మామూలుగా ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉండడం అన్నది కామన్. కొందరికి కష్టాలు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతే మరికొందరికి మాత్రం బతికినంత కాలం కష్టాలు సమస్యలు వేధిస్తూనే ఉంటాయి.
ఒక సమస్య తర్వాత మరొక సమస్యలు వేధిస్తూనే ఉంటాయి. ఇలా సమస్యలు చుట్టుముట్టినప్పుడు దేవుడిఫై భారం వేస్తూ ఉంటారు. దేవుడిని నమ్మి కొన్ని పనులు చెయ్యడం వల్ల కష్టాల నుండి గట్టెక్కుతామని అనుకుంటారు. అందుకే బాధలు, కష్టాలలో ఉన్నప్పుడు చాలామంది పరిహారాలు పాటిస్తారు.
దీని వల్ల మానసిక ఊరట లభించడంతో పాటుగా,కష్టాల నుండి మనసు పాజిటివ్ వైపు మళ్లుతుందట. ఆదివారం రోజు కొన్ని పరిహారాలు పాటిస్తే కష్టాల నుండి గట్టెక్కవచ్చని చెబుతున్నారు. ఇంతకీ ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆదివారం సూర్య భగవానుడికి చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజు సూర్య భగవానుడిని ఆరాధిస్తారు. సూర్య భగవానుడికి కొన్ని పరిహారాలు పాటిస్తే కష్టాల నుండి గట్టెక్కవచ్చట. ఆదివారం ఉదయం స్నానం చేసి తూర్పు వైపు తిరిగి నీటిని అర్ఘ్యం సమర్పించాలట. కాగా అర్ఘ్యాన్ని సాధారణంగా అయినా సమర్పించవచ్చు లేదా నదీ ప్రాంతంలో, సముద్రం నీరు పారే ప్రాంతంలో అయినా సమర్పించవచ్చట.
ఇలా చేయడం చాలా మంచిదని చెబుతున్నారు. అర్ఘ్యం సమర్పించేటప్పుడు “ఓం సూర్యాయ నమః,ఓం వాసుదేవాయ నమః,ఓం ఆదిత్యాయ నమః” అనే మంత్రాలు జపించాలట. అలాగే ఆదివారం రోజు పేదవారికి బెల్లం, పాలు, బియ్యం, ఎరుపు రంగు వస్త్రాలు, రాగి పాత్రలు దానం చెయ్యాలట. ఇలా చేయడం వల్ల జాతకంలో గ్రహాల స్థానం సక్రమంగా మారడం మొదలవుతుందని చెబుతున్నారు. ఆదివారం రోజు ఇంటి ప్రధాన ద్వారం వద్ద నెయ్యి దీపం వెలిగించాలట. ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని చెబుతున్నారు. ఇంట్లో ఉన్న చెడు శక్తి కూడా తొలగిపోతుందట. దుష్ట శక్తులు ఇంట్లో ప్రవేశించవని చెబుతున్నారు. ఆదివారం పూజ చేసిన తరువాత చందన తిలకాన్ని నుదుటన ధరించాలట. ఇలా చేయడం వల్ల పనిలో అడ్డంకులు తొలగిపోతాయని చెబుతున్నారు. అలాగే కష్టాల నుండి ఉపశమనం లభిస్తుందట.