అమరావతి రైతులకు శుభవార్త – మరో ఐదేళ్లు కౌలు,పెన్షన్

www.mannamweb.com


APCRDA : రాజధానికి భూములిచ్చిన రైతులకు మరో ఐదేళ్లు కౌలు పొడిగించారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరో నాలుగైదు రోజుల్లో అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు కూడా ప్రారంభం కానున్నాయి.

రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి సీఆర్డీయే అధారిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. శుక్రవారం సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ(CRDA) 36 వ అథారిటీ సమావేశం జరిగింది.

అథారిటీకి ముఖ్యమంత్రి చైర్మన్ గా ఉండగా మున్సిపల్ శాఖ మంత్రి వైస్ ఛైర్మన్ గా ఉన్నారు.ఆర్థిక శాఖ మంత్రి తో పాటు సీఆర్డీయే కమిషనర్ కన్వీనర్ గా మొత్తం 11 మంది సభ్యులున్నారు.సచివాలయంలో జరిగిన సమావేశంలో మొత్తం 11 అంశాలను అజెండాలో చర్చించారు రాజధాని నిర్మాణానికి సంబంధించి ఈ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు.సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ మీడియాకు వివరించారు.
తీసుకున్న నిర్ణయాలివే :

రాజధాని అమరావతి నిర్మాణం కోసం నాటి టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అడగ్గానే కేవలం 58 రోజుల్లోనే రైతులు 34,000 ఎకరాల భూమిని ఇచ్చారని మంత్రి చెప్పారు.అయితే గత ఐదేళ్లలో రైతులకు చెప్పినవి ఏమీ వైసిపి ప్రభుత్వం చేయలేదని…దీంతో రైతులు ఆర్దికంగా,మానసికంగా ఎంతో ఇబ్బంది పడ్డారని మంత్రి చెప్పారు..

రైతులకు ప్రతి ఏటా ఇచ్చే కౌలు తో పాటు పెన్షన్ల ను మరో ఐదేళ్లు పొడిగించాలని సీఆర్డీయే అథారిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ప్రస్తుతం ఎంత మేర కౌలు అందుతుందో అంతే మేర నగదు,అలాగే ప్రస్తుతం అందుతున్న పెన్షన్ ను రాబోయే ఐదేళ్లకు చెల్లించేందుకు అధారిటీ నిర్ణయం తీసుకుందని చెప్పారు.

ఇదే విధంగా ప్రస్తుతం ఇస్తున్న మేరకే పింఛన్లను కూడా వచ్చే ఐదేళ్లు కొనసాగిస్తామన్నారు. మరోవైపు సీఆర్డీయే కు గతంలో మొత్తం 778 మంది ఉద్యోగులు ఉండగా…ప్రస్తుతం కేవలం 249 మంది మాత్రమే ఉన్నారని చెప్పారు. గతంలో మాదిరిగా ఉద్యోగులను నియమించుకునేందుకు అధారిటీ అనుమతి ఇచ్చిందన్నారు…వీటిలో 188 ఉద్యోగాలను నేరుగా 190 ఉద్యోగాలను డిప్యూటేషన్ ద్వారా,75 ఉద్యోగాలను కాంట్రాక్టు ప్రాతిపదికన మరి 67 ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేసేందుకు అధారిటీ అనుమతి ఇచ్చిందని మంత్రి తెలిపారు.

ఇక గతంలో సీఆర్డీయే కు 47 మంది కన్సల్టెంట్ లు ఉండగా వీరిలో 15 మంది అవసరం పూర్తి కావడంతో కొత్తగా 32 మంది కన్సల్టెంట్స్ నియామకం చేపట్టేందుకు సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు.
రాజధాని పరిధి కొనసాగించేలా మార్పులు

సీఅర్దీయే పరిధి 2019 కు ముందు 8352.69 చ.కి.మీ గా నిర్ణయించగా గత ప్రభుత్వం దాన్ని 6993.24 క్ కిమీ కు తగ్గించేసిందన్నారు మంత్రి నారాయణ. తిరిగి మొదట్లో ఉన్న విధంగానే 8352 69 చ.కి.మీ మేర పరిధి ఉండేలా మార్పు చేసేందుకు అధారిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.అయితే సీఆర్డీయే పరిధిలో పల్నాడు,బాపట్ల జిల్లాలు కూడా వస్తున్నాయన్నారు.

అమరావతి కేపిటల్ సిటీ కోసం 217 చదరపు కి.మీ.ఉండేలా డిజైన్లు చేయగా గత ప్రభుత్వం 54 చ కి.మీ తగ్గించేలా 4 గ్రామాలను మంగళగిరి మున్సిపాలిటీలో విలీనం చేసిందన్నారు తిరిగి ఆయా గ్రామాలను సీడ్ కేపిటల్ పరిధిలోకి తీసుకొస్తామన్నారు.సీడ్ కేపిటల్ నిర్మాణం కోసం గతంలో సింగపూర్ గవర్నమెంట్ తో ఒప్పందం జరిగిందని…తిరిగి మళ్ళీ సింగపూర్ ప్రభుత్వం తో చర్చించేందుకు అధారిటీ నిర్ణయించింది.

విజయవాడ ప్రకాశం బ్యారేజి నుంచి అమరావతి వెళ్ళే కరకట్ట రోడ్డు ను సెంట్రల్ డివైడర్ ఉండేలా నాలుగు లేన్ల తో నిర్మించేందుకు వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని నిర్ణయించారు.అమరావతిలో నిర్మించే ఇన్నర్,ఔటర్ రింగ్ రోడ్ల ద్వారా మరో నాలుగు ఐకానిక్ బ్రిడ్జి లను నిర్మిస్తామని మంత్రి నారాయణ చెప్పారు. ప్రస్తుతం కృష్ణా నదిపై రెండు బ్రిడ్జి లు ఉండగా త్వరలో మరొకటి అందుబాటులోకి వస్తుందన్నారు.మొత్తంగా రాజధాని నిర్మాణంతో కృష్ణా నదిపై 7 బ్రిడ్జిలు ఉంటాయని మంత్రి నారాయణ తెలిపారు.

రాజధానిలో మధ్యలో నిలిచిపోయిన కట్టడాల పరిశీలనకు ఐఐటి హైదరాబాద్ బృందం అమరావతిలో పర్యటించిందన్న మంత్రి…శనివారం ఐఐటి మద్రాస్ నిపుణులు ఐకానిక్ భవనాల కట్టడాలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి త్వరలో నివేదిక ఇస్తారని వివరించారు. R5 జోన్ అంశం కోర్టులో ఉండటంతో న్యాయపరంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ వెల్లడించారు.

2019 కు ముందు రాజధాని మాస్టర్ ప్లాన్ లో అనుకున్న విధంగా నవ నగరాలు ఉంటాయన్నారు.హెల్త్ సిటీ,స్పోర్ట్స్ సిటీ లాంటి 9 నగరాల నిర్మాణం జరుగుతుందన్నారు. వచ్చే సోమవారం లేదా బుధవారం నుంచి అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభిస్తామన్నారు ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తయిందని మంత్రి చెప్పారు.అమరావతి హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ కూడా తిరిగి ప్రారంభించే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు.