సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ .. దిమ్మ తిరిగే ట్విస్టులతో మైండ్ బ్లాక్

www.mannamweb.com


బిచ్చగాడు తో తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా చేరువైపోయాడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోని. గతంలో ఎక్కువగా డిఫరెంట్ కథలతో లు తీసిన అతను ఈ మధ్యన ఎక్కువగా సస్పెన్స్, థ్రిల్లర్ లను తెరకెక్కిస్తున్నాడు.

అలా విజయ్ ఆంటోని నటించిన తాజా చిత్రం హిట్లర్. సెప్టెంబర్ 27న తమిళంలో ఈ మూవీ రిలీజైంది. అయితే ఎన్టీఆర్ దేవర బరిలో ఉండడంతో తెలుగులో ఈ ను రిలీజ్ చేయలేదు. తమిళంలోనూ ఈ కు నెగెటివ్ టాక్ వచ్చింది. అయతే కథ, కథనాలు, టేకింగ్ పరంగా విజయ్ ఆంటోని కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సస్పెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండడంతో హిట్లర్ ఓ మోస్తరు వసూళ్లను సాధించింది. ఇప్పుడీ మూవీ ఓటీటీలోకి వస్తోంది. హిట్లర్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌ వీడియో కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 25 నుంచి విజయ్ ఆంటోని ను ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. అలాగే హిట్లర్ కు సంబంధించి ఒక పోస్టర్ ను కూడా పంచుకుంది. అంటే ఇవాళ్టి అర్ధరాత్రి నుంచే హిట్లర్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు రానుందన్న మాట. ఈ మూవీలో విజయ్ ఆంటోనీకి జోడీగా రియా సుమన్ హీరోయిన్‌గా నటించింది. గౌతమ్ వాసుదేవమీనన్‌, చరణ్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

హిట్లర్ కు ధన దర్శకత్వం వహించారు. ఈయన మరెవరో కాదు లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంకు ప్రియ శిష్యుడు. ఇక కథ విషయానికి వస్తే.. మినిస్టర్ మైఖేల్ కు చెందిన మనుషులు ఒక్కొక్కరు దారుణ హత్యకు గురవుతుంటారు. అలాగే మినిస్టర్‌కు చెందిన కోట్ల రూపాయల బ్లాక్ మనీని ఓ అపరిచిత వ్యక్తి అత్యంత చాక చక్యంతో అపహరించుకుపోతాడు. మరి మినిస్టర్ పై పగ బట్టిన ఆ వ్యక్తి ఎవరు?ఈ కేసును ఎలా ఇన్వెస్టిగేషన్ చేసారు అన్నది హిట్లర్ స్టోరీ. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ లు బాగా చూసే వారికి హిట్లర్ కూడా ఒక టైమ్ పాస్ మూవీగా ఎంజాయ్ చేయవచ్చు.

ఇవాళ్టి అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ కు రానున్న హిట్లర్..