టీచర్ల బదిలీ ఉత్తర్వులు నిలిపివేత

టీచర్ల బదిలీ ఉత్తర్వులు నిలిపివేత
రాష్ట్రంలో టీచర్ల బదిలీలపై ఎన్నికల కోడ్‌కు ముందు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేశారు. ఎలాంటి బదిలీలు చేపట్టవద్దని డీఈవోలను ఆదేశించారు. ఈ మేరకు పాఠశాల విద్యా కమిషనర్‌ ఎస్‌.సురేష్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికలకు ముందు మొత్తం 1800 మంది టీచర్లను బదిలీ చేయాలని గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. సీఎం పేషీలోని కొందరు అధికారుల ఒత్తిడితో పైరవీలు, సిఫార్సులు జరిగాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు.