ప్యాకెట్ పాలను ఎక్కువ సేపు వేడి చేస్తే ఏమౌతుందో తెలుసా..? తప్పక తెలుసుకోండి..

www.mannamweb.com


పూర్వ కాలంలో గెదేలు, ఆవులు ఉన్న వారింటికి వెళ్లి అప్పుడే తీసిన పాలను తీసుకోని వచ్చే వారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఏకంగా గ్రామాలలో కూడా పాల ప్యాకెట్లు వచ్చాయి.

అయితే, స్థానికంగా పాలను కొన్నప్పుడు కచ్చితంగా వేడి చేయాల్సిందే. లేకపోతే బ్యాక్టీరియా నాశనం కాదు. పాలను వేడి చేయడానికి ముఖ్య కారణం అదే. కానీ, ప్యాకెట్ పాలను వేడి చేయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

పాలను పాశ్చరైజేషన్ చేసిన తర్వాతే ప్యాకింగ్ చేస్తారు. అంటే పాలలోని ప్రమాదకర బ్యాక్టీరియాను నాశనం చేయడానికి ప్రత్యేక ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తారు. అంటే 71డిగ్రీల సెల్సియస్ వద్ద వాటిని వేడి చేసి మళ్లీ సున్నా డిగ్రీల వద్ద చల్లబరుస్తారు. అనంతరం వాటిని ప్రాసెస్ చేసి ప్యాకింగ్ చేస్తారు. దీని వల్ల వివిధ రకాల అనారోగ్యాలు, వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా చనిపోతుంది. ఈ విధానంలో మైక్రో ఆర్గానిజంల సంఖ్య గణనీయంగా తగ్గించి పాలను వాడుకునేందుకు అనువుగా మారుస్తారు. ఇలాంటి పాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

అయితే 71డిగ్రీల సెల్సియస్ వద్ద వేడి చేసి చల్లబరిచిన పాలను మళ్లీ మనం అతిగా వేడి చేస్తే అందులోని పోషక విలువలు దెబ్బతింటాయని నిపుణులు అంటున్నారు. ప్యాకెట్ పాలను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూడా వేడి చేయడం వల్ల అందులోని విటమిన్ సి, విటమిన్ బి, ప్రోటీన్లు కూడా పోతాయని నిపుణులు చెబుతున్నారు. ప్యాకెట్ బాగా ఉండి, సరిగ్గా స్టోర్ చేసి ఉంటే ప్యాకెట్ పాలను మరిగించకుండా ఉపయోగించుకోవడమే మంచిది.

ప్యాకెట్ పాలు కాకుండా నేరుగా డైరీ నుంచి తీసుకొచ్చిన పాలను మాత్రం కచ్చితంగా వేడి చేయాల్సిందే. లేకపోతే హానికర బ్యాక్టీరియా శరీరంలోకి చేరిపోతుంది. ప్యాకెట్ పాలను పొంగే వరకు కాకుండా గోరు వెచ్చగా వేడి చేస్తే సరిపోతుంది. బ్యాక్టీరియా నాశనం అయి అవసరమైన పోషకాలు మిగులుతాయి.

అలాగే ప్యాకెట్ పాలను వాడేవారు కొన్ని జాగ్రత్తలు తప్పని సరిగా పాటించాలని నిపుణులు చెబుతున్నారు. పాలు పొయ్యి మీద పెట్టి ఐదు నిమిషాలపాటు వేడి చేస్తే చాలు. అంతకు మించి వాటిని వేడి చేయవద్దు అని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఏ రోజు ప్యాకెట్ పాలను ఆ రోజే వాడుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.