దేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అగ్నివీర్లకు చాలా ప్రత్యేకమైన బహుమతిని అందించింది. ఇప్పుడు అగ్నివీర్ పథకం కింద సేవలందిస్తున్న అగ్నివీర్లు ఎటువంటి హామీ లేకుండా రూ.4 లక్షల వరకు వ్యక్తిగత రుణాన్ని పొందగలుగుతారు.
కొన్ని సంవత్సరాలు సైన్యంలో సేవలందించడం ద్వారా దేశాన్ని రక్షించే యువతకు సాధికారత కల్పించే దిశలో ఈ అడుగు వేసింది.
ఎలాంటి పుచ్చికత్తు, ప్రాసెసింగ్ ఫీజు లేకుండా రుణం:
ఈ పథకం కింద అగ్నివీర్స్ రుణానికి ఎలాంటి ఆస్తి లేదా హామీని అందించాల్సిన అవసరం లేదు. అలాగే రుణం తీసుకోవడంపై వసూలు చేసే ప్రాసెసింగ్ రుసుమును కూడా పూర్తిగా రద్దు చేశారు. అంటే అగ్నివీర్స్ రుణం తీసుకోవడానికి ఎటువంటి అదనపు ఖర్చులను భరించాల్సిన అవసరం లేదు.
ఈ పథకం SBIలో సాలరీ అకౌంట్ ఉన్న అగ్నివీర్లకు మాత్రమే అని SBI తెలిపింది. దీని కారణంగా అగ్నివీర్ల ఆదాయం, సర్వీస్ స్టేటస్ గురించి బ్యాంకు వద్ద ఇప్పటికే సమాచారం ఉంటుంది. ఇది రుణ ప్రక్రియను మరింత సులభతరం చేస్తుంది.
తిరిగి చెల్లింపులో కూడా ఉపశమనం:
SBI రుణ చెల్లింపును సులభతరం, సరళంగా చేసింది. అగ్నివీర్లు సైన్యంలో సేవ చేయాల్సిన కాలంలోనే ఈ రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల వారికి ఎటువంటి అదనపు ఆర్థిక ఒత్తిడి ఉండదు. వారి సేవా కాలంలో వారు రుణాన్ని హాయిగా తిరిగి చెల్లించవచ్చు.
రక్షణ సిబ్బందికి ప్రత్యేక వడ్డీ రేటు:
ఎస్బీఐ అగ్నివీరులకు మాత్రమే కాకుండా అన్ని రక్షణ సిబ్బందికి కూడా మరో పెద్ద ఉపశమనం ఇచ్చింది. 30 సెప్టెంబర్ 2025 వరకు అన్ని రక్షణ దళ సిబ్బందికి వ్యక్తిగత రుణాలపై కనీస వడ్డీ రేటు 10.50% మాత్రమే అందిస్తోంది. సాధారణంగా ఈ రేట్లు దీని కంటే ఎక్కువగా ఉంటాయి.
అగ్ని వీరులకు పూర్తి మద్దతు ఉంటుంది: ఎస్బీఐ ఛైర్మన్:
ఈ పథకాన్ని ప్రకటిస్తూ SBI చైర్మన్ C.S. శెట్టి మాట్లాడుతూ.. “దేశాన్ని రక్షించడానికి తమ జీవితాలను అంకితం చేసే యువత తమ భవిష్యత్తును రూపొందించుకోవడానికి మా పూర్తి మద్దతు ఉంటుంది. ఈ జీరో ప్రాసెసింగ్ ఫీజు కేవలం ప్రారంభం మాత్రమే. రాబోయే కాలంలో ప్రతి అడుగులోనూ మన హీరోలను బలోపేతం చేసే ఇలాంటి ఉత్పత్తులను తీసుకువస్తాము.” అని అన్నారు.
































