తిరుమల ఘాట్ రోడ్డులో.. రాత్రి 9 గంటల సమయంలో.. భక్తులు వీడియో తీయటంతో వెలుగులోకి..

లియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి శ్రీవారిని దర్శించుకుంటారు.


ఈ క్రమంలో కొంతమంది సొంత వాహనాల్లో తిరుమలకు చేరుకుంటే.. మరికొంత మంది ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకుని తిరుమలకు చేరుకుంటూ ఉంటారు. ఇక తిరుపతి నుంచి తిరుమలకు చేరుకోవడానికి రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఘాట్ రోడ్ల ద్వారా కొండపైకి చేరుకుంటే.. మరొకటి మెట్ల మార్గంలో తిరుమలకు రావటం. మెట్ల మార్గంలో వచ్చే భక్తులు అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల ద్వారా కొండపైకి వస్తుంటారు. ఇక వాహనాలలో వచ్చే భక్తులు ఘాట్ రోడ్ల ద్వారా తిరుమల కొండపైకి చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు.

అయితే మంగళవారం రాత్రి ఘాట్ రోడ్డు ద్వారా తిరుమలకు వచ్చే కొంతమంది భక్తులకు వింత అనుభవం ఎదురైంది. రెండో ఘాట్‌రోడ్డులో మంగళవారం రాత్రి కొండ చిలువ కలకలం రేపింది. 9 గంటల సమయంలో తిరుమల రెండో ఘాట్‌ రోడ్డులో కొండ చిలువ భక్తులకు కనిపించింది. కారులో వినాయక స్వామి ఆలయాన్ని దాటి వెళ్తున్న కొంతమంది భక్తులకు కొండ చిలువ కనిపించింది. దీంతో భక్తులు భయపడిపోయారు. మరి కొంతమంది భక్తులు కొండ చిలువను ఫోన్‌లో వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఎస్వీ గోశాలను పరిశీలించిన ఈవో

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోశాలను టీటీడీ ఈవో పరిశీలించారు. మంగళవారం రోజున టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గోశాలను పరిశీలించారు. గోశాల నిర్వహణపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గోవులకు అందుతున్న దాణా, వసతి వివరాలతో పాటుగా వాటికి అందిస్తున్న వైద్యం, తాగునీరు, పరిశుభ్రత వంటి అంశాల గురించి అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

మరోవైపు ఎస్వీ గోశాల వద్ద 500 గోవులకు సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ భవనాన్ని ఆధునిక వసతులతో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. టీటీడీ ఈవో ఈ భవనాన్ని పరిశీలించారు. గోవులు, దూడలు ఉంటున్న షెడ్లను పరిశీలించారు. గోశాలలోని పశువుల సంఖ్య, అగరుబత్తీల యూనిట్, దాణా మిక్సింగ్ ప్లాంట్ కార్యాకలాపాలను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పరిశీలించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.