ఏపీలోని రైతులకు గుడ్ న్యూస్.. ఆ రోజే అకౌంట్లోకి డబ్బులు..

ఏపీలోని రైతులకు జగన్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. 2023-24 సీజన్‌కు సంబంధించి వైఎస్ఆర్ రైతు భరోసా మూడో విడత నిధులను ఎప్పుడు విడుదల చేసేదీ ప్రకటించింది.
వైఎస్ఆర్ రైతు భరోసా మూడో విడత పెట్టుబడి సాయంతో పాటు సున్నా వడ్డీ రాయితీ సొమ్మును సీఎం వైఎస్ జగన్ ఫిబ్రవరి 28వ తేదీన రైతుల అకౌంట్లో జమ చేయనున్నారు. ఈ మేరకు రైతుభరోసా పెట్టుబడి సాయం కింద అర్హులైన రైతులకు రెండు వేల చొప్పున అకౌంట్లోకి జమచేస్తారు. మొత్తంగా రైతు భరోసా, సున్నా వడ్డీ రాయితీ కింద అర్హులైన 64.37 లక్షల రైతు కుటుంబాలకు రూ.1,294.34 కోట్ల సాయం అందించనున్నారు.