ఏపీలో వారందరికి ఉచితంగా బైక్‌లు.. చాలా సింపుల్, వెంటనే ఇలా దరఖాస్తు చేస్కోండి

 ఏపీ ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు శుభవార్త తెలిపింది. ఉచితంగా మూడు చక్రాల మోటారు వాహనాలు అందించనుంది. 70% వైకల్యం ఉన్న, 18-45 ఏళ్ల మధ్య వయసు కలిగి, పదో తరగతి పాసైన వారు అక్టోబర్ 31లోపు www.apdascac.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. గతంలో దరఖాస్తు చేసుకుని మంజూరు కాని వారు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రంలో దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల మోటారు వాహనాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు దివ్యాంగులకు మూడు చక్రాల మోటార్ వాహనాలు ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు, సీనియర్ సిటిజన్స్ సహకార సంస్థ ( APDASCAC ) మార్గదర్శకాలను విడుదల చేసింది. అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.


ఈ పథకానికి అర్హతలు ఇలా ఉన్నాయి..

1. ఆంధ్రప్రదేశ్‌లో శాశ్వత నివాసి అయి ఉండాలి

2. 70 శాతంపైగా వైకల్యం కలిగిన 18 నుంచి 45 ఏళ్ల లోపు వారు అర్హులు.

3. కనీసం పదో తరగతి పాసవ్వాలి.

4. రూ.3లక్షలలోపు వార్షిక ఆదా యం ఉండాలి.

5. లబ్ధిదారుల ఎంపికకు రెండు నెలల ముందు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

6. వారికి సొంత వాహనం ఉండకూడదు.

7. గతంలో ఇటువంటి వాహనాలు తీసుకుని ఉండకూడదు.

Note : గతంలో దరఖాస్తు చేసినప్పటికీ ఇవి మంజూరు కాకపోతే కొత్తగా దర ఖాస్తు చేసుకునేందుకు అర్హులే.

అవసరమైన పత్రాలు:

1. ఆధార్ కార్డు,

2 జిల్లా మెడికల్ బోర్డు వారు ఇచ్చిన సదరం ధ్రువపత్రం.

3. SSC ధ్రువపత్రం (టెన్త్ సర్టిఫికేట్),

4. SC, ST అయితే కుల ధ్రువీకరణపత్రం,

5. దివ్యాంగుల పూర్తి ఫొటోను పాస్‌పోర్ట్ సైజులో ఉన్నది.

6. ఆదాయ ధ్రువీకరణ పత్రం (01-01-2022 తరువాత తీసుకొని ఉండాలి )

7. Bonafide Certificate ( విద్యార్థి అయితే)

8. ముందుగా ఎటువంటి వాహనం తీసుకోలేదుని, అన్ని వివరాలు సరిగా ఇస్తున్నట్టు సెల్ఫ్ డిక్లరేషన్.

రిజర్వేషన్ :

మహిళలు – 50%
పురుషులు – 50%
SC-16%
ST -7%
General – 77%

Note : SC & ST మరియు మహిళల & పురుషుల లో ఒకరికి రిజర్వేషన్ తగిన దరఖాస్తు రానిచో మరొకరికి వారికి ఇవ్వటం జరుగును.

ప్రాధాన్యత:

1. PG విద్యార్థులు

2. Self/Wage/Salary పొందుతు డిగ్రీ చేసిన వారికి

చివరి తేదీ :

ఆన్లైన్ ద్వారా అక్టోబర్ నెల 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.

దరఖాస్తు విధానం:

www.apdascac.ap.gov.in వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేయాలి. చివరి తేదీ లోపు దరఖాస్తు చేసుకుంటే.. అర్హతల్ని పరిశీలించి ప్రభుత్వం అర్హుల జాబితాను ప్రకటిస్తుంది.. వారికి మూడు చక్రాల మోటారు వాహనం అందజేస్తారు. వెంటనే ఈ విషయాన్ని గమనించి దివ్యాంగులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం సూచిస్తోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.