Jagan: అసెంబ్లీ సమావేశాలకు జగన్ డుమ్మా?

www.mannamweb.com


Jagan: అసెంబ్లీ సమావేశాలకు జగన్ డుమ్మా?

అసెంబ్లీ సమావేశాలకు జగన్ డుమ్మా కొట్టనున్నారట. ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు వైసీపీ అధినేత జగన్ హాజరుకాకపోవచ్చని తెలుస్తోంది.

మరోవైపు నేటి(సోమవారం) నుంచి తాడేపల్లిలో తన క్యాంపు ఆఫీసులో ప్రజాదర్బార్ నిర్వహించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. కానీ, ప్రారంభానికి ముందే ఈ కార్యక్రమం వాయిదా పడినట్లు సమాచారం.

కాగా, మాజీ ముఖ్యమంత్రి, వైస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఇవాళ (జులై 15వ తేదీ) బెంగళూరు వెళ్లనున్నారు. ఈ వారం రోజులు ఆయన అక్కడే ఉండనున్నట్లు సమాచారం. గత నెల 24వ తేదీన జగన్ బెంగళూరు వెళ్లి.. ఈ నెల 1వ తేదీ వరకు అక్కడే ఉండి వచ్చారు. మళ్లీ ఇప్పుడు రెండు వారాల వ్యవధిలోనే మరోసారి అక్కడికి వెళ్తున్నారు. ఇక ఈరోజు నుంచి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ‘ప్రజాదర్బార్‌’ నిర్వహించాలని జగన్‌ నిర్ణయించి.. ఇప్పటికే పార్టీ శ్రేణులకు సమాచారం పంపారు.