంట్లో అయితే నిత్యం గంట మోగిస్తారో ఆ ఇంట్లో కూడా నేను ప్రవేశించలేనని జ్యేష్టా దేవి చెబుతుంది. ఏ ఇంట్లో అయితే శంఖానాదం చేస్తుంటారో ఆ ఇంట్లో కూడా నేను ప్రవేశించలేనని జ్యేష్టా దేవి చెబుతుంది. ఏ ఇంట్లో అయితే భగవంతుడి స్తోత్రాలు పారాయణం చేస్తుంటారో అక్కడికి కూడా నేను వెళ్లలేను. ఏ ఇల్లైతే శుచి శుభ్రతతో వుంటుందో ఆ ఇంట్లో కూడా నేను ప్రవేశించలేనని ఈ విషయాలన్నింటినీ తన భర్త శనీశ్చరుడితో చెబుతుంది.

ఏ ఇంట్లో అయితే భార్యా భర్తలు ఇద్దరూ గొడవపడుతూ వుంటారో, ఒకరిని ఒకరు తిట్టుకుంటూ వుంటారో ఆ ఇంట్లోకి నేను సంతోషంగా ప్రవేశించగలను. భార్యా భర్తలు ఎప్పుడు దూషించుకోకుండా చిరునవ్వుతో ఆ సమస్యలను పరిష్కారం చేసుకోవాలి. శుభ్రంగా లేని ఇంట్లోకి ప్రవేశిస్తానని అంటుంది. ఉదయం, సాయంత్రం చెత్త వూడవని ఇంట్లోకి కూడా నేను ప్రవేశిస్తాను. ఏ ఇంట్లో అయితే పాత్రలు సరిగ్గా కడగకుండా శింక్‌లో వేసి అలాగే వుంచుతారో ఆ ఇంట్లోకి ప్రవేశించనని అంటుంది.

ఏ ఇంట్లో అయితే స్త్రీలు ఎప్పుడూ రోదిస్తూ వుంటారో ఆ ఇంట్లోకి సంతోషంగా ప్రవేశిస్తాను. ఏ ఇంట్లో అయితే నిత్య దీపారాధన చేయరో, ఏ ఇంట్లో అయితే భగవంతుడికి పూజ చేయరో, ఏ ఇంట్లో అయితే ఉదయం, సాయంత్రం నిద్రిస్తూ వుంటారో ఆ ఇంట్లోకి నేను సంతోషంగా ప్రవేశిస్తానని జ్యేష్టా దేవి అంటుంది.

మన జీవితంలో కొన్ని వస్తువులను ఎవరు తెచ్చి ఇచ్చినా ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. అలా తీసుకుంటే మనము అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది. ఆ వస్తువులేంటో తెలుసుకుందాం. ఎవరైనా ఉప్పు తీసుకొని తెచ్చిస్తే తీసుకోవద్దు. నల్లని వస్త్రాలు ఎవరు తెచ్చి ఇచ్చినా తీసుకోవద్దు. నల్ల నువ్వులు ఎవ్వరు ఇచ్చినా కూడా తీసుకోకూడదు. ఇనుప సామాన్లను కూడా ఎవరు ఇచ్చినా తీసకోకూడదు. పత్తి, గుమ్మడికాయ, ఎండిమిరపకాయలను కూడా ఎవరు ఇచ్చినా తీసుకోకూడదు. నూనెను కూడా తీసుకోవద్దు. అది ఎలాంటి నూనె అయినా సరిగ్గా తీసుకోవద్దు.