GO. 117 రద్దు చేయాలి : తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం TNUS

ప్రచురణార్ధం , తేదీ : 23/6/24


GO. 117 రద్దు చేయాలి : తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం ( TNUS )

ఎన్టీఆర్ భవన్ , మంగళగిరి నందు తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు మన్నం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది.ముఖ్య అతిధిగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పాతర్ల రమేష్ గారు పాలొన్నారు ఉపాధ్యాయ సమస్య లు పట్ల తెలుగుదేశం ప్రభుత్వం కి పూర్తిగా అవగాహన ఉందని వాటిని పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.

అధ్యక్షులు మన్నం శ్రీనివాస్ మాట్లాడుతూ GO. 117 రద్దు చేయాలనీ కోరారు. దీనివలన ప్రాధమిక పాఠశాలలు వేళాకొలది సింగల్ టీచర్ స్కూల్స్ గా మారిపోయి..మూత పడేదిశలో ఉన్నాయని తెలిపారు..కనుక ప్రాధమిక పాఠశాలల విలీనం రద్దు చేసేలా GO. 117 రద్దు చేయాలనీ కోరారు. అలాగే ఉపాధ్యాయులకు బోధనేతర పనులు నుంచి విముక్తి కలిగించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమం లో ప్రధానకార్యదర్శి శ్రీరామశెట్టి వెంకటేశ్వర్లు, కోశాధికారి పినాకఫాణి, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు యం రజనీబాబు నాయుడు,కే.రామలింగప్ప, సీహెచ్ పూర్ణ చంద్రరావు, బజారన్న,
కైతేపల్లి దాస్, సంజీవరెడ్డి, రాధాకృష్ణ ఉమ్మడి పదమూడు జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.