AP News: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌

ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు చెల్లించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఉద్యోగులకు శుక్రవారం రూ.6,200 కోట్లు చెల్లించాలని సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు సీపీఎస్‌, ఏపీజీఏఐ కింద ఆర్థికశాఖ రూ.6,200 కోట్లు విడుదల చేయనుంది. ఈ ఏడాది జనవరి 11న ఉద్యోగులకు వివిధ బకాయిల కింద రూ.1,033 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా.. ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.