మీరు కొనుగోలు చేసిన పాలు కల్తీవా.. మంచివా?.. ఎలా గుర్తించాలి?

ఈ మధ్య ఎక్కువగా కల్తీ ఆహారాలు, కల్తీ పదార్థాలపైనే చర్చ జరుగుతోంది. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో అనేక లోపాలు బయట పడటమే ఇందుకు కారణం.


దీంతో ప్రజలు అలర్ట్ అవుతున్నారు. బయట టిఫిన్ చేయాలన్నా, స్నాక్స్ తినాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు? సేఫ్ అని భావిస్తేనే తిడానికి మొగ్గు చూపుతున్నారు. అయితే కల్తీ జరుగుతున్నప్పటికీ గుర్తించలేని పరిస్థితి ఇప్పటికీ ఉంది. ఈ నేపథ్యంలో మనం ప్రతిరోజూ కనుగోలు చేసే పాలల్లో కల్తీని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.

* సాధారణ పాలకంటే కల్తీ పాలు చాలా మందంగా లేదా చిక్కగా ఉంటాయి. అట్లనే మనం కొన్న పాలు పొడిగా లేదా గట్టిగా మారితే.. కల్తీ చేయబడ్డాయని అనుమానించవ్చు. 5 మిల్లీలీటర్ల పాలలో రెండు టీ స్పూన్ల ఉప్పు లేదా అయోడిన్ వేసి కలపాలి, అప్పుడు అవి నీలం రంగులోకి మారితే గనుక అందులో ఏవో పిండి పదార్థాలు కలిపారని అర్థం.

*కల్తీ పాలను గుర్తించడానికి మరో మార్గం కూడా ఉంది. మీరు కొనుగోలు చేసిన పాలను తక్కువ మంట మీద 2 నుంచి 3 గంటలు మరిగించాలి. అంటే గట్టిపడి.. చిక్కబడే వరకు మరగాలన్నమాట. ఈ సందర్భంగా పాల రేణువులు మందంగా, గట్టిగా ఉంటే కల్తీ జరిగిందని అర్థం చేసుకోవచ్చు.

* ఇంకో టెక్నిక్ ఏంటంటే.. కొన్ని చుక్కల పాలను నేలపై వేయండి. అవి ఎలా ప్రవహిస్తున్నాయో గమనించండి. స్లోగా కదులుతూ తెల్లని మచ్చలుగా కనిపిస్తే స్వచ్ఛంగా ఉన్నట్లే. అలా కాకుండా నేలపై పడిన వెంటనే స్పీడ్‌గా ప్రవహిస్తే మాత్రం అవి కల్తీ పాలు.

*పాలను కల్తీ చేయడానికి ‘టింక్చర్’ అనే రసాయనిక పొడిని కూడా యూజ్ చేస్తుంటారు. వాస్తవానికి ఇది అత్యంత సాధారణ రూపంలో లభించే యూరియా. వివిధ పదార్థాలలో కలపడంవల్ల వాటి రుచి కూడా మారదు. కాబట్టి కల్తీ చేసేవారు యూజ్ చేస్తారు. అయినా కల్తీ జరిగిందని తెలుసుకోవచ్చు. ఎలాగంటే.. అర టేబుల్ స్పూన్ పాలు తీసుకొని, అందులో కాస్త సోయాబిన్ పొడిని వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఒక లిట్మస్ కాగితాన్ని (మార్కెట్‌లో దొరుకుతుంది) తీసుకొని కొన్ని సెకన్లపాటు పాలలో ముంచండి. అవి ఎరుపు నుంచి నీలం రంగులోకి మారితే యూరియాతో కల్తీ చేశారని అర్థం చేసుకోవచ్చు.