ఉపాధ్యాయుల పై యాప్స్ భారం తగ్గించండి – తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం (TNUS )

ఉపాధ్యాయుల పై యాప్స్ భారం తగ్గించండి – తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం (TNUS )


విద్యా శాఖ మంత్రి లోకేష్ గారు ఉపాధ్యాయుల పై యాప్ ల భారం ని తగ్గించండి అని ఆదేశాలు ఇచ్చిన తరువాత కూడా అధికారులు స్పందించి యాప్స్ భారం తగ్గించలేదని అన్ని యాప్స్ అలానే ఉన్నాయి అని ప్రతి రోజు ఏదో ఒక గూగుల్ ఫారం ఇవ్వడం దానిని సాయంత్రం లోగా పూర్తి చేసి పంపండి.. అతి జరుర్ అంటూ వాట్సప్ లలో రాష్ట్ర, జిల్లా స్థాయి విద్యా శాఖ అధికారులు సందేశాలు పంపుతూ ఉన్నారని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం ఒక ప్రకటన లో తెలిపింది.

విద్యా శాఖ చేపడుతున్న కార్యక్రమాలు లో కూడా గందరగోళం ఉందని బడికి పోతా, విద్యా ప్రవేశ్ అనే రెండు కార్యక్రమాలు ఒకే లక్ష్యం తో ఏర్పాటు చేసారని నెలల పాటు ఉన్నాయని ఇది బోధన పై ప్రభావం చూపుతుందని , టీచ్ టూల్ ప్రోగ్రాం పేరిట శిక్షణలు, పాఠశాల ల విజిట్స్ తో ఉపాధ్యాయులు బోధన కు దూరం అయ్యే పరిస్థితి ఉందని అలానే
ఆన్లైన్ వర్క్స్ ఉపాధ్యాయులకు లేకుండా చేయాలనీ, బోధనేతర కార్యక్రమాలు లేకుండా చేయాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్, శ్రీరామ శెట్టి వెంకటేశ్వర్లు, గౌరవాధ్యక్షుడు యం. రజిని బాబు నాయుడు, ఆర్ధిక కార్యదర్శి పినాకపాణి ఒక ప్రకటన లో విద్యా శాఖ అధికారులను కోరారు.