పసుపును ఇలా తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలం..! తప్పక తెలుసుకోండి

www.mannamweb.com


పసుపు.. అల్లం కుటుంబానికి చెందిన మొక్క. ఇది ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అందిస్తుంది. పసుపులో ఉన్న కుర్కుమిన్ అనే యాక్టివ్ కాంపౌండ్ వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అయితే, ఈ ప్రయోజనాలన్నీ సంపూర్ణంగా అందాలంటే..పసుపును సరైన పద్ధతిలోనే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఏసమయంలో ఎలా తీసుకుంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయనేది ఇప్పుడు తెలుసుకుందాం..

పసుపు-వేడినీరు: ఉదయం ఖాళీ కడుపుతో అర టీస్పూన్ పసుపును ఒక గ్లాసు వేడి నీటిలో కలిపి తాగడం వల్ల శరీరం డిటాక్సిఫై అవుతుంది. అంతేకాదు దీనివల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఉపయోగపడుతుంది. తద్వారా బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. దీర్ఘకాలిక మంట గుండె జబ్బులు, క్యాన్సర్, అల్జీమర్స్ వ్యాధితో సహా అనేక రకాల ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. పసుపు నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరంలో మంట తగ్గుతుంది, ఇది దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది .

పసుపు-పాలు: రాత్రి పడుకునే ముందు ఒక కప్పు వేడి పాలలో పసుపు కలుపుకుని తాగండి. మంచి నిద్రతో పాటు, కొవ్వు కూడా తగ్గుతుంది. అజీర్తి, ఛాతీలో మంట వంటివి తగ్గిపోతాయి. కీళ్ల నొప్పుల నుంచి తప్పించుకోవచ్చు. ఇంకా రక్తపోటు నియంత్రణలో వుంచుతాయి. ఈ పాలలోని గుణాలు రోగ నిరోధక శక్తిని బలోపేతం అవుతుంది. జీవక్రియల పనితీరు మెరుగవుతుంది. దీనివల్ల అదనపు బరవు తగ్గి కంట్రోల్‌లో వుంటుంది. కేన్సర్ వచ్చే అవకాశాలను బాగా తగ్గిస్తుంది. కనుక పసుపు పాలను తాగుతూ వుంటే అనారోగ్యాలను దరి చేరనివ్వదు.

పసుపు, నిమ్మరసం తాగితే శరీరంలో కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపస్తాయి. కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. శ్వాసకోశ సమస్యల నుంచి రక్షణ కలిగిస్తాయి. పసుపు, నిమ్మరసం కలిపి సేవిస్తే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. పసుపు, నిమ్మ రసం వల్ల గుండె జబ్బులను దూరం పెట్టొచ్చు. వీటిలో ఉండే యాంటీయాక్సిడెంట్లు, యాంటీ డిప్రెసెంట్ గుణాలు ఒత్తిడిని తగ్గిస్తాయి. నిమ్మరసం, పసుపు మిశ్రమాన్ని ముఖానికి ఫేస్‌ ప్యాక్‌లా ఉపయోగించవచ్చు. చర్మ సమస్యలు తగ్గుతాయి. ముఖంను అందంగా మార్చుతుంది.

పసుపు -దాల్చిన చెక్క: పసుపు దాల్చిన చెక్క పొడిని కలిపి వేడి నీటిలో తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది, ఇది కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా వేగంగా బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. పెరుగుతున్న జీవక్రియతో పాటు, పసుపు శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది, దీని కోసం శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తుంది. ఇది జీవక్రియను పెంచుతుంది,కొవ్వును వేగంగా కరిగిస్తుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు వాపు,నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.

పసుపు- అల్లం టీ: తేనె, నిమ్మకాయలతో కలిపి అల్లం, పసుపు టీ తీసుకోవడం వల్ల వాపు తగ్గుతుంది. జీవక్రియ కూడా మెరుగుపడుతుంది. అల్లంలో జీర్ణం ఎంజైములు ఉత్పత్తి చేసే శక్తి ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థకు సహాయపడుతుంది. కాబట్టి ఈ రెండు కలిపి తీసుకోవడం వల్ల అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావు. పొట్ట ఆరోగ్యం చక్కగా ఉంటుంది. పసుపు, అల్లం ఈ రెండిట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కాబట్టి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంటు వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.