5 రోజుల్లో రూ. 8.49 కోట్లు కలెక్షన్స్‌.. బాక్సాఫీస్ వద్ద నిహారిక కొణిదెల ‘కమిటీ కుర్రోళ్ళు’ జోరు..

www.mannamweb.com


డిఫరెంట్ కంటెంట్ చిత్రాలకు ప్రేక్షకాదరణ ఎప్పుడూ ఉంటుందని తెలుగు ప్రేక్షకులు మరోసారి ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంతో నిరూపించారు. సీనియర్ నటీనటులతో పాటు 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్‌ను తెలుగు కు పరిచయం చేస్తూ మేకర్స్ చేసిన ఈ ప్రయత్నానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.

ఆడియెన్స్‌, విమర్శకులతో పాటు సినీ సెలబ్రిటీ నుంచి అభినందనలు అందుకుంటూ బాక్సాఫీస్ దగ్గర జోరు చూపిస్తోంది. ఐదు రోజుల్లోనే కమిటీ కుర్రోళ్ళు రూ. 8.49 కోట్ల కలెక్షన్స్‌ను రాబట్టం విశేషం.

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ కు యదు వంశీ దర్శకత్వం వహించాడు.. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న వంశీ నందిపాటి విడుదల చేశారు. మొదటి రోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ కు రోజు రోజుకు మరింత రెస్పాన్స్ వస్తుంది. డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌, అటు యూత్‌ను ఆకట్టుకున్న ఈ చిత్రం అన్నీ ఏరియాస్‌లో బ్రేక్ ఈవెన్ సాధించింది.