Nara Lokesh: విద్యార్థులకు శుభవార్త.. మంత్రి లోకేష్ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతోంది.


ఈ నేపథ్యంలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యావ్యవస్థపై దృష్టి సారించారు. గత వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం విద్యావ్యవస్థను నాశనం చేసిందని మంత్రి లోకేష్ ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, దేశంలోని ఉత్తమ ప్రమాణాలతో ఏపీలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక మోడల్ స్కూల్‌ను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు.

ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో భాగంగా లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రామ్‌ను అమలు చేయడానికి తీసుకోవాల్సిన చర్యలను ఆయన వివరించారు. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ మరియు ఉన్నత విద్యా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీ విద్యా నమూనా మరియు జీవో 117కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై రేపు (సోమవారం) శాసనసభ్యులతో వర్క్‌షాప్ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఉన్నత విద్యలో మార్పులు, NIRF ర్యాంకింగ్స్‌లో మెరుగుదల వంటి అంశాలపై చర్చించడానికి గవర్నర్ అధ్యక్షతన విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్‌తో త్వరలో సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని కూడా ఆయన అన్నారు.