మంత్రి నారా లోకేశ్ విద్యార్థులకు శుభవార్త చెప్పారు. తల్లికి వందనం పథకం పెండింగ్ ఉన్న దరఖాస్తులకు లోకేశ్ ఆమోదం తెలిపారు. విద్యాశాఖపై సమీక్షించిన ఆయన ఈ పథకానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న రూ.325 కోట్లు విడుదల చేసే ఫైలుపై సంతకం చేశారు.
దీంతో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో త్వరలోనే నిధులు జమ కానున్నాయి. అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.
































