జామపండ్లు రుచికి బలేగా ఉంటాయి. వీటిల్లో సోడియం, పొటాషియం, ఫైబర్, ప్రోటీన్, ఐరన్, విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. జామ జీర్ణ సమస్యలు, శారీరక బలహీనతను తగ్గిస్తుంది.
అదనంగా దాని యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని హానికరమైన కణాల నుంచి రక్షిస్తాయి.
జామపండ్లు ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ.. ఇవి కొంతమందికి మేలు కంటే ఎక్కువ హాని కలిగిస్తాయి. కాబట్టి ఇలాంటి వారు జామపండ్లు తినకపోవడమే మంచిది. ముఖ్యంగా అలెర్జీ ఉన్నవారు ఈ పండు తినకూడదు. జామపండు తినడం వల్ల కొంతమందిలో చర్మంపై దద్దుర్లు, దురద, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి అలెర్జీ లక్షణాలు సంభవించవచ్చు. ఇలాంటి వారు అస్సలు తినకూడదు.
జామపండు తిన్న తర్వాత మీ శరీరంలో ఏవైనా మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఉబ్బరం, విరేచనాలు, గ్యాస్, గుండెల్లో మంట లేదా అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా జామ తినకూడదు. జామలో విటమిన్ సి, ఫ్రక్టోజ్ అధికంగా ఉంటాయి. ఇది జీర్ణ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది.
అలాగే జామలోని విత్తనాలు, ఫైబర్ జీర్ణవ్యవస్థపై ఒత్తిడిని కలిగిస్తాయి. జామకు జలుబు స్వభావం ఉంటుంది. అందువల్ల శీతాకాలంలో జామకాయలు అధికంగా తీసుకోవడం వల్ల గొంతు నొప్పి, జలుబు, దగ్గు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
జామలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది. అయితే ఇప్పటికే రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్నవారు జామపండు తినకపోవడం బెటర్. రక్తంలో చక్కెరను తగ్గించే మందులు తీసుకునేవారు కూడా జామ తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. ఏదైనా శస్త్రచికిత్స తర్వాత కూడా వెంటనే జామ పండ్లు తినకూడదు. ఎందుకంటే జామకాయను తినడం వల్ల రక్తస్రావం ప్రమాదం పెరుగుతుంది. గాయం మానడం ఆలస్యం అవుతుంది
































