ఇండియన్ రైల్వేలో వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలుబడింది.

ఇండియన్ రైల్వేలో వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలుబడింది. ఆర్ఆర్‌బీ ఇండియన్ రైల్వే శాఖ ఒకేసారి 8850 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.


ఇంటర్, డిగ్రీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. అర్హత ఉంటే వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి విద్యార్హత, పోస్టులు, వెకెన్సీలు, దరఖాస్తు విధానం, జీతం, వయస్సు తదితర వివరాల గురించి క్లియర్‌గా తెలుసుకుద్దాం.

RRB NTPC నుంచి 8,850 స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ తదితర ఉద్యోగాలను భర్త చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అక్టోబర్ 21 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. నవంబర్ 20న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 8850

రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, ట్రాఫిక్ అసిస్టెంట్ (మెట్రో రైల్వే), చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్ వైజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియ్ క్లర్క్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఉద్యోగాలకు వెకెన్సీలు ఉన్నాయి.

డిగ్రీ క్వాలిఫికేషన్.. (మొత్తం పోస్టులు 5817)

స్టేషన్ మాస్టర్ : 615 పోస్టులు

గూడ్స్ ట్రైన్ మేనేజర్: 3423 పోస్టులు

ట్రాఫిక్ అసిస్టెంట్ (మెట్రో రైల్వే): 59 పోస్టులు

చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్ వైజర్: 161 పోస్టులు

జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్: 921 పోస్టులు

సీనియ్ క్లర్క్ టైపిస్ట్: 638 పోస్టులు

ఇంటర్ క్వాలిఫికేషన్.. (మొత్తం పోస్టులు 3058)

జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 163 పోస్టులు

అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 394 పోస్టులు

ట్రైన్ క్లర్క్: 77 పోస్టులు

కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్: 2424 పోస్టులు

వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీ క్వాలిఫికేషన్ పోస్టులకు 18 నుంచి 36 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఇంటర్ క్వాలిఫికేషన్ పోస్టులకు 18 నుంచి 33 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

జీతం: నెలకు ప్రారంభ వేతనం రూ.35,400 వరకు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, మహిళా, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు రూ.250 ఫీజు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 అక్టోబర్ 21

దరఖాస్తుకు చివరి తేది : 2025 నవంబర్ 27

ఎగ్జామ్ డేట్స్ : త్వరలో ప్రకటించనున్నారు..

నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ సందర్శించవచ్చు

అఫీషియల్ వెబ్ సైట్:https://www.rrbcdg.gov.in/

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.