Kaithi 2: ఎట్టకేలకు వచ్చిన ఖైదీ సీక్వెల్‌పై అప్‌డేట్.. క్లారిటీ ఇచ్చిన హీరో

www.mannamweb.com


ఓ సినిమాకు సీక్వెల్ వస్తుందంటేనే పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. అలాంటిది ఓ యూనివర్స్.. సెన్సేషనల్ డైరెక్టర్.. అందులో మరో పార్ట్ అంటే.. ఇంక వాళ్లను ఆపడం సాధ్యమేనా..? ఇప్పుడలాంటి సంచలన సీక్వెల్‌పై అప్‌డేట్ వచ్చింది. చాలా రోజులుగా వేచి చూస్తున్న ఈ సినిమాపై స్వయంగా హీరోనే క్లారిటీ ఇచ్చాడు. ఇంతకీ ఏంటా సీక్వెల్..?

దక్షిణాదిన ఎంతోమంది సంచలన దర్శకులు ఉన్నారు.. కానీ యూనివర్స్ అనేది ఒకటి క్రియేట్ చేయొచ్చు.. ఓ సినిమా పాత్రలను మరో సినిమాలోకి తీసుకురావచ్చు అనే ఐడియాను మాత్రం లోకేష్ కనకరాజ్ పరిచయం చేసారు. తనకంటూ ఓ సినీ ప్రపంచాన్ని క్రియేట్ చేసారు. అదే దారిలోనే ప్రశాంత్ వర్మ, ప్రశాంత్ నీల్, నాగ్ అశ్విన్ లాంటి దర్శకులు వెళ్తున్నారిప్పుడు.

ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో లాంటి సినిమాలతో లోకేష్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు ఈయనతో సినిమా అంటే ఎగిరి గంతేస్తున్నారు హీరోలు. మరోవైపు లోకేష్ కూడా తన సినిమాల్లోని పాత్రల్నే తీసుకుని ఒక యూనివర్స్ క్రియేట్ చేస్తున్నారు. రజినీకాంత్ కూలీ మాత్రం దీనికి మినహాయింపు. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుందిప్పుడు.

లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగానే ఖైదీ 2పై చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. కార్తి కూడా ఈ చిత్రం ఉంటుందని చెప్పుకొచ్చారు. తాజాగా ఈ చిత్రంపై కన్ఫ్యూజన్ పోయి.. కన్ఫర్మేషన్ వచ్చింది. సమ్మర్ 2025 నుంచి ఖైదీ 2 సెట్స్‌పైకి వస్తుందని తెలిపారు కార్తి. తన నెక్ట్స్ సినిమా ఇదే అని క్లారిటీ ఇచ్చారు ఈ హీరో.

2019లో వచ్చిన ఖైదీ సెన్సేషనల్ హిట్ అయింది. అక్కడ్నుంచే LCU మొదలైంది. ఖైదీ 2తో పాటు విక్రమ్ 2, లియో 2 కూడా ప్లాన్ చేస్తున్నారు లోకేష్. తన యూనివర్స్‌లో కనీసం 10 సినిమాలకు సరిపోయే స్క్రిప్ట్స్ సిద్ధం చేసి పెట్టుకున్నారు లోకేష్. ఈ క్రమంలోనే ముందు ఖైదీ 2తో దీనికి ముహూర్తం పెడుతున్నారు.