బిగ్‌బాస్‌లోకి జనసేన వీర మహిళ! ఈ వైజాగ్ బ్యూటీ స్పెషాలిటీ ఏంటో తెలుసా?

www.mannamweb.com


బుల్లితెర ఆడియెన్స్ ను అలరించేందుకు బిగ్ బాస్ మళ్లీ వచ్చేస్తున్నాడు. ఈసారి హంగులు, ఊహించని సెలబ్రిటీలతో మన ముందుకు వస్తున్నాడని తెలుస్తోంది. గత ఏడు సీజన్ల కంటే భిన్నంగా ఎనిమిదో సీజన్ ఉంటుందని, ‘అంతకు మించి’ అనేలా ఎంటర్ టైన్మెంట్ ఉంటుందని వస్తున్నాయి.

అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే బిగ్ బాస్ ప్రోమో కూడా రిలీజైంది. నయా సీజన్ లోగోను కూడా సరికొత్తగా డిజైన్ చేశారు. మరోవైపు కంటెస్టెంట్స్ ఎంపిక శరవేగంగా జరుగుతోంది. ఈసారి కూడా ఎక్కువ మంది బుల్లితెర నటీనటులు, యాంకర్స్, పోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్, యూట్యూబర్లు , కొందరు వివాదాస్పద వ్యక్తులు బిగ్ బాస్ హౌ జ్ లో అడుగుపెట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది. బర్రెలక్క, అబ్బాస్, రాజ్ తరుణ్, కుమారి ఆంటీ, యాదమ్మ రాజు, రీతూ చౌదరి, విష్ణుప్రియ, బుల్లెట్ భాస్కర్, పొట్టి రమేష్ తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే వీరందరిలోకి ఒక పేరు ఆసక్తికరంగా మారింది. అదే రేఖా భోజ్. వైజాగ్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ కూడా హౌజ్ లోకి ఎంట్రీ ఇస్తుందని గుప్పుమంటున్నాయి.

బిగ్‌బాస్ 8 కోసం నిర్వాహకులు రేఖా భోజ్ ను సంప్రదించగా ఆమె ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక రేఖా భోజ్ అసలు పేరు శ్రీ సుష్మ.
మాంగళ్యం, దామిని విల్లా, రంగేలా, కళ్యాణ తస్మై నమ: తదితర ల్లో నటించింది. అయితే ప్రస్తుతం వైజాగ్ లోనే ఎక్కువగా ఉంటోన్న ఈ ముద్దుగుమ్మ సొంతంగా స్టూడియో పెట్టుకుని కవర్ సాంగ్‌లు, వీడియో ఆల్బమ్స్ చేస్తూ నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఆ మధ్యన టీమిండియా వన్డే ప్రపంచకప్ గెలిస్తే విశాఖ బీచ్ లో స్ట్రీకింగ్ చేస్తానంటూ సంచలన ప్రకటన చేసింది ఈ అందాల తారే. ఇక పవన్ కల్యాణ్ కు వీరాభిమాని అయిన రేఖ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరఫున విస్తృతంగా ప్రచారం చేసింది. అలా పవన్ ఫ్యాన్స్ కు బాగా చేరువైపోయిందీ ముద్దుగుమ్మ.