యాపిల్‌ తోటలో జపనీస్‌ పండ్లు

యాపిల్‌ సాగుకు పేరొందిన హిమాచల్‌ ప్రదేశ్‌ కొండల్లో జపనీస్‌ పండు పెర్సిమన్‌ వైపు ఇటీవలి కాలంలో రైతులు మొగ్గు చూపుతున్నారు. తక్కువ పెట్టుబడి, శ్రమతో ఎక్కువ లాభాలు వస్తున్నందున కుల్లూ జిల్లా ఉద్యాన రైతులు పెర్సిమన్‌ సాగును క్రమంగా పెంచుతున్నారు. ఈ జిల్లాలో రెండేళ్ల కిందట 200 హెక్టార్లున్న వీటి సాగు ఇప్పుడు 404 హెక్టార్లకు చేరింది. మార్కెట్లో ఈ పండ్ల ధర కిలో రూ.వంద నుంచి రూ.200 వరకు పలుకుతోంది. పెట్టుబడి ఎక్కువ, ధర తక్కువ ఉండటంతో తాను దానిమ్మ తోటలను తొలగించి పెర్సిమన్‌ సాగు ప్రారంభించినట్లు యోగరాజ్‌ ఠాకుర్‌ అనే రైతు తెలిపారు. సెప్టెంబరు నెల నుంచే ఈ పండ్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ పండ్ల మొక్కలు కావాలని మిగతా ప్రాంతాల నుంచి ఉద్యానశాఖకు వినతులు అందుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ పంట సాగుకు హెక్టారుకు రూ.62,500 రాయితీ ఇస్తోంది. పెర్సిమన్‌లో పోషక విలువలు కూడా మెండుగా ఉన్నట్లు ఉద్యానశాఖ నిపుణుడు డాక్టర్‌ ఉత్తమ్‌ పరాశర్‌ తెలిపారు. హిమాలయ పర్వత శ్రేణుల్లోని ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్‌లలోనూ ఈ పండ్ల సాగు పెరుగుతోంది.


 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.