ఐటీలో చేరాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. 90 వేల కొత్త ఉద్యోగాలు

www.mannamweb.com


IT రంగంలో ఆర్థిక మాంద్యం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చాలా కంపెనీలు ఫ్రెషర్లను ఎక్కువగా నియమించుకోవు. ఇప్పటికే ఉన్న ఉద్యోగాలను కూడా చాలా కంపెనీలు తొలగిస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఐటీలో చేరాలనుకునే వారికి పలు కంపెనీలు శుభవార్త అందించాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో చాలా పెద్ద ఐటీ కంపెనీలు 90 వేల మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలు ఇవ్వబోతున్నాయి.

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2024-25 ఆర్థిక సంవత్సరంలో 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 15,000 నుంచి 20 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని ఇన్ఫోసిస్ లక్ష్యంగా పెట్టుకుంది.

HCL టెక్ కంపెనీ క్యాంపస్‌ల నుండి 10 వేల మంది ఫ్రెషర్లను తీసుకుంటుంది. అలాగే, విప్రో కంపెనీ కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో 10,000 నుండి 12,000 మంది ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకోబోతోంది. మరోవైపు, ఈసారి 6 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు టెక్ మహీంద్రా ఇప్పటికే ప్రకటించింది. దీంతో 2024-2025 ఆర్థిక సంవత్సరానికి ఐటీలో దాదాపు 90 వేల మంది కొత్త ఉద్యోగావకాశాలు పొందనున్నారు.

ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో TCS 5,452 మందికి మాత్రమే ఉద్యోగావకాశాలు కల్పించింది. ప్రస్తుతం ఈ కంపెనీలో 6,06,998 మంది ఉద్యోగులు ఉన్నారు. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ 11,900 మంది ఫ్రెషర్లను నియమించుకుంది. 2022-23లో తమ కంపెనీకి 50,000 మందికి పైగా చేరగా.. 2023-2024 సంవత్సరానికి 76 శాతం తగ్గించారు. అయితే ఈసారి కొత్తగా 20 వేల మందిని నియమించుకోనున్నట్లు ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జయేష్ సంగ్రజ్కా తెలిపారు.