Fridge:మీ ఇంట్లో ఫ్రిడ్జ్ గోడకు దగ్గరగా పెట్టారా.. ప్రమాదం తప్పదా..?

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు అనేవి తప్పనిసరిగా ఉంటున్నాయి. ఇందులో ముఖ్యంగా ఫ్రీజ్, వాషింగ్ మిషన్, కూలర్, టీవీ, సెల్ పోన్, రైస్ కుక్కర్, రోటి మేకర్ ఇలా అనేకం ప్రతిరోజు వాడుతూ ఉంటారు.
ఇందులో ప్రతి ఒక్కటి ఎలక్ట్రికల్ పాస్ అవడం ద్వారానే పనిచేస్తుంది. వస్తువుల వల్ల మనకు ఎన్ని లాభాలు ఉన్నాయో ఆ విధంగానే నష్టాలు కూడా అనేకం ఉన్నాయట. ఎలక్ట్రానిక్ వస్తువు అంటే దాన్ని ఎప్పుడైనా మనం చెక్ చేస్తూ ఉండాలి. దేనికైనా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది.


ఆ డేట్ దాటితే దాన్ని వాడడం కష్టం. ఆ విధంగానే ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా కొన్ని సంవత్సరాల పాటు వాడిన తర్వాత అందులోని కొన్ని వస్తువులు పాడైపోతాయి. దీనివల్ల మనం ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుంది. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఫ్రిడ్జ్. ఈ ఫ్రిడ్జ్ లో ఉండే కంప్రెసర్ పేలి ఇప్పటికే ఎన్నో ప్రమాదాలు జరిగాయి. తాజాగా పంజాబ్ జలంధర్ లో ఫ్రిడ్జ్ యొక్క కంప్రెసర్ ఫెయిల్యూర్ వల్ల ఫ్యామిలీలోని ఆరుగురు మరణించారు. అయితే ఈ కంప్రెసర్ పేలడానికి ప్రధాన కారణం అందులోని గ్యాస్ అయిపోవడం. దీన్ని వారు చెక్ చేసుకోకపోవడంతో అది పేలి అక్కడికక్కడే కుటుంబమంతా మరణించారు. అయితే ఇది పేలడానికి మరో కారణం కూడా ఉందట.

మనం ఫ్రిజ్ ను ఎప్పుడైనా గొడకు దగ్గరగా పెడుతూ ఉంటాం. దీనివల్ల ఫ్రిడ్జ్ వెనకాల ఎలాంటి గాలి తగలకుండా ఉండటంవల్ల ఆ కంప్రెసర్ వేడెక్కి పేలే అవకాశం ఉంటుందట. అంతేకాకుండా లోపల ఉండే కంప్రెసర్ దుమ్ము ఇతర కణాలతో నిండిపోవడం వల్ల కూడా పేలే అవకాశం ఉంటుందట. కాబట్టి ఫ్రిడ్జ్ కంప్రెసర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని దారి నుంచి ఎలాంటి సౌండ్స్ వచ్చినా, వాటర్ లీకైన వెంటనే రిపేర్ చేయించాలని, లేదంటే ప్రమాదాల బారినపడి అవకాశం ఉందని అంటున్నారు. ఈ మధ్యకాలంలో కంప్రెసర్ వాడడం వల్లే ఒక షాపింగ్ మాల్ లో చిన్నారి ఫ్రిజ్ ను పట్టుకొని మరణించిన సంఘటన మనం చూసాం. కాబట్టి ఇంట్లో ఫ్రిజ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు అని నిపుణులు.