ఏపీ ప్రజలకు సూపర్ న్యూస్.. ఇకపై ప్రతి శుక్రవారం, కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ప్రజల్లో మన మిత్ర వాట్సాప్ సేవలపై అవగాహన కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులతో ప్రతి శుక్రవారం డోర్ టు డోర్ క్యాంపెయిన్ ప్రారంభిస్తోంది.


ఏపీ ప్రభుత్వం 2025 నవంబర్ 7 (శుక్రవారం) నుంచి “మన మిత్ర” వాట్సాప్ ఆధారిత సేవలపై డోర్ టు డోర్ క్యాంపెయిన్ ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారం రాష్ట్రంలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాలలో కొనసాగుతుంది. ప్రతి కుటుంబానికి మన మిత్ర యాప్ సేవల అవగాహన కల్పించడం, వాట్సాప్ ద్వారా డిజిటల్ సేవల వినియోగాన్ని పెంచడం.

గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ప్రతి శుక్రవారం డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహిస్తారు. వాట్సాప్ ద్వారా సేవలు ఎలా పొందాలో ప్రదర్శన (Demonstration) చేస్తారు. పాంప్లేట్లు పంపిణీ చేసి, QR కోడ్‌లను పంపిస్తారు. కవర్ చేసిన ఇళ్ల సంఖ్య, నమోదైన పౌరుల వివరాలు నమోదు చేస్తారు. పంచాయతీ సెక్రటరీలు, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ సమన్వయం చేస్తారు. అన్ని ఇళ్లు కవర్ చేసేలా ప్లాన్ చేశారు. వీఆర్వోలు, సర్వే అసిస్టెంట్లు, వార్డ్ రెవెన్యూ సెక్రటరీలో రెవెన్యూ, ల్యాండ్ సంబంధిత సేవలపై అవగాహన కల్పిస్తారు.

ఎనర్జీ అసిస్టెంట్లు, ఎనర్జీ సెక్రటరీలు విద్యుత్ బిల్లులు, కొత్త కనెక్షన్లు, ఫిర్యాదులపై వాట్సాప్ సేవల గురించి వివరిస్తారు. అగ్రకల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్, వెటర్నరీ, ఫిషరీస్, ఏఎన్‌ఎం, వార్డ్ హెల్త్ సెక్రటరీలు ఆయా శాఖల వారీగా వాట్సాప్ సేవలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల అధికారులు కార్యక్రమ ప్రగతిని పర్యవేక్షించి, నవంబర్ 8 నాటికి రిపోర్ట్ పంపిస్తారు. మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు అవసరమైన లాజిస్టిక్స్, ప్రచారం, సపోర్ట్ అందిస్తారు. ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్‌లో భాగంగా మన మిత్రను తీసుకొచ్చింది. చాలామంది ప్రజలకు దీనిపై అవగాహన లేదు. ఈ క్రమంలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి శుక్రవారం డోర్ టు డోర్ క్యాంపెయిన్ ప్రారంభించబోతోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.