ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణమురళికి స్వల్ప ఊరట..

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పోసాని కృష్ణ మురళికి స్వల్ప ఊరట లభించింది. విశాఖపట్నం, చిత్తూరు జిల్లాల్లో నమోదైన కేసుల్లో తొందర పాటు చర్యలు వద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇంకా పీటీ వారెంట్లు జారీ చేయలేదని న్యాయస్థానానికి ఏపీ సర్కార్ తెలిపింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది కోర్టు.