Galaxy m15 5g: సామ్‌సంగ్‌ నుంచి బడ్జెట్‌ 5జీ ఫోన్‌.. రూ. 13 వేలకే..

www.mannamweb.com


ప్రస్తుతం 5జీ స్మార్ట్‌ ఫోన్‌ల హవా నడుస్తోంది. దేశంలో 5జీ నెట్‌వర్క్‌ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో కంపెనీలు వరుసగా బడ్జెట్ ధరలో 5జీ ఫోన్‌లను లాంచ్‌ చేస్తూ వస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్ సైతం తక్కువ ధరలో 5జీ ఫోన్‌ను తీసుకొస్తోంది. గ్యాలక్సీ ఎమ్‌15 పేరుతో తీసుకొస్తున్న ఈ 5జీ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎమ్‌15 పేరుతో 5జీ ఫోన్‌ను తీసుకొస్తోంది. ఈ ఫోన్‌ ఏప్రిల్‌ 8వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుండగా ప్రస్తుతం కంపెనీ ప్రీ బుకింగ్స్‌ను ప్రారంభించింది.

ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.5 ఇంచెస్‌తో కూడిన సూపర్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. మీడియా టెక్‌ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది

కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌ రెయిర్‌ కెమెరాతో కూడిన ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ను అందించనున్నారు. 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇవ్వనున్నారు. ఈ ఫోన్‌ను 4జీబీ, 6జ జీబీ ర్యామ్‌తో పాటు 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌తో తీసుకురానున్నారు.

ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 25 వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందిస్తున్నారు. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 5 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను ఉచితంగా అందిస్తారు.

ఈ స్మార్ట్ ఫోన్‌ 4జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 13,499కాగా, 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ. 14,999గా ఉంది. ఈ ఫోన్‌ను సెలెస్టియల్ బ్లూ, స్టోన్‌ గ్రే, బ్లూ టోపేజ్‌ కలర్స్‌లో తీసుకురానున్నారు.