Paracetamol: వామ్మో.. పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటున్నారా..? ఈ విషయం తెలిస్తే గుండే గుభేలే..

www.mannamweb.com


తలనొప్పి అయినా.. శరీరంలోని ఏ ప్రాంతంలో నొప్పి అయినా.. డాక్టర్లు వెంటనే పారసెట్‌మాల్ ట్యాబ్లెట్‌ను రిఫర్ చేస్తారు.. అందుకే.. తీవ్రమైన నొప్పిని తగ్గించడానికి, నొప్పిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పారాసెటమాల్ ట్యాబ్లెట్ నమ్మదగిన మందులలో ఒకటిగా పరిగణిస్తారు.
ఇది నొప్పి నివారిణితోపాటు.. యాంటిపైరేటిక్ (ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది). ఇది ఇతర మందులతో పాటు తీసుకోవచ్చు. అయితే, దశాబ్దాల పాటు నిరూపితమైన సమర్థతతో, ఈ టాబ్లెట్‌లు అవాంతరాలు లేకుండా వేగంగా పని చేసి తీవ్రమైన నొప్పి నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. అయితే పారాసెటమాల్‌ను రెగ్యులర్‌గా తీసుకునే వ్యక్తులకు నిపుణులు ప్రమాదకరమైన ఆరోగ్య హెచ్చరికను జారీ చేశారు. యూనివర్శిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్‌లోని బృందం నిర్వహించిన కొత్త అధ్యయనం షాకింగ్ విషయాలను వెల్లడించింది. ఎలుకలపై ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఎలుకలపై ఈ ఔషధం ప్రయోగించగా.. ఇది తీసుకోవడం వల్ల కలిగే ప్రభావాలను గమనించి, అది ప్రత్యక్ష నష్టాన్ని కలిగిస్తుందని అధ్యయనం నిర్ధారించింది. ఈ ఆవిష్కరణ ఔషధం వల్ల కలిగే హానిని ఎదుర్కోవడానికి చికిత్సలపై పరిశోధనను తెలియజేయగలదని బృందం తెలిపింది.
ఔషధం అధిక మోతాదు తీసుకునే రోగులపై ఈ ప్రభావాలు కనిపిస్తాయని పరిశోధకులు హెచ్చరించారు. దీర్ఘకాలిక నొప్పి ఉన్న రోగులకు రోజుకు నాలుగు గ్రాముల పారాసెటమాల్ సాధారణ మోతాదు అని పేర్కొన్నారు. అయితే, దీనిని ఎక్కువగా ఉపయోగిస్తే దుష్ప్రభావం చూపిస్తుందని పేర్కొంది.

“ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు మానవ, ఎలుక కణజాలంలో కాలేయ కణాలపై పారాసెటమాల్ ప్రభావాన్ని అధ్యయనం చేశారు. కొన్ని సందర్భాల్లో పారాసెటమాల్ అవయవంలోని ప్రక్కనే ఉన్న కణాల మధ్య ముఖ్యమైన నిర్మాణ సంబంధాలకు హాని కలిగించడం ద్వారా కాలేయాన్ని దెబ్బతీస్తుందని పరీక్షలు చూపించాయి” అని అధ్యయనం తెలిపింది.

“ఈ సెల్ వాల్ కనెక్షన్‌లు – టైట్ జంక్షన్‌లు అని పిలుస్తారు – అంతరాయం ఏర్పడినప్పుడు, కాలేయ కణజాల నిర్మాణం దెబ్బతింటుంది. కణాలు సరిగా పనిచేయలేవు.. అవి చనిపోవచ్చు” అని అధ్యయన నిపుణులు తెలిపారు.
హెపటైటిస్, సిర్రోసిస్, క్యాన్సర్ వంటి పరిస్థితులలో కనిపించే విధంగా.. పారాసెటమాల్ టాక్సిసిటీని కాలేయం దెబ్బతినడానికి పనిచేస్తుందని ఒక అధ్యయనం చెప్పడం ఇదే మొదటిసారి.

ఎడిన్‌బర్గ్, ఓస్లో విశ్వవిద్యాలయాలు, స్కాటిష్ నేషనల్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ సర్వీస్‌ల పరిశోధకులు పాల్గొన్న ఈ అధ్యయనం సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురితమైంది.