రెడ్‌మి బడ్జెట్ సౌండ్ సిస్టమ్.. వైర్‌లెస్ సబ్ వూఫర్‌తో వస్తుంది.

ర్త్ డే పార్టీలు, ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఇలా ప్రతి వేడుకలో మ్యూజిక్ సిస్టమ్ ఖచ్చితంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎలక్ట్రానిక్ కంపెనీలు అద్భుతమైన సౌండ్ క్వాలిటీతో స్పీకర్స్ ను తీసుకొస్తున్నాయి.


తాజాగా Xiaomi Redmi సౌండ్‌బార్ స్పీకర్ 2 ప్రోను రిలీజ్ చేసింది. ఈ కొత్త సౌండ్‌బార్ సిస్టమ్ వైర్‌లెస్ సబ్ వూఫర్‌తో వస్తుంది. RGB లైటింగ్ వంటి విజువల్ ఫీచర్‌లను కలిగి ఉంటుంది. కంపెనీ దీనిని ప్రత్యేకంగా కాంపాక్ట్ స్పేస్‌లు, డెస్క్ సెటప్‌లు, హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ యూజర్ల కోసం రూపొందించింది.

ఈ సెటప్‌లో రెండు స్పీకర్లు, రెండు పాసివ్ రేడియేటర్‌లు ఉన్నాయి. ఈ సౌండ్ సిస్టమ్ కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.3కి మద్దతు ఇస్తుంది. రెడ్‌మి సౌండ్‌బార్ స్పీకర్ 2 ప్రోలో ప్రధాన సౌండ్‌బార్ యూనిట్‌లో వైర్‌లెస్ సబ్‌ వూఫర్ ఇంటిగ్రేట్ చేశారు. సబ్‌ వూఫర్‌కు ప్రత్యేక పవర్ సోర్స్ అవసరం అయినప్పటికీ, వైర్‌లెస్ కనెక్షన్ దానిని గదిలోని ఏ మూలలోనైనా సులభంగా ఏర్పాటు చేసుకోవచ్చు. రెడ్‌మి సౌండ్‌బార్ స్పీకర్ 2 ప్రో చైనాలో 499 యువాన్లకు విడుదలైంది. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 6,500. కంపెనీ దాని గ్లోబల్ లేదా ఇండియా లాంచ్ గురించి అధికారికంగా వెల్లడించలేదు.

సౌండ్‌బార్‌లో రెండు స్పీకర్లు, రెండు పాసివ్ రేడియేటర్‌లతో సహా నాలుగు డ్రైవర్లు ఉన్నాయి. ఇవి 53-డిగ్రీల కోణంలో ట్యూన్ చేశారు. వైర్‌లెస్ సబ్‌ వూఫర్ 96mm డ్రైవర్‌ను కలిగి ఉంది, ఇది 60Hz వరకు బాస్ ఫ్రీక్వెన్సీలను అందించగలదని కంపెనీ పేర్కొంది. ఈ సౌండ్‌బార్ ముఖ్య లక్షణం దాని RGB లైటింగ్ సిస్టమ్. కనెక్టివిటీ కోసం, Redmi సౌండ్‌బార్ స్పీకర్ 2 ప్రో బ్లూటూత్ 5.3కి మద్దతు ఇస్తుంది. ఇది USB పోర్ట్ , హెడ్‌ఫోన్ జాక్‌ను కూడా కలిగి ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.