భగవద్గీత 1 నుండి 5 అధ్యాయాలు చదివితే జీవితమంటే ఏంటో తెలిసిపోతుందట..!

www.mannamweb.com


భగవద్గీత మనిషి జీవితాన్ని ఎలా జీవించాలి, దేనికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి, ఏది వదిలేయాలి, ఏది పట్టుకోవాలి ఇలాంటి ఎన్నో విషయాలను నేర్పిస్తుంది. శ్రీకృష్ణుడు అర్జునుడికి కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యే ముందు యుద్ధభూమిలో భగవద్గీత భోదిస్తాడు. అందులో మొదటి ఐదు అధ్యాయాలు చాలా ముఖ్యమైనవి.. మనిషి జీవితంలో తప్పక తెలుసుకోవాల్సి అక్షర సత్యాలు అవి.. అవేంటంటే..

భగవద్గీత 1వ అధ్యాయం సందేశం :
జీవితంలోని సమస్యలన్నీ మన ఆలోచనల వల్లనే కలుగుతాయి.
భగవద్గీత 2వ అధ్యాయం యొక్క సందేశం :
సరైన జ్ఞానం జీవితంలోని అన్ని సమస్యలకు ఉత్తమ పరిష్కారం.
భగవద్గీత అధ్యాయం 3 సందేశం :
నిస్వార్థంగా చేసేది ఏదీ మిమ్మల్ని బాధించదు.
భగవద్గీత 4వ అధ్యాయం సందేశం :
మీ జీవితంలో జరిగే ప్రతిదీ మీ కర్మ ఫలితమే.
భగవద్గీత 5వ అధ్యాయంలోని సందేశం :
నేను ఒక్కడినే అనే అహంకారాన్ని విడిచిపెట్టినప్పుడే లోకం ఇచ్చే ఆనందం మీకు లభిస్తుంది.
భగవద్గీత నేపథ్యం..
రణరంగంలో ఎదురుగా ఉన్న సైనికులను చూసి అర్జునుడి కళ్లలో నీళ్లు తిరుగుతాయి. నేను చంపబోయేది నా తోడబుట్టినవాళ్లను, నా గురువులను, నా ప్రజలనే కదా ఎందుకు కృష్ణా ఇదంతా అని అర్జునుడు బరువెక్కిన గుండెతో కృష్ణుడిని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు తనకున్న శక్తులతో కాలాన్ని ఆపేసి మొదలుపెడతాడు.. శుత్రసైన్యంలో ఒక్కొక్కరిని చూపిస్తూ.. వాళ్లు చేసిన పాపాలు గుర్తుచేస్తాడు. వీళ్ల పాపాలకు కర్మ ఫలితాన్నే వీరు అనుభవించబోతున్నారు అర్జునా.. అని.. జీవితం గురించి, ప్రేమ గురించి, చావు గురించి ఎంతో చక్కగా వివరిస్తాడు. ఇదే భగవద్గీత అయింది.. భగవద్గీత అనేది మనిషి జీవితానికి మాన్యువల్‌ లాంటిది..ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏదీ శాశ్వతం కాదు, చావు శరీరానికే కానీ ఆత్మకు కాదు అనే అక్షరసత్యం భగవద్గీత చదివితేనే అర్థమవుతుంది. అయితే కృష్ణుడు చెప్పిన గీతను అర్జునుడు ఒక్కడే వినలేదు..దృతరాష్ట్రుడికి యుద్ధభూమిలో ఏం జరుగుతుందో పూసగుచ్చినట్లు వివరించే సంజయుడు కూడా విన్నాడు..!