Health Tips : పొన్నగంటి కూరను ఇలా తీసుకుంటే చాలు.. ఆ రోగాలు జన్మలో రావు..

www.mannamweb.com


మనం ఎక్కువగా తీసుకొనే ఆకు కూరల్లో పొన్నగంటి కూర ఒకటి.. శరీరానికి కావలసిన అన్ని పోషకాలు వీటిలో దొరుకుతాయి.. ఈ ఆకు నీరు పారే ప్రాంతాల్లో ఏడాది పొడవునా లభిస్తుంది..
ఈ ఆకుకూర విరివిగా పెరుగుతుంది. దీనితో పప్పు, పచ్చడి, కూర వంటి వాటిని తయారు చేసి తీసుకుంటారు. పొన్నగంటి కూరతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే దీనిని తీసుకోవడం మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, పోషకాలు దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ ఆకు కూరలో బీటా కెరోటీన్, ఐరన్, ఫైబర్, క్యాల్షియం, విటమిస్ సి వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. పొన్నగంటి కూరను తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. వయసు పైబడడం వల్ల వచ్చే కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. తలనొప్పితో భాధ పడేవారు దీన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.. మలబద్దకం సమస్య తగ్గుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.. అలాగే ఈ సీజన్ వచ్చే అనేక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది..

ఇకపోతే పొన్నగంటి కూర రసంలో తేనె కలిపి తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. పొన్నగంటి ఆకుకూరను తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి.. ఈ ఆకు రసంను తీసుకొని ముఖానికి రాస్తే మచ్చలు, మొటిమలు వెంటనే తొలగిపోతాయి.. చర్మం రంగు కూడా మెరుగు పడుతుంది.. ఇకపోతే వారానికి రెండు సార్లు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు మన్నం వెబ్ బాధ్యత వహించదు.