కాకినాడకు చెందిన భాను ప్రకాష్ అనే కుర్రాడు కొత్త ఇన్నోవేషన్స్ తో అందరినీ అబ్బురపరుస్తున్నాడు. మధ్యతరగతి వారికి ఉపయోగపడే విధంగా టెక్నికల్గా క్రియేటివిటీతో బ్యాటరీ వాహనాలు తయారు హౌరా అనిపిస్తున్నాడు. సాధారణంగా ఆటో గాని టాటా ఏసీ గాని కొనాలంటే 10 లక్షల పై నే వెచ్చించాలి… కానీ ఈ కుర్రోడు మాత్రం కేవలం లక్ష రూపాయలతోనే ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారు చేశాడు.
కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ గంగనాపల్లి గ్రామాని కి చెందిన భాను ప్రకాష్ .. జేఎన్టీయూలో ఎంటెక్ చదువుతున్నాడు. అందరి విద్యార్థుల కాకుండా ఏదో సాధించాలనే తపనతో.. సోలార్ వెహికల్స్, చార్జింగ్ వెహికల్స్ హ్యూమన్ హైబ్రిడ్ వెహికల్స్ తో కొత్త ఆవిష్కరణలు సృష్టించడం స్టార్ట్ చేశాడు. సూర్యుడు ఉన్నంతసేపు వెహికల్ మూవ్ అయ్యేలా ఒక సరికొత్త వాహనాన్ని డిజైన్ చేశాడు. మరోవైపు ట్రైన్ కి ఏ విధంగా ఎలక్ట్రికల్ వైర్ సపోర్ట్ సిస్టం ఉంటుందో అదే విధంగా రోడ్డు మీద కూడా టూ వీలర్ త్రీ వీలర్స్ వెళ్లేలా డిజైన్ చేశాడు. ఇలా కొత్త కొత్త ఇన్నోవేషన్ తో సరికొత్తగా ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాడు.
తనకు సపోర్ట్ చేస్తే మరింత కష్టపడతానని భాను ప్రకాష్ చెప్తున్నాడు. ఇటువంటి వెహికల్స్ వల్ల పొల్యూషన్ కూడా ఉండదు.. ఈజీ మూమెంట్ ఉంటుంది.. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది అంటున్నాడు.. ప్రస్తుతానికి అన్ని నామమాత్రపు వస్తువులతో వీటిని ఆవిష్కరించినప్పటికీ.. పెట్టుబడి పెడితే మరింత ఐడియాలజీతో ఈ వాహణాలను అప్డేట్ చేయవచ్చని చెప్తున్నాడు
భాను ప్రకాష్ చిన్నప్పటినుంచి ఏదో సాధించాలనే తపన ఉంది.. రెండు ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారు చేయడంలో ఎంతో సుదీర్ఘ కష్టం ఉంది.. పెట్రోల్ డీజిల్ అవసరం లేకుండా నాచురల్ గా వెహికల్స్ మూవ్ అవుతాయి. ఈ టెక్నాలజీ దేశానికి కూడా ఎంతో ఉపయోగపడుతుందని భాను ప్రకాష్ అంటున్నాడు. గతంలో ఈ మోడల్స్ తో లక్షలు పెట్టి తయారుచేసిన ఇన్నోవేషన్స్ ఉన్నాయి. కానీ వాటి అన్నింటికీ అప్డేట్గా భాను ఆలోచించాడు. ఇందులో ఇద్దరు నుంచి ముగ్గురు కూర్చునేలా వెహికల్స్ డిజైన్ చేశాడు. ఈ వెహికల్స్ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50 కిలోమీటర్ల నుంచి 80 కిలోమీటర్ల వరకు మైలేజ్ వస్తుందని భాను చెప్తున్నాడు.
మొత్తానికి భాను ప్రకాష్ సరికొత్తగా ఆలోచించి సోలార్, హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారు చేశాడు.. అవి మార్కెట్లోకి రావాలంటే దానికి అనుగుణంగా పెట్టుబడి కావాలి.. తనకి సపోర్ట్ చేస్తే మరింత గ్రౌండ్ వర్క్ చేస్తానని భాను అంటున్నాడు.. దానికి సంబంధించి డిజైనర్ లలో మార్పులు కూడా ప్లాన్ చేస్తున్నాడు.
































